Publish Date:Aug 28, 2025
భూమన కరుణాకర్ రెడ్డి, బీఆర్ నాయుడు మధ్య వ్యవహారం పీక్ స్టేజీకి చేరిపోయినట్టుంది? ఒకరికొకరు టీటీడీ వ్యవస్థాగత విమర్శల స్థాయిని మరచి వ్యక్తిగత ఆరోపణల వరకూ వచ్చేశారు. అయితే బీఆర్ నాయుడు ఎక్కడ భూమన బాగోతమంతా తిరగదోడుతాడో అన్న భయాందోళన నుంచి ఒక బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ కి తెరలేపినట్టు కనిపిస్తోంది.
మేమొచ్చాక మొత్తం ప్రక్షాళన చేస్తామని చెప్పిన బీఆర్ నాయుడుకు అడుగడుగునా ఆటంకాలు కలిగిస్తూనే వస్తున్నారు భూమన. అందులో మొదటిది గోశాల గోవుల మరణాల వ్యవహారం కాగా, రెండోది కాస్తంత సీవియర్ గానే ఉండేలా జాగ్రత్త పడ్డారు. ముక్కోటి టికెట్ల విషయంలో ఏకంగా తోపులాటను సృష్టించి అందులో ఆరుగురు చనిపోయినట్టుగా చిత్రీకరించారు. ఇదంతా టీటీడీ దాని పాలక మండలి ఆపై దాని నిర్వాకం మీద పెద్ద ఎత్తున నింద వేశారు.
ఇక ఆలయం ముందుకు చెప్పులు వేసుకుని వెళ్లేలా చేసి.. వాటి ద్వారా.. ఒక వివాదం సృష్టించాలని చూశారు. ఆపై ఒక రెడ్డి సభ్యుడితో ఆలయం ముందు బూతులు తిట్టించి అలాక్కూడా బీఆర్ నాయుడు బదనాం అయ్యేలా చేశారు.
ఇప్పుడు సుధాకర్ రెడ్డిని రెచ్చగొట్టించి.. ఆయన ద్వారా తిరుపతికి ఒక మంత్రి కేవలం రాసలీలలు చేయడానికే వస్తారన్న కామెంట్లు గుప్పించారు. ఇక అక్కడితో ఆగక బీఆర్ నాయుడు ఒక బంట్రోతు స్థాయి నుంచి ఒక ట్రావెల్ ఏజెంట్ స్తాయి నుంచి టీవీఫైవ్ అధినేతగా ఎలా ఎదిగారన్న పాత చరిత్రను తిరగదోడారు. ఆపై కాళేశ్వర్ బాబా చావు వెనక బీఆర్ నాయుడు హస్తం ఉందంటూ గత చరిత్ర తవ్వి పోశారు.
అలాక్కూడా బీఆర్ నాయుడు భయపడ్డం లేదని చెప్పి కొత్తగా జూబ్లిహిల్స్ ఓపెన్ ల్యాండ్స్ వ్యవహారం బయటకు తీశారు. ఆపై మంచి రేవుల భూముల ఇష్యూ సైతం వెలుగులోకి తెచ్చారు. వీటన్నిటిని బట్టీ చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ కేంద్రంగా పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపినట్టే ఉందని అంటున్నారు చాలా మంది.
బీఆర్ కూడా గతంలో చేసిన కామెంట్లను బట్టీ చూస్తే ఒక దశలో వీరంతా కలసి.. చేసిన నిర్వాకానికి టీటీడీ అప్పుల్లో కూరుకుపోవల్సి వచ్చేదని తెలుస్తోంది.. అలనాడు పురాణ ఇతిహాసాల్లో చెప్పినట్టు వెంకన్న తిరిగి అప్పు తీస్కోవల్సి వచ్చేదని... అందుకే వెంకన్న వీరికెలాగైనా సరే బుద్ధి చెప్పాలన్న కోణంలో.. 11 సీట్ల పంగనామాల గుణపాఠం చెప్పారని.. అంటారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhumana-karunakar-reddy-39-205178.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.