Publish Date:Aug 27, 2025
భూమన ఐఏఎస్ శ్రీలక్ష్మి గురించి మాట్లాడుతూ.. ఆమె ఒక తాటకి, పూతన, లంకిణి.. ఆధునిక రజియా సుల్తానా అంటూ మండి పడ్డారు. మనకు తాటకి తెలుసు, రామాయణంలో కనిపిస్తుందీ పాత్ర. ఇక పూతన అంటే భాగవతంలో వస్తుంది. లంకిణి కూడా రామాయణ పాత్రే. రజియా సుల్తానా ఎవరనే దగ్గర అందరి ఆలోచనలు ఆగిపోతున్నాయ్.
ఒక వేళ అదే నిజమైతే.. రజియా సుల్తానా ఢిల్లీ సుల్తానేట్- మొదటి మహిళా పాలకురాలిగా చెప్పాల్సి వస్తుందని అంటారు. ఆమె 1236 నుంచి 1240 వరకూ ఢిల్లీని పాలించారు. ఆమె మహిళ అయినా ఆనాటి స్థితిగతులను తనకు అనువుగా మార్చుకుని, పురుషాధిక్యతను అధిగమించి.. సింహాసనం అధిరోహించి.. సైన్యాన్ని నడిపించి, రాజ్య వ్యవహారాలు చూసుకున్న ఏకైక డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ లేడీ లీడర్ గా చెబుతుంది ఆమె బయోగ్రఫీ.
ఆమె ఎలాంటి దుస్తులు లేకుండా.. బహిరంగ ప్రదేశాల్లో గుర్రాలపై, ఏనుగులపై సవారీ చేసేదని అంటారు. సైనికులతో కలసి యుద్ధరంగంలో పోరాడేదని చెబుతుంది చరిత్ర. అంతే కాదు.. ఆమె పేరిట పలు సైనిక విజయాలు కూడా లిఖించబడ్డాయి. ఆమె తన రాజ్యానికి చెందిన సొంత నాణేలపై సుల్తానాగా తన పేరు లిఖింప చేసుకున్నారు. మాములుగా అయితే ఆమె పేరు కేవలం రజియా మాత్రమే. కానీ తనకు తాను ఒక సుల్తాన్ గా ప్రకటించుకున్న ధీరోదాత్తగా పేరు.
ఇదంతా ఇలా ఉంటే.. ఒకప్పుడు కలెక్టర్ శ్రీలక్ష్మి అంటే అదో నేమ్ అండ్ ఫేమ్. అప్పట్లో ఆమె నెల్లూరు కలెక్టర్ గా పని చేస్తున్నపుడు ఎందరో ఆడపిల్లలకు ఐఏఎస్ అనే ఒకానొక పదం తమ పేరు తర్వాత తగిలించుకోవడం ఒక ప్యాషన్ గా మార్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. అలాంటి శ్రీలక్ష్మి వైయస్ హయాంలో.. భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే చెడ్డ పేరు మూట కట్టుకున్నారు. ఒక సమయంలో ఆమె చేత చేయించుకోవాల్సిన సంతకాలు అన్నీ చేయించుకుని.. ఇప్పుడామెను తాటకి, పూతన, అభినవ రజియా అంటూ లేని పోని మారు పేర్లను తగిలించడం.. ఏమనుకోవాలన్నది చాలా మంది వేస్తున్న ప్రశ్న.
ఒకప్పుడు సీపీఐ నారాయణ వంటి వారి చేత అందాల రాణిగా అభినందనలు అందుకున్న శ్రీలక్ష్మి- వైయస్ ఫ్యామిలీతో పెట్టుకున్నందుకు అనారోగ్యం పాలై.. జుట్టు మొత్తం పోగొట్టుకున్నారు. దీంతో ఆమె విగ్గులు వాడే వరకూ వచ్చేశారు. చివరికి ఆమె పరిస్థితి ఎలాంటిదంటే ఎవరి కోసమైతే తాను ఇంత కష్టపడ్డానో... ఆ వర్గం నుంచి కూడా ఇలాంటి చీత్కార సత్కారాలను ఎదుర్కోవడం. ఈ లెక్కన రాజకీయ నాయకుల కోసం వారి స్వలాభ.. స్వార్ధం కోసం పాటుపడే ఉన్నతాధికారుల పరిస్థితి ఏమై పోతుందో చెప్పడానికి ఒక నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తున్నారు ఐఏఎస్ శ్రీలక్ష్మి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhumana-karunakar-reddy-39-205096.html
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.