భీష్ముని జీవితమే ఓ పాఠం

Publish Date:Feb 7, 2017

Advertisement

హిందూ పురాణాలలో ఒకో పాత్రకీ ఒకో ఔచిత్యం కనిపిస్తుంది. కొన్ని పాత్రలు ఎలా జీవించాలో నేర్పితే, మరొకొన్ని ఎలా జీవించకూడదో హెచ్చరిస్తాయి. ముఖ్యంగా మహాభారతమంతా ఇలాంటి భిన్నరకాల పాత్రలు కనిపిస్తుంటాయి. వాటిలో అతి ప్రత్యేకమైనది భీష్ముని వ్యక్తిత్వం. అణువణువునా పరిపక్వతతో తొణకిసలాడే ఆయన జీవితం ఓ వ్యక్తిత్వ వికాస పాఠం. కావాలంటే చూడండి...

 

మాటకు కట్టుబడాల్సిందే

 

భీష్ముని అసలు పేరు దేవవ్రతుడు. ఆజన్మాంతం బ్రహ్మచారిగా మిగిలిపోతానని భీషణమైన ప్రతిజ్ఞను చేసినవాడు కనుకే ఆయనను భీష్మునిగా పిలవసాగారు. తనకు పుట్టే సంతానం, సవతి సోదరుల అధికారానికి అడ్డుపడకుండా ఉండేందుకే ఆయన బ్రహ్మచారిగా మిగిలిపోయాడు. తరువాత కాలంలో ఎవరు ఎన్ని రకాలుగా నచ్చచూపినా భీష్ముడు తన మాట నుంచి తప్పుకోలేదు. సాక్షాత్తు సవతి తల్లి ప్రాథేయపడినా, గురువైన పరశురామునితో యుద్ధం చేయవలసి వచ్చినా.... ప్రతిజ్ఞను విరమించుకోలేదు.

 

మంచి చెప్పి తీరాల్సిందే

 

కౌరవులు క్రూరులని తెలిసినా, దుర్యోధనుడు దుర్మార్గుడని తలచినా తన విధేయతను సడలించలేదు భీష్ముడు. కానీ అవసరం అనుకున్న ప్రతిసారీ దుర్యోధనుని మంచి మాటలు చెబుతూనే వచ్చాడు. వాటిని దుర్యోధనుడు పెడచెవిన పెట్టినా సరే... పెద్దవాడిగా తగిన బుద్ధులు చెప్పేందుకే ప్రయత్నించాడు.

 

తప్పుని ఒప్పుకోవాల్సిందే

 

భీష్ముడికి తాను కోరుకున్న సమయంలో మరణం పొందే వరం ఉంది. అయినా కూడా చిరకాలం జీవించాలని ఆయన అత్యాశ పడలేదు. తను వచ్చిన కార్యం ఎప్పుడైతే ముగిసిపోయింది అనుకున్నాడో, అప్పుడే ఇక తనువుని చాలించాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం తగిన పుణ్యకాలం కోసం నిరీక్షించాడు. అలా 58 రాత్రులపాటు అంపశయ్య మీద వేచి ఉన్నాడు. ధర్మానికి ప్రతిరూపం అయిన భీష్ముడు తన అంత్యదశలో అంపశయ్య మీద ఉండటానికి కారణం లేకపోలేదు. ఒకనాడు నిండుసభలో కౌరవులంతా ద్రౌపదిని అవమానిస్తుంటే, భీష్ముడు నివారించలేకపోయాడు. ఆనాటి తప్పుకి ప్రాయశ్చిత్తంగా తాను శరతల్పం మీద శయనించానని చెబుతాడు భీష్ముడు.

 

వీరత్వం చూపాల్సిందే

 

భీష్ముడు జ్ఞాని మాత్రమే కాదు, గొప్ప యోధుడు కూడా! కురుక్షేత్ర సంగ్రామంలో పదిరోజుల పాటు కౌరవ సైన్యానికి నాయకత్వం వహించాడు. ఆ సమయంలో ఆయనను ఎదుర్కోవడం ఎవరి తరమూ కాలేదు. భీష్ముని శరాఘాతానికి రోజూ వేలాది మంది పాండవ వీరులు మృత్యువాత పడ్డారు. ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన కృష్ణుడు కూడా, భీష్ముని నుంచి అర్జునుని కాపాడేందుకు ఆయుధాన్ని పట్టవలసి వచ్చింది. ఆడామగా కాని శిఖండని అడ్డుపెట్టుకోలేకపోతే కనుక భీష్ముని ఓడించడం ఎవరి తరమూ అయ్యేది కాదు.

 

జ్ఞానం పంచాల్సిందే

 

కురుక్షేత్ర సంగ్రామం ముగిసింది. పాండవులదే పైచేయిగా నిలిచింది. కానీ ధర్మరాజు మనసులో ఏదో అశాంతి. ఏదో ఆందోళన. తన సామర్థ్యం మీద తనకే ఎంతో అపనమ్మకం. రాజనీతికి సంబంధించి ఏవో అనుమానాలు..... ధర్మరాజు మనసులో అలజడిని గమనించిన శ్రీకృష్ణుడు, ఆయనను భీష్ముని వద్దకు తీసుకునివెళ్లాడు. ఆ సమయంలో భీష్ముడు మరణానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనసు, శరీరం అలసిపోయి ఉన్నాయి. అయినా తన చెంతకు వచ్చిన ధర్మరాజుని చూసి ఆయన మనసులోని ప్రతి అనుమానాన్నీ నివృత్తి చేశాడు. రాజనే వాడు ఎలా ఉండాలి! ఎవరితో ఎలా మెలగాలి! లోకం తీరు ఎలా ఉంటుంది! అంటూ తనకి ఉన్న అనుభవాన్నంతా బోధలుగా, కథలుగా మార్చి ధర్మరాజుకి అందించాడు. అలా భీష్ముడు చేసిన బోధలతో భారతంలోని శాంతిపర్వం, అనుశాసనిక పర్వాలు అద్భుతంగా తోస్తాయి.

- నిర్జర.

By
en-us Political News

  
ఈ కాలంలో మందు బిళ్లలు మింగకుండా ఒక్కరు కూడా ఉండటం లేదు.  పాపం చిన్న పిల్లలు సైతం  టాబ్లెట్లు మింగాల్సిన పరిస్థితి వస్తోంది.  చాలా మాత్రల మధ్యలో ఒక సన్నని గీత ఉంటుంది. కొన్ని మాత్రలకు ఇది ఉండదు..
వేసవిలో దాదాపు ప్రతి ఇంట్లోనూ పెరుగు తినడం సర్వసాధారణం. ఇది శరీరాన్ని చల్లబరచడమే కాకుండా, జీర్ణక్రియకు కూడా...
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే....
మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హీమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు..
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది. ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు. కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని. ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ...
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు...
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు...
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి...
ఆశా భోస్లే.. భారతీయ సంగీత ప్రపంచంలో ఒక చెరగని ముద్ర.  ఆమె గాత్రం కేవలం భారతదేశాన్నే కాకుండా ప్రపంచం మొత్తాన్ని ఉర్రూతలూగించింది. ప్రముఖ గాయని లతా మంగేష్కర్ కు సోదరి అయినా.. పాటల ప్రపంచంలో..
సంతోషం సగం బలం అన్నారు పెద్దలు. నేటి బిజీ బిజీ జీవితాలలో మనస్ఫూర్తిగా,  సంతోషంగా గడిపిన క్షణాలు వెతుక్కోవాల్సి వస్తోంది. అందరూ ఉద్యోగాలు చేస్తారు,  వ్యాపారాలు చేస్తారు, సంపాదిస్తారు,  నచ్చిన వస్తువులు కొనుక్కుంటారు....
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే...
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది...
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.