భావన కిడ్నాప్ కేసులో... ఆ హీరోనే విలనట!

Publish Date:Feb 20, 2017

Advertisement

 

తెలుగులో ఒకట్రెండు సినిమాలు చేసిన మలయాళీ హీరోయిన్ భావన చాలా మందికి తెలియకపోవచ్చు. కాని, రీసెంట్ గా జరిగిన కిడ్నాప్ వ్యవహారంతో ఆమె ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. కేరళ, తమిళనాడు, కర్ణాటకలో అయితే ఆమె మంచి ఫాలోయింగ్ వున్న స్టార్. కాబట్టి అక్కడ భావన గురించి అందరూ ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అయితే, ఆమెను కరుడుగట్టన నేరస్థులు కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయటం, కార్ లో లైంగిక దాడి చేయటం, ఫోటోలు, వీడియోలు తీసుకోవటం అత్యంత దుర్మార్గమైన చర్య. వారికి కఠిన శిక్షలు పడాల్సిందే. కాని, భావన పై దాడి వెనుక చాలా స్క్రీన్ ప్లే వుంది. మొత్తం కేరళ సినిమా ఇండస్ట్రీ ఎంతగా నేరమయం అయిపోయిందో విప్పి చెప్పే నేపథ్యం వుంది...

 

మనకు తమిళ ఇండస్ట్రీ గురించి తెలిసినంత కూడా మల్లూవుడ్ గురించి తెలియదు. కాని, మంచి కథాంశాలతో జాతీయ అవార్డులు పొందే చిత్రాలు వాళ్లు చేస్తుంటారు. కాని, పైకి కనిపించే కళాత్మక విలువలు ఇండస్ట్రీ లోపల వుండవని చాలా మంది చెబుతుంటారు. అసలు మలయాళీ సినిమా రంగంలోని ఒక వర్గమే తమ చుట్టూ అల్లుకుపోయిన నేరమయ పరిస్థితుల గురించి ఆందోళనగా, ఆవేదనగా చెబుతుంటుంది. ఇండస్ట్రీ ఇన్ సైడర్స్ చెప్పే దాని ప్రకారం భావన కిడ్నాప్ ఆమె మాజీ డ్రైవర్ చేసిన ఒక ఆకతాయి పని మాత్రమే కాదు. అందులో ఒక టాప్ హీరో ఇన్వాల్స్ అయి వుండొచ్చని అంటున్నారు! అతనే దిలీప్!

 

దిలీప్ కేరళ సినిమా రంగంలో మంచి పేరున్న అగ్ర నటుడు. అయితే, ఆయనకు... భావనకు మధ్య గొడవలున్నాయి. అందుక్కారణం భావన అతడి వివాహేతర సంబంధాన్ని భార్య ముందు బట్టబయలు చేయటమేనట! దిలీప్ మాజీ భార్య మలయాళీ హీరోయిన్ మంజు వారియర్. అయితే దిలీప్ మంజుతో విడాకులు తీసుకోక ముందే మరో హీరోయిన్ కావ్య మాధవన్ తో రిలేషన్ షిప్ పెట్టుకున్నాడు. ఈ విషయం గ్రహించిన భావన స్నేహితురాలు మంజు వారియర్ కి చెప్పిందట. దాంతో దిలీప్, మంజు విడిపోవాల్సి వచ్చింది. అప్పట్నుంచీ కక్ష పెంచుకున్న దిలీప్ తన పరపతి ఉపయోగించి భావనకు మలయాళ సినిమా ఆఫర్లు రాకుండా చేస్తున్నాడంటారు. ఆమె చేసేది లేక కన్నడ, తమిళ సినిమాలపై దృష్టి పెట్టింది.

 

దిలీప్ తన శక్తితో భావన మల్లూవుడ్ లో లేకుండా చేసినా కూడా ఈ మధ్యే ఆమె ఓ సినిమా సైన్ చేసింది. దాంతో రీఎంట్రీ ఇచ్చే ప్రయత్నంలో వుంది. ఇది నచ్చకే దిలీప్ తనకు దగ్గరి సంబంధాలు వున్న సునీల్ అనే క్రిమినల్ తో కలిసి భావన పరువు తీసే ప్రయత్నం చేశాడని అంటున్నారు కేరళ సినిమా వాళ్లు. సునీల్ గతంలో భావన వద్ద డ్రైవర్ గా పని చేశాడు. అయితే, అతను పైకి కనిపించినట్టుగా డ్రైవర్ మాత్రమే కాదట. దిలీప్ లాంటి సినిమా రంగపు పెద్ద పెద్ద వారితో దగ్గరి సంబంధాలున్న క్రిమినల్. గతంలో ఎన్నో కేసులు అతడిపై వున్నాయి కూడా. అయిదేళ్ల కింద ఇలాగే ఓ హీరోయిన్ తనని సునీల్ కిడ్నాప్ చేశాడని ఆరోపించింది కూడా. కాని, పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అంత పలుకుబడి వున్న నేరగాడు సునీల్.

 

సునీల్ సంగతి అర్థమైన భావన అతడ్ని తొలగించింది. కాని, పోలీసుల కథనం ప్రకారం ఆమె తాజాగా నియమించుకున్న డ్రైవర్ మార్టిన్ కూడా సునీల్ మనిషేనట! సినిమా స్టైల్లో సాగిన ఈ వ్యవహారం సునీల్ గ్యాంగ్ మొత్తం కలిసి భావనపై దాడికి తెగబడేలా చేసింది. ఆమెను కార్ లో రెండు గంటలు హింసించిన ఉన్మాదులు అదృష్టం కొద్దీ వదిలేసి పారిపోయారు.

 

నిజంగా దిలీప్ అనే హీరోనే భావన కేసులో విలనా? ఇది ఖచ్చితంగా ఎవ్వరూ చెప్పలేరు. భావన కూడా పోలీసుల్ని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేయమని కోరిందట. కాకపోతే, త్వరలో తాను కన్నడ ప్రొడ్యూసర్ ఒకాయన్ని పెళ్లాడబోతున్నాని భావన చెప్పిన వెంటనే ఈ దాడి జరగటం అనే సందేహాలకు తావిస్తోంది. కేవలం ఒక డ్రైవర్ స్థాయి వ్యక్తి ఎంతో పేరున్న టాప్ హీరోయిన్ పై స్వంత ధైర్యంతో దాడి చేస్తాడా? ఖచ్చితంగా వెనుక ఇండస్ట్రీ పెద్దలు వుండే వుంటారు. కాని, అది తేల్చాల్సింది కేరళ పోలీసులు. ఈ మధ్య అధికారంలోకి వచ్చిన కమ్యూనిస్టు ప్రభుత్వం పాలనలో దాడులు మరీ ఎక్కువైపోయాయని కూడా అంటున్నారు కేరళలో. మహిళల పట్ల అయితే దారుణంగా దాడులు జరుగుతున్నాయట. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఓ పెద్ద హీరో విషయంలో నిజం నిగ్గుతేలుతుందని ఆశించటం... కాస్త విపరీత 'భావనే'!

 

By
en-us Political News

  
జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది.
జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి. చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి, ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరూ ఉండకపోవచ్చచునంటారు పరిశీలకులు.
జనంలో తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు.
అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం. ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ భ‌క్తి హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే.. బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.