పార్టీ మారితే భాషా మారుతుంది. గతంలో విమర్శించిన వారినే పార్టీ మారిన తరువాత పొగడాల్సి ఉంటుంది. రాజకీయాలలో అది సహజం. అయితే గతంలో వల్లెవేసిన సిద్ధాంతాలు సైతం మారిపోయే పరిస్థితి సువేందు అధికారికి ఎదురైంది. తృణమూల్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి కమలం గూటికి చేరిన తరువాత ఆ గూటి పలుకులే పలకడంలో ఆశ్చర్యం ఉండదు. ఇఫ్పుడు ఆయన చేస్తున్నది అదే..
బెంగాల్ లో అధికారంలోకి వస్తే పాఠశాలల్లో భగవద్గీత బోధిస్తామని బీజేపీ నాయకుడు సువేందు అధికారి అన్నారు. భగవద్గీత ఎంత మాత్రం మతగ్రథం కాదని ఆయన అన్నారు. ఈస్ట్ మిడ్నాపూర్ లో జరిగిన ఒక రక్తదాన శిబిరంలో పాల్గొన్న ఆయన గుజరాత్ లో కూడా పాఠశాలల్లో భగవద్గీత బోధన పాఠ్యాంశాల్లో భాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ప్రజాశీర్వాదంతో బెంగాల్ లో జాతీయవాద ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు.
అప్పుడు తప్పకుండా పాఠశాల సిలబస్ లో భగవద్గీతను చేరుస్తామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా భగవద్గీత పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. తొలి నుంచీ తృణమూల్ లో ఉన్న సువేందు అధికారి గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ గూటికి చేరారు.
ఆ ఎన్నికలలో మమతా బెనర్జీ పైనే పోటీ చేసి విజయం సాధించారు. అయితే బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించి అధికారం చేపట్టడంతో ఆయన మళ్లీ తృణమూల్ గూటికి చేరుతారని ప్రచారం జరిగినా అది జరగలేదు. కానీ ఎన్నికలకు ముందు తృణమూల్ వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్న పలువురు టీఎంసీ నేతలు మళ్లీ సొంత గూటికి చేరిన సంగతి విదితమే.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhagavadgita-not-a-religious-book-39-141615.html
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.