వాళ్ల ఉద్దేశం, సందేశం... అన్నీ దేశమే!

Publish Date:Mar 23, 2017

Advertisement

భారత్ లో అమరుల సంస్మరణ దినం జనవరి 30న జరుపుతారు. అధికారికంగా గాంధీజీ చనిపోయిన ఆ రోజు అమరుల త్యాగాలకు గుర్తుగా ఎంచుకున్నా మార్చ్ 23 మాత్రమే అందుకు సరైందని చాలా మంది భావిస్తుంటారు. ఉత్తరాదిలో షహీద్ దివస్ గా మార్చ్ 23ను పేర్కొంటారు. అందుకు కారణం... తల్లి భారతి దాస్య విముక్తి కోసం ముగ్గురు నవ యువకులు ప్రాణాలు త్యాగం చేసిన రోజు... మార్చ్ 23 కావటమే! 86 ఏళ్ల కింద వారి త్యాగంతో పావనమైన భూమి ఇవాళ్ల స్వతంత్ర దేశంగా వర్ధిల్లుతోందంటే అందులో వారు అందించిన ప్రేరణ ఖచ్చితంగా వుందని చెప్పాల్సిందే! ఇంతకీ భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ఎవరు? వాళ్లు చేసిన పోరాటం ఏంటి? మీకు తెలుసా... 

 

భగత్ సింగ్ 12ఏళ్ల వయస్సులోనే జలియన్ వాలా బాగ్ మారణకాండని చూసి చలించిపోయాడు. 1919వ సంవత్సరంలో వందలాది మందిని డయ్యర్ కాల్పులు జరిపించి పొట్టనబెట్టుకున్నాడు. అది చూసి కదిలిపోయిన భగత్ జలియన్ వాలా బాగ్ లోని రక్తంతో తడిసిన మట్టిని సీసాలో దాచుకుని దేశం కోసం తపించి పోయేవాడు!భగత్ సింగ్ చిన్నప్పట్నుంచే సాయుధ పోరాటం గురించి మాట్లాడేవాడు. ఇంకా లోక జ్ఞానం లేని సమయంలోనే పొలాల్లో గన్నులు పెంచి బ్రిటీష్ వాళ్లని ఎదుర్కోవాలని అనేవాడట! ఆ విప్లవ ఆలోచనలు తరువాతి కాలంలో సోషలిజమ్, సోషలిస్టు విప్లవం గురించిన సాహిత్యం చదివాక మరింత పదునెక్కాయి! క్రమక్రమంగా కమ్యూనిజం వైపు ఆకర్షితుడైన భగత్ సింగ్ అంతిమంగా నాస్తికుడు, హేతువాది అయ్యాడు. అయితే, తన ఏకైక దైవం దేశమే అనుకున్న ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఇన్ క్విలాబ్ జిందాబాద్ నినాదం అందించాడు. ఇన్ క్విలాబ్ జిందాబాద్ అంటే ... విప్లవం వర్ధిల్లాలి అని అర్థం!

 

1929లో భగత్ సింగ్ తన తోటి యోధులతో కలిసి ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు పేల్చాడు. అది ఎవ్వర్నీ చంపటానికి ఉద్దేశించిన ప్రయత్నం కాదు. కేవలం తమ పోరాటం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించటం కోసం మాత్రమే! తరువాత భగత్ సింగ్ జైల్లో చారిత్రక ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఖైదీలకు, స్వాతంత్ర్య సమర యోధులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసి ...సాధించాడు!

 

మార్చ్ 23న ఒకే రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లలో రాజ్ గురుయే చిన్నవాడు. ఆయన వయస్సు కేవలం 22 మాత్రమే. భగత్ 23ఏళ్ల వాడు కాగా సుఖ్ దేవ్ 24ఏళ్ల వయస్సు వాడు. ఈ ముగ్గురిలో రాజ్ గురు మహారాష్ట్రా వాసి. పుట్టుకతో బ్రాహ్మణుడైనా సాయుధ పోరాటమే జాతి విముక్తికి పరిష్కారమని నమ్మాడు. గాంధీ అహింసా మార్గం, సహాయ నిరాకరణ విశ్వసించే వాడు కాదు. ఇవాళ్ల రాజ్ గురు జన్మస్థానమైన పూణే దగ్గర్లోని ఖేద్ ను రాజ్ గురు నగర్ గా పిలుస్తున్నారు! ముగ్గురిలో మూడోవాడైన సుఖ్ దేవ్ పంజాబ్ లోని లుధియానాకు చెందినవాడు. ఆయన కూడా సాయుధ పోరాటమే బ్రిటీష్ వారికి బుద్ది చెబుతుంది నమ్మేవాడు. అంతే కాదు, సుఖ్ దేవ్ మహాత్మ గాంధీకి ఆయన చేపట్టిన అహింసాయుత ఉద్యమాన్ని తిరస్కరిస్తూ లేఖ కూడా రాశాడు. తాము చేస్తున్న హింసాత్మక పోరాటాన్ని గాంధీజీ గుర్తించకపోవటాన్ని సుఖ్ దేవ్ తప్పుబట్టాడు.

 


భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లకు ఉరి శిక్ష పడటానికి కారణమైన హత్య జాన్ సాండర్స్ అనే బ్రిటీష్ పోలీస్ అధికారిది. నిజానికి వాళ్లు ముగ్గురూ ఆయన్ని చంపుదామని అనుకోలేదు. జేమ్స్ స్కాట్ అనే బ్రిటీష్ అధికారిని మట్టుబెడదామని భావించారు. కాని, పొరపాటున సాండర్స్ చనిపోయాడు. లాహార్లో భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు సాండర్స్ ను చంపిన కేసులోనే వారికి ఉరిశిక్ష పడింది. 

 

ఉరిశిక్ష అమలు చేస్తే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత రావచ్చనే ఉద్దేశంతో ముగ్గురు వీరుల్ని బ్రిటీష్ ప్రభుత్వం ప్రకటించిన సమయాని కంటే 11గంటల ముందే మృత్యు దేవతకు అర్పించింది. అలా మార్చ్ 23, 1931న రాత్రి 7.30కి భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు వీర స్వర్గం పొందారు. వారి పార్థివ దేహాల్ని రహస్యంగా జైలు గోడలకున్న కన్నాల్లోంచి బయటకు తరలించిన బ్రిటీష్ వారు అక్కడే దహనం చేసి... భస్మాన్ని సట్లెజ్ నదిలో కలిపేశారు! అలా వారి త్యాగం సింధూ నదికి ఉపనది అయిన సట్లెజ్ వున్నంత కాలం... భారతీయులు ఆ నది నీళ్లు తాగుతున్నంత కాలం చిరస్థాయిగా వుండిపోయింది!

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.