ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా.. నవ్యంధ్రాలో అయినా.. విజయవాడ.. విజయవాడే. ఆ బెజవాడ మహానగరం విద్యలకే వాడ కాదు.. తెలుగు రాజకీయానికి కూడా గుండెకాయ వంటింది. ఇంకా చెప్పాలంటే.. బెజవాడ రాజకీయం అంటే యమా రంజుగా ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇంకా క్లియర్ కట్గా చెప్పాలంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిందనే కంటే.. విజయవాడ లోక్సభ సభ్యుడిగా ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అలాగే నగరంలోని ఎమ్మెల్యే సీట్లు.. ఏ పార్టీ ఖాతాలో వెళ్లాయనే అంశంపైనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు వారు ఆసక్తిగా గమనిస్తారనడంలో ఏ మాత్రం కించిత్ సందేహం కూడా లేదన్న విషయం విధితమే. దీనిని బట్టే సుస్పష్టమవుతోందీ.. బెజవాడ రాజకీయానికి డిమాండ్ ఎక్కువని.
అలాంటి విజయవాడలో రాజకీయం స్థానిక లోక్సభ సభ్యుడు కేశినేని నాని వర్సెస్ ఆయన సోదరుడు కేశినేని చిన్ని అన్నట్లుగా తయారైందనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో ఊపందుకొంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేశినేని నాని మరింత దూకుడుగా వ్యవహరిస్తుండడంతో.. అదీకూడా.. తన లోక్సభ నియోజకర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు మైలవరం, నందిగామల్లో పర్యటిస్తూ... జగన్ పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన ప్రశంసల జల్లు కురిపించడం... అలాగే అదే పార్టీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయ్యోధ్య రామిరెడ్డి.. సైతం కేశినేని నాని తమ పార్టీలోకి వస్తే.. స్వాగతిస్తామని ప్రకటించడం.. మరోవైపు వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతా, టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చుకున్నా తనకు అభ్యంతరం లేదంటూ బహిరంగ ప్రకటనలు చేయడం.. వంటి వాటి వల్ల.. అటు సైకిల్ పార్టీకి జరిగే నష్టం కంటే.. ఇటు సోదరుడు కేశినేని చిన్నికి కలిగే ఇబ్బందుల కంటే.. కేశినేని నానికే భారీగా.. అదీ వ్యక్తిగతంగా నష్టం వాటిలే అవకాశాలు ఉన్నాయనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో హల్చల్ చేస్తోంది.
రాష్ట్ర విభజన సమయంలో అంటే 2014లో, అలాగే జగన్ వేవ్లో అంటే 2019 ఎన్నికల్లో కేశినేని నాని టీడీపీ లోక్సభ అభ్యర్థిగా వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఇక ఈ రెండు ఎన్నికల్లో జగన్ పార్టీ.. తన లోక్సభ అభ్యర్థులను మార్చినా.. పసుపు పార్టీ మాత్రం కేశినేని నానికే వరుసగా సీటు ఇస్తూ వచ్చింది. అలాంటి పార్టీ నుంచి ఎన్నికై... నేడు అదే పార్టీ పట్ల ఇంతలా అంటి ముట్టనట్లుగా వ్యవహరించడం వల్ల.. కేశినేని నాని ఇమేజ్కే డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఉందనే టాక్ సైతం వైరల్ అవుతోంది.
రాజకీయ అన్న తర్వాత గ్రూపులు.. రాజకీయ పార్టీలు అన్న తర్వాత... గ్రూప్ పాలిటిక్స్ అత్యంత సహజమని.. అలాంటి వేళ... అదీ కూడా సొంత ఇంట్లోని వ్యక్తి.. అదీ సోదరుడు కేశినేని చిన్నిని కూర్చొబెట్టుకొని మాట్లాడితే.. జస్ట్ పది నిమిషాల్లో అన్ని సమస్యలు అల్ క్లియర్ అయిపోతాయనే చర్చ సైతం సాగుతోంది. కానీ ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహారాన్ని వదిలేస్తే.. కొన్ని అరాచక శక్తులు బరిలోకి దిగితే... ఆ తర్వాత జరిగే పరిణామాలకు మనమే బాధ్యత వహించాల్సి ఉంటుందనే అభిప్రాయం సైతం పోలిటికల్ సర్కిల్లో వినిపిస్తోంది. ఇప్పటికే పాదయాత్రలో ఒక్కే ఒక్క చాన్స్ అంటూ.. చాలా హామీలు ఇవ్వడంతో.. అలా అధికారంలోకి వచ్చిన వారి వల్ల.. రాష్ట్రానికి ఏ మేరకు మేలు జరిగిందంటే.. మాత్రం ఆలోచించాల్సిందే. ఇటువంటి నేపథ్యంలో వారిద్దరికి సర్థి చెప్పాల్సిన భాద్యత పార్టీలోని నేతలపైన సైతం ఉందనేది సుస్పష్టం.
ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీకి వ్యతిరేకంగా గాలీ వీస్తుంది.. అలాంటి వేళ.. ప్రతిపక్ష స్థానంలో ఉన్న పార్టీని అధికార పక్షంలోకి తీసుకొచ్చేందుకు కలిసి కట్టుగా ఎంత చేయాలో.. అంత చేయాలని.. అలా అయితేనే మనం, మన పార్టీ అధినేత అనుకొన్న లక్ష్యానికి చేరువవుతామనే అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది. అటువంటి పరిస్థితుల్లో ఏమండోయి నానీ గారు.. ఏమండోయి చిన్ని గారు..కలిసి మళ్లీ పూర్వాశ్రమంలో పని చేసుకొంటూ వెళ్లాలని పోలిటికల్ సర్కిల్లో ఓ అబిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bezawada-politics-nani-versus-chinni-25-156443.html
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?