కోనసీమలో బెట్టింగుల జోరు.. గెలుపు ఓటములపై కాదు.. మెజారిటీలపైనే!
Publish Date:May 18, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. ఓటరు తీర్పు ఈవీఎమ్ లలో నిక్షిప్తమై స్ట్రాంగ్ రూంలలో భద్రంగా ఉంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జూన్ 4. ఈ లోగా జాన్ 1న ఎగ్జిట్ పోల్స్ వెలువడతాయి. అంత వరకూ రాష్ట్రంలో ప్రజల తీర్పు ఏమిటన్నది ఎవరు చెప్పినా అది ఊహాగానమే కానీ వాస్తవం అని చెప్పజాలం. అయితే పోలింగ్ సరళి, పార్టీల మూడ్ ను బట్టి ఫలితం ఊహించేయవచ్చు. అన్నిటికీ మించి ఎన్నికల ఫలితంపై జరుగుతున్న బెట్టింగ్ లు కూడా ఫలితంపై ఒక అంచనాకు రావడానికి దోహదపడతాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఎన్నికల ఫలితాలపై బెట్టింగులు నడుస్తున్నాయి. ఇక కోనసీమలో అయితే ఈ బెట్టింగుల జోరు మరో లెవెల్ కు చేరింది. సాధారణంగా బెట్టింగులు అంటే ఫలానా పార్టీ విజయం సాధిస్తుంది. ఫలానా అభ్యర్థి గెలుపొందుతాడు అంటూ సాగుతాయి. కానీ కోనసీమలో మాత్రం బెట్టింగులు గెలపు ఓటములపై జరగడం లేదు. తెలుగుదేశం కూటమి అభ్యర్థుల మెజారిటీలపై సాగుతున్నాయి. ఈ బెట్టింగులు లక్షల రూపాయలు దాటి కోట్లలోకి చేరుతున్నాయి. కోనసీమ మూడ్ చూస్తుంటే కూటమి అభ్యర్థుల విజయాన్ని ఖరారు చేసేసినట్లు కనిపిస్తోంది. ఇక కూటమి అభ్యర్థులు సాధించబోయే మెజారిటీలపైనే భారీగా బెట్టింగులు నడుస్తున్నాయి. అమలాపురం లోక్ సభ నియోజకవర్గ తెలుగుదేశం కూటమి అభ్యర్థి, లోక్ సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి తనయుడు గంటి హరీష్ మాధుర్ లక్ష ఓట్ల పైచిలుకు మెజారిటీతో విజయం సాధిస్తారంటూ లక్షలలో బెట్టింగులు నడుస్తున్నాయి. అలాగే ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి అభ్యర్థి పది వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధిస్తారనీ పెద్ద ఎత్తున బెట్టింగులు నడుస్తున్నాయి. అదే విధంగా తూర్పుగోదావరి వ్యాప్తంగా కూడా కూటమి అభ్యర్థుల మెజారిటీలపై ఐపీఎల్ బెట్టింగులను మించి బెట్టింగులు జరుగుతున్నాయి. ఈ బెట్టింగుల తీరు చూస్తుంటే ఫలితానికి ముందే కూటమి అభ్యర్థుల విజయం ఖారరైపోయినట్లు కనిపిస్తోంది. బెట్టింగులన్నీ మెజారిటీలపైనే జరగడాన్ని చూస్తుంటే తూర్పుగోదావరిలో తెలుగుదేశం కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందా అనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/bettings-on-tdp-alliance-candidates-majorities-in-konaseema-39-176300.html