పొగ మానాలనుకుని విఫలమవుతున్నారా?.. ఇది మీకోసమే..

Publish Date:Aug 17, 2024

Advertisement

నిజంగా ఒక వ్యక్తి పొగతాగడం మానేయడం సాధ్యమేనా?? ఒకవేళ సాధ్యమైతే అది ఎలా మానగలుగుతాడు?

సహజంగా మొట్టమొదట చెయ్యవలసిన పని మానివెయ్యడమే. మొదటి రోజు గంటసేపు, మరునాడు రెండేసి గంటల సేపు, మూడో రోజున మూడేసి గంటల సేపు - ఇలా మానివెయ్యడమా? అసలు ఒకేసారి పూర్తిగా మానివెయ్యడమా? అనేది వ్యక్తిగత విషయం. దాన్ని ఎవరికి వారు నిర్ణయించుకోవచ్చు. ఏమైనా సరే, ఈ విషయంలో ఒక నిశ్చయం చేసుకోవడానికీ, దాన్ని తు.చ తప్పక అమలు చేయడానికి దృఢమయిన మనోనిబ్బరం అవసరం. 

అందుకోసం కొన్ని చిట్కాలు:
సాధ్యమైనంత వరకు పొగ తాగేవాళ్లకి దూరంగా ఉండాలి. ముఖ్యంగా మొదటి మూడు నాలుగు వారాలపాటు పొగతాగే వారితో, ఆ అలవాటు ఉన్న స్నేహితులతో కలవడకూడదు. వాళ్ళతో కలవకపోతే వాళ్ళు అపార్థం చేసుకుంటారని, ఏదో అనుకుంటారని ఆలోచన వద్దు. వాళ్ళు ఏమైనా అనుకున్నా.. మీరు పొగతాగడం మానేస్తే చాలామంది మీ దృఢ నిశ్చయానికి చాటున ఎంతో మెచ్చుకుంటారు. కాని, మరికొందరు ఏమి కాదు తాగు అంటూ బలవంతం చేస్తారు. కాబట్టి మీరు అనుకున్నది సాధించే వరకు స్నేహితులను కలవద్దు. 

పొగాకు వాడకం ఏ రూపంలోనైనా సరే దగ్గరకు రానివ్వకూడదు. పొగాకు అంటే అదొక మత్తు. కేవలం ధూమపానమే కాదు, ఇతర పొగాకు ఆధారిత పదార్థాలను కూడా తీసుకోకూడదు. వీలైతే స్నేహితులను కూడా మీతో జతకలిపి వారు కూడా మానేందుకు ప్రోత్సహించండి.  

ఎప్పటి నుండో అలవాటైన పొగ ఒక్కసారిగా మానితే.. మనసు అటే లాగుతుంది. అయితే పొగ తాగాలని అనిపించినప్పుడల్లా ఒకటి రెండు గ్లాసుల నీళ్లయినా లేదా పళ్లరసమైనా తాగాలి. కొంత కాలం ఇలా రోజూ చాలా సార్లు చెయ్యాల్సి వస్తుంది. కానీ తాగిన నీరు పొగ పీల్చాలనే తీవ్ర వాంఛను అరికట్టడానికి సాయపడుతుంది. పైగా, శరీరంలో కలిసిపోయిన నికొటిన్, ఇతర విష పదార్థాలను తొలగించడంలో ఇది తోడ్పడుతుంది.

రోజూ రెండుసార్లు వేన్నీళ్ల స్నానం చేసి, ఆ వెంటనే చురుకు పుట్టించే లాగ చన్నీటి స్నానం చెయ్యాలి. ఇది శారీరకంగా ఎంతో మెరుగు చెయ్యడమే కాదు, రక్తప్రసరణ క్రమాన్ని చక్కబరిచి, అనుకున్న పని చేయడానికి సహకరిస్తుంది. మనోనిబ్బరాన్ని పెంచుతుంది.  

రోజూ వ్యాయామం చెయ్యాలి. శ్వాస సంబంధ వ్యాయామాలు ఎంతో గొప్పగా సహాయపడతాయి. ప్రశాంతంగా, స్వచ్ఛమైన గాలి ఉన్న ప్రాంతాలకు అలా వాకింగ్ వెళ్లడం శ్వాసకోశాలను శుభ్రపరచి, ఆరోగ్యాన్ని పెంచుతుంది. 

ఆహారం విషయంలో జాగ్రత్త.. వీలైనంత ఎక్కువగా తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. పొగాకు వల్ల శరీరంలో చేరిన విషాలకు ఇవి చక్కని విరుగుడుగా పనిచేస్తాయి. నిజం చెప్పాలంటే కొన్ని వారాలపాటు ప్రత్యేకించి పండ్లు, కూరగాయలే తీసుకొని ఉన్నారంటే పొగ తాగాలనే కోరికే లేకుండా పోతుంది. రక్తంలో షుగర్లు నిలకడగా ఉండేందుకు సహాయపడుతుంది. తరచుగా కొంచెం కొంచెంగా తింటూ ఉండాలి. ఒత్తిడి సమయంలో నాడులను స్థిమిత పరచడానికి ఇది తోడుపడుతుంది. ఒత్తిడి ఉన్నప్పుడు తెలియకుండానే ఎక్కువ తినేస్తారు కాబట్టి జాగ్రత్త, ఇది ఊబకాయానికి దారి తీస్తుంది.

ఇవన్నీ పాటిస్తే పొగతాగడం ఇంత సులువా అంటారు..

◆నిశ్శబ్ద

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.