మన ఆహారంపైనే రక్త ప్రసారం ఆధార పడి ఉంటుంది

Publish Date:May 8, 2021

Advertisement

మీ శరీరంలో రక్త ప్రసారం అందాలంటే రక్త నాళాలు సరిగ్గా పని చేయాలంటే  మీ గుండెకు మెదడుకు , శరీర అవయవాలకు రక్త ప్రసారం సరిగ్గా జరగా లంటే 13 రకాల ఆహరం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు తీసుకునే ఆహారంపైనే రక్త ప్రసారం ఆధార పడి ఉంటుందని వివరించారు. మీ రక్త ప్రసారాన్ని పెంచే ఆరోగ్య కరమైన అలవాట్లు ఉండాలని అంటున్నారు.

రక్త ప్రసారం పెరగాలంటే...

రక్త ప్రసారం ద్వారా వచ్చే ద్రవం మనకు ఆక్షిజన్ ను ఇస్తుంది. ఇతర పౌష్టిక ఆహారాన్ని  మీ గుండెకు, మీ ఊపిరి తిత్తులకు శరీరం లోని ఇతర అవయవాలకు ఇస్తుందన్న విషయం మీకు తెలుసా?రక్త ప్రసారం బాగా జరగాలంటేపౌష్టిక ఆహారం న్యూట్రియాంట్స్ సరిగా అందడం అవసరం. ఏ ఆహారమై తే మీరు తీసుకుంటారో అది  రక్త సరఫరా పై ప్రభావం చూపుతుంది. మీ శరీరంలో రక్త ప్రసరణ పెరగాలంటే మీరు తినాలి. అందుకోసం మీరు  మీ ఆరోగ్యపు అలవాట్లు చేసుకోవాలి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం శరీరపు బరువు తో పాటు ఆరోగ్యంగా ఉండడం అవసరం. మీరు ఒక వేళ పొగ తాగడం అలవాటు ఉంటె మానేయడం మంచిది. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారపు అలవాట్లు చేసుకోడం వల్ల శరీరంలో రక్త నాళాలలో రక్త ప్రసారం ఆగకుండా  జరుగుతుంది. మీరు కొట్టుకు వెళ్లి నప్పుడు మీరు తీసుకునే ఆహారం మీ గుండె రక్త నాళాలు సంతోషాన్ని ఇచ్చేవి కొనుగోలు చేయాలి.

కారపు పొడి/లేదా ఆరంజ్ రెడ్ స్పైస్...

రెడ్ పెప్పర్ లేదా ఆరంజ్ రెడ్ స్పైస్ శరీరంలో రక్త ప్రసారాన్ని పెంచుతుంది. క్యాప్ సైసిన్ రెడ్ పెప్పర్ మీ కండరాలను రక్త నాళా లను రిలాక్స్ చేస్తుంది. దీనివల్ల శరీరంలో సులభంగా రక్త ప్రసరణ జరిగి రక్తం పై ఒత్తిడిని తగ్గిస్తుంది.

బీట్రూట్...

బీట్రూట్ లో నైట్రేట్ శాతం ఎక్కువగా ఉండడం వల్ల అది నైట్రేట్ ఆక్సైడ్ రక్త నాళాలు తెరుచుకుంటాయి. దీనివల్ల రక్త ప్రవాహం మరింత పెరుగు తుంది. అని ఒక పరిశోదనలో వెల్లడి అయ్యింది. బీట్ రూట్ జ్యూస్ తాగడం వల్ల సిస్టోటిక్ బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తుందని శాస్త్ర వేత్తలు కనుగొన్నారు. మొట్ట మొదటగా వచ్చే బీపి రీడింగ్ తరువాత వచ్చే బీపి రీడింగ్ చూసుకోవచ్చని తేల్చారు.

బెర్రీస్...

మీ రక్త ప్రసారాన్ని పెంచుకోడం తెలిస్తే ఆశ్చర్యం కలిగించక మానదు. ఈ నేపద్యంలో బెర్రీస్  యంతో సియానిన్ అది యాంటి  ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఇందులో రెడ్ అండ్ పర్పుల్ హ్యొస్ అంతో సియానిన్ అర్టిరీ వాల్స్ ను రక్త నాళాలు  పూర్తిగా మృదువుగా పని చేస్తాయి. ముఖ్యంగా అత్యంత ప్రమాద కరమైన లో బీపి నివారించేందుకు నైట్రిక్ యాసిడ్ ను విడుదల చేస్తుంది. 

ఫ్యాటీఫిష్...

గుండెకి ఆరోగ్యాని ఇచ్చేది చేప అని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. ఫ్యాటీ ఫిష్ ఎందుకు?ఇందులో సాల్మన్,హెర్రింగ్, మాకర్ట్, ట్రవుట్, హాలిబట్, లలో ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. రక్త ప్రసారాన్ని పెంచే ఆహారంలో చేప ఒకటి. ఒక్క విషయం చెప్పాలంటే మీ గుండె ఆర్టరీ లను రక్తం గడ్డ కట్టకుండా 
ఆపుతుంది.

దానిమ్మ గింజలు...

దానిమ్మ పండులో ఉండే  దానిమ్మ గింజలు, టార్ట్ దానిమ్మ గింజలలో నైట్రేట్  చాలా విరివిగా లభిస్తాయి. యాంటి ఆక్సిడెంట్ గా పని చేస్తాయి. దానిమ్మ గింజలు  తీసుకోడం వల్ల ఆర్టరీ లు పూర్తిగా తెరుచుకుంటాయి దీని వల్ల రక్త ప్రసారం మరింత సులభంగా జరుగుతుంది.రక్త ప్రసారం మెదడుకు మరింత సులువుగా  చేరుతుంది. అలాగే గుండె ధమనులు, నరాలు ఇతర అవయవాలకు, చర్మం లోకి టి ష్యూలకు చేరుతుంది. ముఖ్యంగా అథ్లెట్లు దానిమ్మ గింజలు తినడం వల్ల అధిక రక్త  ప్రసారం తోపాటు శక్తి నిచ్చి, మరింత ఎక్కువసేపు పని చేయ గలదు. 

వెల్లుల్లి...

వెల్లుల్లి భారతీయ ఆహార వ్యవహారాలలో తర తరాలుగా ఇమిడి పోయింది. వెల్లుల్లి లో అత్యంత విలువైన అల్లిసిన్ లభిస్తుంది. వెల్లుల్లి వాడకం వల్ల రక్త నాళాలు కొంత ఉపశమనం పొందు తాయి. అందుకే చాలా మంది ఉదయం లేవగానే వెల్లుల్లి రెబ్బల్ని  తినడం వల్ల రక్త ప్రసారం పెరిగిందని  అంటూ ఉంటారు. దీనివల్ల గుండె నుండి రక్త ప్రసారం మరింత సులువుగా ప్రవహిస్తుంది. ఇది గుండె పని తీరుపై భారం పడకుండా గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది.అందుకే గుండెపై ఒత్తిడి పడినప్పుడుగుండె నుంచి రక్తం పంప్ చేయడం కష్టం. 

వాల్ నట్స్...

నట్స్ తినడం వల్ల అందునా ప్రత్యేకంగా వాల్ నట్స్ మీ గుండెకు రక్త నాళాల పై ఎంతో ప్రయోజనం ఉందని అంటున్నారు నిపుణులు. రక్త ప్రసారం చాలా మృదువుగా నెమ్మదిగా ప్రసరించడానికి సహకా రిస్తుంది. వాల్ నట్స్ ను ఎనిమిది వారాల పాటు తింటారో వారిపై జరిపిన పరిశోదన రక్త నాళాలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు గమనించారు. దీనివల్ల రక్త పోటు ను తగ్గించిందని  వారి రాక్త నాళాలు చాలా ఫ్లెక్స్ బుల్ గా పని చేసాయి.

ద్రాక్ష...

 అందరికీ ఇష్టమైన పండ్లలో ద్రాక్ష ఒకటి పర్పుల్ రంగు లో ఉండే ద్రాక్ష యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది. రక్త నాళాలలోని గోడలు చాలా ప్రశాంతంగా సేద తీరుతాయి రక్త నాళాలు మరింత సమర్ధవంతంగా  బాగా పనిచేయ డానికి వీలు కలుగుతుంది ద్రాక్షలో ఉండే రసాయనాల్ వల్ల ఇంఫ్లామేషన్  లేదా రక్త హీనతను తగ్గిస్తుంది. దీనివల్ల రక్తం గడ్డ కట్టడం వంటి సమస్యల నుండి బయట పడవచ్చు. ద్రాక్ష తీయటి విందును అందిస్తుంది. రక్త ప్రసరణ కు సంబందించిన సమస్యలను సహకరిస్తుంది.

పసుపు...

పసుపు హిందీలో హల్దీ భాష ఏదైనా దని ఉప యోగం ఒక్కటే ఇది ఆరోగ్యాన్ని ఇచ్చే మూలిక అన్న విషయం దీని ఉపయోగాలు తెలుసుకుందాం. భారతీయులు నిత్యజీవితం లో శుభ కార్యాలలో ఆయుర్వేదం లో కీలక మైన యంటి ఆక్సిడెంట్ గా పనిచేస్తుందని నిపుణులు తేల్చారు. భారతీయ వంటకాలలో పసుపు  లేని వంట లేదంటే ఆశ్చర్యం కలిగించక మానదు.పసుపులో కుర్ కుమిన్  పదార్ధం నుంచి పసుపు నుంది లభిస్తుంది. పసుపు ద్వారా నైట్రిక్ ఆక్సైడ్  లెవెల్స్ ను పెంచుతుంది. రక్త నాళా లను వ్యాకొచం జరిగి రక్తం గుండెకు, మెదడుకు, శరీరంలోని అవయవాలకు  టిష్యు లకు చేరుతుంది.

బచ్చలి కూర...

మీకు హై బీపి ఎక్కువగా ఉంటె బచ్చలి కూర తీసుకోండిఇందులో నైట్రేట్స్  అధికంగా ఉంటాయి. మీశారేరం నైట్రిక్ ఆక్సైడ్ గా మారుస్తుంది.దీని వల్ల రక్త నాళాలు పోర్తిగా తెరుచుకుంటాయి. బచ్చలికూర ను తినడం వల్ల ఆర్ట్రీలు చాలా మృదువుగా ఉండి. బ్లడ్ ప్రెషర్ ను తగ్గిస్తాయి.    

నారింజ పండు - సిట్రస్ ఫ్రూట్...

ప్రజలు నారింజ పండును ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. అయితే మీ జీవితంలో ప్రతిరోజూ నారింజ పండును తీసుకోడం వల్ల ఇంఫ్లామేషన్  తగ్గిస్తుంది. రక్త ప్రసారం సజావుగా జరగ డానికి తోడ్పడుతుంది. రక్త నాలాలలో వచ్చే క్లోట్ ను నివారిస్తుంది. ఒక పరిశోదన ప్రకారం ఎవరైతే ఎక్కువగా ఆరంజ్ జ్యూస్ ప్రతిరోజూ తాగుతారో వారిలో రక్త పోటు చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.

చాక్లెట్...

చాక్లెట్ అంటే అందరికీ ఇష్టమే అయితే మీరు అదృష్ట వంతులే. చాక్లెట్ లో ఉండే వివిధ రకాల పదార్ధాలురక్త నాళాల పనితీరును మెరుగు పరుస్తుంది. రక్త ప్రసారాన్ని సులభంగా సాగేలా చేస్తుంది. రక్త నాళాలను డ్రైలైట్  చేయడమే కాదు రక్త పోటును తగ్గిస్తుంది. రక్త పోతూ తక్కువ ఉన్నవాళ్లు డార్క్ చాక్లెట్లు తిన వచ్చు. మరీ ఎక్కువ తిన్నారంటే ఫ్యాట్ క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి.

 అల్లం...

చాలా మందికి అల్లం గురించి దానిప్రభావం గురించి పోర్తిగా తెలుసు. ముఖ్యంగా ఆహారం అరుగుదలకు అల్లం బాగా పని చేస్తుంది. కాస్త జలుబు, ఏమాత్రం నిసత్తువ నీరసం,బడలిక అల్లం తో చేసిన టీ తాగితే అకిక్ వేరని అంటారు టీ ప్రేమికులు. అల్లం రక్త నాళాలు తెరుచుకునేలా చేసి రక్తం ఒత్తిడిని తగ్గిస్తుంది.
అల్లం ఆశియాలో ముఖ్యంగా భారత్ లోని వంటింట్లో ప్రాధాన్ మూలిక. అల్లంటీ తీసుకుంటే వైరస్లు కాదు కాదు శరీరంలో ఉండే ఖప్పం పోతున్దన్న్ది నిజం.మీ స్వాస్కోశంలో ఉండే ఖపాన్ని అల్లం తీసేస్తుంది.

By
en-us Political News

  
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది శరీరానికి కావలసిన పోషకాలను సరిగ్గా అందజేయలేకపోతున్నారు. ఈ క్రమంలో శరీరంలో విటమిన్లు, ఖనిజాల లోపాన్ని భర్తీ చేయడానికి..
గుండె మానవ శరీరంలో అత్యంత కీలకమైన అవయవం, ఇది శరీరమంతటికీ ఆక్సిజన్ , పోషకాలను అందించడానికి నిరంతరం రక్తాన్ని పంపింగ్ చేస్తుంది. అయితే, మారుతున్న జీవనశైలి, ఒత్తిడి,  ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం అనేది ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా 30-32 ఏళ్ల చిన్న వయసులోనే జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూనో, ఫంక్షన్లలో డ్యాన్స్ చేస్తూనో అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్న వార్తలు మనల్ని..
చాలామంది రాత్రి వేళల్లో హాయిగా నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కాళ్ల పిక్కలు పట్టేయడం (Leg Cramps at Night) వల్ల తీవ్రమైన నొప్పితో మేల్కొంటూ ఉంటారు. కండరాలు గట్టిగా బిగుసుకుపోయి, కాళ్లు కదల్చలేనంతగా వచ్చే ఈ నొప్పిని ఆయుర్వేదంలో..
వేడి, విరేచనాలు లేదా వాంతులు వంటివి శరీరంలోని నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను త్వరగా దెబ్బతీస్తాయి. ఇలాంటి పరిస్థితులలో ఓఆర్ఎస్ తాగడం చాలా ముఖ్యం. చాలా నీరసంగా ఉన్నప్పుడు, ఆహారం సరిగా తీసుకోలేనప్పుడు...
ప్రతి మనిషి ఇతర మనిషికి చాలా  విభిన్నంగా, ప్రత్యేకంగా ఉంటారు. కొందరు చాలా శాంతంగా ఉంటారు, మరికొందరు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ చాలా చలాకీగా ఉంటారు. ఇంకొందరు చాలా చిన్న విషయాలకే తొందరగా కోపం
భారతీయులకు టీ, కాఫీ ఒక పెద్ద ఎమోషన్. గతంలో కంటే ప్రస్తుతకాలంలో  టీ తాగేవారి సంఖ్య చాలా పెరిగింది.  ఏదైనా పని చురుగ్గా చేయాలంటే చాలామంది మొదటగా టీ తాగుతారు.  ఇక పని మధ్యలో కూడా టీ తాగుతూ ఉత్సాహం తెచ్చుకుంటారు...
బలమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా వైరస్‌లు, బ్యాక్టీరియా , ఇతర ఇన్ఫెక్షన్ల వల్ల కలిగే సమస్యలను చాలా వరకు నివారించవచ్చు. అయితే రోజురోజుకూ జీవనశైలి పేలవంగా మారడం..
ఉదయాన్నే నిద్రలేచి మంచం దిగగానే కాలి మడమలో సూదితో గుచ్చినట్లుగా తీవ్రమైన నొప్పి వస్తుంది కొందరికి.  ఇలా లేవగానే ఆ నొప్పితో కొన్ని అడుగులు వేయడమే చాలా కష్టంగా అనిపిస్తుంది. చాలామంది ఈ నొప్పిని సీరియస్ గా తీసుకోరు.  కొద్దిసేపు అలా నడవగానే అదే తగ్గిపోతుందిలే అని కాంప్రమైజ్ అయిపోతారు....
మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. అవి రక్తాన్ని శుద్ధి చేస్తూ, విషతుల్యాలను బయటకు పంపుతాయి. కానీ, దురదృష్టవశాత్తూ కిడ్నీ సమస్యలు వస్తే అది ఒక పీడకలలా మారుతుంది. డయాలసిస్ బెడ్ మీద గంటల తరబడి గడపడం..
నోటి ఆరోగ్యం అనేది మన సంపూర్ణ ఆరోగ్యానికి ముఖద్వారం లాంటిది. చాలా మంది పళ్ళను తెల్లగా, శుభ్రంగా ఉంచుకుంటే సరిపోతుందని అనుకుంటారు, కానీ పళ్ళ కంటే వాటిని పట్టి ఉంచే చిగుళ్ల ఆరోగ్యం చాలా ముఖ్యం. చిగుళ్ల వ్యాధులు..
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి.....
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది....
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.