మోడీ టార్గెట్ గా ఢిల్లీకి దీదీ! ప్రాంతీయ పార్టీలు ఏకమయ్యేనా?

Publish Date:Jul 26, 2021

Advertisement

ఆమె ఎమ్మెల్యే కాదు .. కానీ,ఆమె ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆమె ఎంపీ కూడా కాదు ... కానీ, ఆమే ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు. ఇంతకీ ఆమె ఎవరు? ఇంకెవరు.. తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఇప్పటికే బెంగాల్ అసెంబ్లీ సభ్యురాలు కాకుండానే, ముఖమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మమతా బెనర్జీ, తాజాగా ఎంపీ కాకుండానే తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ గానూ ఎన్నికయ్యారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఎంపీలంతా కలిసి తమ అధినేత్రిని మమతా బెనర్జీని పార్లమెంటరీ పార్టీ  ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎమ్మెల్యే కాకుండా మంత్రులు, ముఖ్యమంత్రులు అయిన వారు గతంలోనూ ఉన్నారు. కానీ ఇలా ఎంపీ కుండానే పార్లమెంటరీ పార్టీ నాయకులుగా ఎన్నికైంది మాత్రం ఇద్దరే ఇద్దరు. ఒకరు సోనియా గాంధీ (1998) రెండు మమతా బెనర్జీ. చివరకు ఇందిరా గాంధీ కూడా  ఎంపీగా ఓడిపోయిన సందర్భంలో (1977) యశ్వంత రావు చౌహాన్ ను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుని చేశారు. ఆయనే ప్రతిపక్ష నాయకునిగానూ బాధ్యతలు నిర్వహించారు. అంతకు ముందు ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని అలహాబాద్ హై కోర్టు ఇచ్చిన తీర్పును తుంగలో తొక్కి, ఆమె రాత్రికి రాత్రి దేశంలో అంతర్గత అత్యవసర పరిస్థితి  విధించి.. ఆరేళ్ళు నియంత పాలన సాగించారు అనుకోండి. అయితే అప్పట్లో, నియంతగా,  హిట్లరమ్మగా ప్రసిద్ధి చెందిన ఇందిరకు కూడారాని అద్భుత ఆలోచన మమతా బెనర్జీకి వచ్చింది. ఎంపీ కాకుండానే పార్లమెంటరీ పార్టీ నాయకురాలయ్యారు.ఒకటనేముంది, పార్టీలోని అన్ని కీలక పదవులు ఆమె గుప్పిట్లోనే ఉంచుకున్నారు. ఒకప్పుడు ఇందిరా గాంధీ మంత్రివర్గంలో ఆమె ఒక్కరే మగాడు మిగిలిన వాళ్ళంతా అంతే అనే జోక్ ప్రచారంలో ఉండేది. ఇప్పుడు ఆ జోక్ మమతా దీదీకి సరిపోతుంది. 

మమతా బెనర్జీ అడుగులు మెల్ల మెల్లగా జాతీయ రాజకీయాల వైపు పడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.ఇందులో భాగంగానే మమతా బెనర్జీ ఈ నెల (జులై) 28 న ఢిల్లీ చేరుతున్నారు. అదే రోజున ప్రధాని నరేంద్ర  మోడీతో అధికార సమావేశంలో పాల్గొంటారు. ఇక అక్కడినుంచి నుంచి మోడీతో, ‘ఢీ’ కొనే ఆట మొదలవుతుందని, ఢిల్లీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తర్వాతా కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వుతున్న దీదీ, ఆ ఎన్నికల తర్వాత తోలి సారిగా ఢిల్లీ వస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా అన్నిపార్టీలను ఏకం చేయడమే దీదీ ఢిల్లీ దండయాత్ర  ప్రధాన అజెండాగా పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె   వివిధ పార్టీల అగ్రనాయకులతో సమావేశమవుతారు. ఇలా అన్ని పార్టీల నాయకులను సమన్మయ పరిచే బాధ్యతను, మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరంకు అప్పగించారు. ఆమె ఢిల్లీ వచ్చేసరికి, పవార్, చిదంబరం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారని, ఆపై వ్యవహారం అంతా మమతా బెనర్జీ చుకుకుంటారని అంటున్నారు.  ఒక విధంగా చూస్తే మమతా బెనర్జీ, ప్రతిపక్ష నాయకురాలిగా, ప్రతిపక్షాల ప్రదాని అభ్యర్ధిగా తనను తాను ప్రకటించుకునేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ఇదే పని మీద తృణమూల్ ప్రధాన కార్యదర్శి, మమతా దీదీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, రాజకీయ వ్యూహకర్త, ఈ మొత్తం వ్యవహారం సూత్రధారీ ప్రశాంత్ కిశోర్, నాలుగు రోజుల ముందుగా, జులై 22 నే ఢిల్లీ చేరుకున్నారు. మరోవంక మమతా బెనర్జీ కొందరు ముఖ్య నాయకులతో ఆన్లైన్ మంతనాలు కూడా సాగించినట్లు సమాచారం. ఈ సమావేశానికి కొనసాగింపుగా, 28 సమావేశం ఉంటుంది. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, హస్తం పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా వాద్రా హాజరవుతారా లేదా అనేది తేల లేదు. అయితే సోనియా గాంధీతో మమతా బెనర్జీ భేటీ అవతారని అంటున్నారు. బీజేపీ మాజీ మిత్రపక్షం  శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్బీర్‌ సింగ్‌ బాదల్‌ కూడా, బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. 

మొత్తానికి, మోడీని ఓడించేందుకు మూడేళ్ళ ముందుగానే జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు మొదలయ్యాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంలో కాకలు  తీరిన రాజాకీయ ఉద్దండులు అంతా, ప్రశాంత్ కిశోర్ కు జీ హుజూర్ అనడం కొంచెం విద్దురంగా ఉందని, రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తపరిస్తున్నారు. అలాగే, ప్రశాంత్ కిశోర్ ఎవరి తరపున ఈ రాజకార్యం చేస్తున్నారు, అనేది కూడా అనుమానాలకు తావిస్తోందనే మాట కూడా పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. 

By
en-us Political News

  
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. 
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
మే 1వ తేదీ, ఉదయం పది గంటలైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగుల ఫోన్లు మెసేజ్‌ల సౌండ్‌తో మార్మోగిపోయాయి.
సరిగ్గా ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ స్థైర్యం, ధైర్యం జావగారిపోయాయా? స్వయానా చెల్లెలు షర్మిల సూటిగా చేస్తున్న విమర్శలు జగన్ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి ఆ పార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టడంతోనే జగన్ శిబిరంలో ఆందోళన మొదలైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.