చెప్పుల్లేకుండా పచ్చగడ్డి మీద నడిస్తే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

Publish Date:Apr 10, 2024

Advertisement

వాకింగ్ సాధారణంగా ఆరోగ్యం కోసం చాలామంది చేసే సింపుల్ వ్యాయామం. దీనికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అక్కర్లేదు. అయితే మరిన్ని అదనపు ప్రయోజనాలు కావాలంటే ఈ వాకింగ్ లో కూడా విభిన్న మార్గాలు అనుసరించాలి. అలాంటి వాటిలో గ్రొండింగ్ లేదా ఎర్తింగ్ కూడా ఒకటి.  చెప్పులు లేకుండా ఒట్టి పదాలతో పచ్చగడ్డి మీద నడవడమే గ్రౌండింగ్.  దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుంటే..

కనెక్షన్..

చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద ఒట్టి పాదాలతో నడవడం వల్ల మనసుకు, శరీరానికి మధ్య కనెక్షన్ పెరుగుతుంది. మరీ ముఖ్యంగా భూమి నుండి ఎలక్ట్రాన్ లు శరీరానికి బదిలీ అవుతాయి.ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. శరీరంలో సహజంగా ఉండే విద్యుత్ శక్తి బ్యాలెన్స్ గా ఉండటంలో తోడ్పడుతుంది.

స్ట్రెస్ తగ్గుతుంది..

పచ్చని గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మనసు మీద శరీరం మీద భారం తగ్గినట్టు అనిపిస్తుంది.  ఇది మానసిక స్థితిని బ్యాలెన్స్ గా ఉంచుతుంది.


శక్తి ప్రవాహం..

మనిషి శరీరంలో ఉండే చాలా నరాలు పాదాల దగ్గర ముగుస్తాయి. అంటే శరీరంలో నరాలకు ముగింపు పాదాల భాగం. చెప్పులు లేకుండా ఒట్టి పాదాలతో నడిస్తే పాదాలలో ఉండే నరాల పిఫ్లెక్స్ పాయింట్లు  యాక్టీవ్ అవుతాయి. ఇవి శరీరం అంతా మెరుగైన రక్తప్రసరణ, ఆక్సిజన్ సప్లై, శక్తి ప్రవాహానికి సహాయపడతాయి.

భూమితో కనెక్షన్..

ఇప్పట్లో ఇంట్లో ఉంటున్నా కాళ్లకు చెప్పులు వేసుకుంటున్నారు చాలామంది. దీనివల్ల భూమికి, మనిషికి మధ్య  కనెక్షన్ తగ్గిపోతోంది. కానీ చెప్పులు లేకుండా పచ్చగడ్డి మీద నడవడం వల్ల మళ్లీ భూమితో శరీరానికి అద్భుతమైన కనెక్షన్ ఏర్పడుతుంది. భూమి గురుత్వాకర్షణ బలం శరీరానికి అంది శరీరం దృఢంగా మారుతుంది.

రోగనిరోధక శక్తి..

మట్టిలో సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్యాన్ని చేకూర్చేవి కూడా ఉంటాయి. పచ్చగడ్డి మీద నడవడం వల్ల  రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.  అనారోగ్యాలు ఎదురైతే వాటిని తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ప్రకృతిలో ఆరుబయట నడవడం వల్ల మానసిక, శారీరక స్థితి మెరుగవుతుంది.

                                            *నిశ్శబ్ద.

By
en-us Political News

  
జీర్ణ ఆరోగ్యం బాగుంటే మొత్తం ఆరోగ్యం అంతా బావుంటుంది.
మామిడి పండ్ల సీజన్ మొదలైంది.
రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్నది చాలా పాపులర్ అయిన మాట.
వేసవికాలం కోసం చాలామంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు.
ఇప్పట్లో సంపూర్ణ ఆరోగ్యం కలిగిన మనుషులు దాదాపు కనుమరుగయ్యారనే చెప్పాలి.
వేసవికాలం  వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
రోజంతా పాజిటివ్‌గా,  యాక్టివ్‌గా ఉండటానికి మంచి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
వేసవికాలం వచ్చిందంటే ఆరోగ్య పరంగా మామూలు కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ వేడిమి కారణంగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో ఉష్ణోగ్రత విషయంలో కూడా మార్పులు వస్తాయి. శరీరంలో తేమ శాతం చాలా వేగంగా తగ్గిపోతుంది....
ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా చాలా మంది  శీతాకాలం లేదా రుతుపవన కాలంలో కాళ్ల తిమ్మిరి సమస్య గురించి కంప్లైంట్ చేస్తుంటారు.
లీచీ ఆగ్నేయాసియాకు చెందిన ఉష్ణమండల పండు.
భారతీయ సంస్కృతిలో తమలపాకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడి పూజలలోనూ, శుభకార్యాలలోనూ ఇది లేకుండా పని జరగదు....
భారతీయుల ఆహారం చాలా విశిష్టమైనది. ఇందులో పేర్కొన్న ప్రతి ఆహారం వెనుకా ఒక ప్రత్యేక కారణం, బోలెడు ప్రయోజనాలు ఉంటాయి....
పండ్లలో రారాజుగా మామిడిని చెప్పుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల మామిడిపండ్ల రకాలు ప్రసిద్ధి చెందాయి. మామిడి పండ్లు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.