రోజూ 4వేల అడుగులు వాకింగ్ చేస్తే ఎన్ని లాభాలో తెలుసా?

Publish Date:Feb 11, 2024

Advertisement

వాకింగ్ ఆరోగ్యానికి చాలామంచిది. ఎలాంటి ఇతర వ్యాయామ పరికరాలు లేకపోయినా వాకింగ్ ను ఎక్కడైనా, ఎవరైనా చేసేయచ్చు. చాలామంది వాకింగ్ ను బరువు తగ్గడానికి శరీరం ఫిట్ గా ఉండటానికి చేస్తారు. అయితే వాకింగ్ చేయడం వల్ల కేవలం ఇవే కాదు.. మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రోజూ 4వేల అడుగులు వాకింగ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే..

రోజుకు 4వేల అడుగులు నడవడం వల్ల మెదడుకు రక్తప్రవాహం పెరుగుతుంది. మెదడు కణాలకు పోషణ అందించేందుకు ఆక్సిజన్ సరఫరా బాగుంటుంది. ప్రతిరోజూ 4వేల అడుగులు నడవడం వల్ల అభిజ్ఞా పనితీరు మెరుగవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అదే విధంగా ఏకాగ్రత మెరుగవుతుంది.

జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్నవారు తరచుగా మతిమరుపుకు లోనవుతున్నవారు రోజూ 4వేల అడుగులు నడుస్తూ ఉంటే మెదడు పనితీరు విషయంలో చాలా మార్పులు ఉంటాయి. మెదడు వాల్యూమ్, కనెక్టీవిటీ మెరుగవుతాయి. ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరచడమే కాకుండా అల్జీమర్స్, చిత్తవైకల్యం వంటి సమస్యల తీవ్రతను, అవిరాకుండా ఉండటంలోనూ సహాయపడుతుంది.

సాధారణంగా మెదడు పనితీరు బాలేకుంటే అది మూడ్ మీద ప్రభావం చూపిస్తుంది. కానీ మెదడు పనితీరు బావుంటే మూడ్స్ కూడా సహజంగానే మెరుగ్గా ఉంటాయి. ఒత్తిడి, నిరాశ, ఆందోళ వంటి సమస్యలు తగ్గించడంలో  రోజూ 4వేల అడుగుల నడక  ప్రభావవంతంగా ఉంటుంది. శరీరం ఒక క్రమ పద్దతిలో చలనానికి లోను కావడం వల్ల శరీరానికి కూడా విశ్రాంతి బాగా తీసుకోవడం సాధ్యమవుతుంది. నిద్ర బాగా పడుతుంది.

నడక మెదడులో వివిధ ప్రాంతాలను ఏకకాలంలో పనిమీద దృష్టి సారించేలా చేసే మల్టీ టాస్కింగ్ ప్రదేశం. శరీర కదలికలను  గ్రహించడం నుండి శరీరంలో జరిగే కలిగే వివిధ చర్యల వరకు ప్రతి దానికి స్పందిస్తుంది. దీనికి నాడీ కణాలు సహాయపడతాయి. రోజూ 4వేల అడుగులు నడవడం వల్ల నాడీ కణాలు బలోపేతం అవుతాయి.  వీటికి మెదడుతో ఉన్న కనెక్షన్లు మరింత బలపడతాయి.

రోజూ 4వేల అడుగులు నడవడం వల్ల శరీరంలో డోపమైన్, సెరోటోనిన్ వంటి న్యూరోకెమికల్స్ ఉత్పత్తిని సులభతరం చేసే హార్మోన్లు మెరుగ్గా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును, ఆలోచనను, సృజనాత్మకంగా ఆలోచించే నైపుణ్యాన్ని మెరుగుపరుస్తుంది.

                               *నిశ్శబ్ద.

 

By
en-us Political News

  
రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్నది చాలా పాపులర్ అయిన మాట.
వేసవికాలం కోసం చాలామంది కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తారు.
ఇప్పట్లో సంపూర్ణ ఆరోగ్యం కలిగిన మనుషులు దాదాపు కనుమరుగయ్యారనే చెప్పాలి.
వేసవికాలం  వచ్చిందంటే మండే ఎండల వల్ల అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటారు.
రోజంతా పాజిటివ్‌గా,  యాక్టివ్‌గా ఉండటానికి మంచి ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
వేసవికాలం వచ్చిందంటే ఆరోగ్య పరంగా మామూలు కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ వేడిమి కారణంగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో ఉష్ణోగ్రత విషయంలో కూడా మార్పులు వస్తాయి. శరీరంలో తేమ శాతం చాలా వేగంగా తగ్గిపోతుంది....
ఉష్ణోగ్రత తగ్గుదల కారణంగా చాలా మంది  శీతాకాలం లేదా రుతుపవన కాలంలో కాళ్ల తిమ్మిరి సమస్య గురించి కంప్లైంట్ చేస్తుంటారు.
లీచీ ఆగ్నేయాసియాకు చెందిన ఉష్ణమండల పండు.
వాకింగ్ సాధారణంగా ఆరోగ్యం కోసం చాలామంది చేసే సింపుల్ వ్యాయామం. దీనికి ఎలాంటి ప్రత్యేక పరికరాలు అక్కర్లేదు.
భారతీయ సంస్కృతిలో తమలపాకులకు చాలా ప్రాముఖ్యత ఉంది. దేవుడి పూజలలోనూ, శుభకార్యాలలోనూ ఇది లేకుండా పని జరగదు....
భారతీయుల ఆహారం చాలా విశిష్టమైనది. ఇందులో పేర్కొన్న ప్రతి ఆహారం వెనుకా ఒక ప్రత్యేక కారణం, బోలెడు ప్రయోజనాలు ఉంటాయి....
పండ్లలో రారాజుగా మామిడిని చెప్పుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రకాల మామిడిపండ్ల రకాలు ప్రసిద్ధి చెందాయి. మామిడి పండ్లు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని..
ల్వపత్రి లేదా మారేడు ఆకులు దేవుడి పూజకు విరివిగా ఉపయోగిస్తారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.