బావ,బామ్మర్దుల ఆధిపత్య పోరు: రేవంత్ ఆజ్యం !!

Publish Date:Sep 23, 2024

Advertisement

బిఆర్ఎస్ పార్టీలో బావ,బామ్మర్దుల మధ్య ఆధిపత్య పోరాటం ముమ్మరమైనట్టు తాజా ఘటనలు,సన్నివేశాలు రుజువు చేస్తున్నవి.చాలాకాలంగా పార్టీపై ఆధిపత్యం కోసం అంతర్గత పోరాటం జరుగుతున్నప్పటికీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ,కౌశిక్ రెడ్డిల గొడవలో మాజీ మంత్రి హరీశ్ రావు పైచేయి సాధించినట్టు ఆ పార్టీ క్యాడర్ భావిస్తున్నది.పార్టీలో కేసీఆర్ తర్వాత నెంబర్ టూగా కేటీఆర్,నెంబర్ త్రీగా హరీశ్ రావు వ్యవహరిస్తున్నారు.ఇద్దరూ మంత్రులుగా పనిచేసిన వారే! అయితే కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా సమర్థంగా 'పెర్ఫార్మ్' చేయడం లేదని కొందరు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు,నాయకులు,కార్యకర్తలు విమర్శిస్తున్నారు.పార్టీ అధికారం కోల్పోయాక కూడా కేటీఆర్ లో మునుపటి గర్వం,అహంకారం తగ్గడం లేదని అంటున్నారు.పార్టీ అధికారంలో ఉన్నట్టుగానే వర్కింగ్ ప్రెసిడెంట్ పనితీరు కనిపిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

కేటీఆర్ వైఫల్యాలను హరీశ్ తనకు అనుకూలంగా మలచుకొని దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వంపైన,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపైన పెద్ద ఎత్తున విరుచుపడుతున్నారు.ఓటమి వల్ల పార్టీ శ్రేణుల్లో నెలకొన్న స్తబ్దత,నిరాశా నిస్పృహలను తొలగించేందుకు హరీశ్ రావు దూకుడు ప్రదర్శిస్తున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.బావ,బామ్మర్దుల మధ్య జరుగుతున్న 'పోరాటం'తో పార్టీ అధినేత కేసీఆర్ మరుగునపడి పోతున్నారు.కేసీఆర్ ఎర్రవల్లి ఫార్మ్ హౌజ్ కే పరిమితం కావడం హరీశ్ రావుకు కలిసి వచ్చినట్టు చెబుతున్నారు.2001 నుంచి కేసీఆర్ వెన్నంటి ఉద్యమంలో నడచిన హరీశ్ రావు,తెలంగాణ ప్రభుత్వంలోనూ తన మేనమామకు వెన్నుదన్నుగా ఉన్నారు.కేటీఆర్ మంత్రిగా మంచి మార్కులు సంపాదించినా,హరీశ్ రావు ప్రాబల్యానికి గండి కొట్టే చర్యలు అనేకం చేసినట్టు  ఆయనపై ఆరోపణలున్నవి.

ఇద్దరి మధ్య జగడం 2014 నుంచి కొనసాగుతున్నది.అధికారం కోల్పోయాక అది ఉధృతమైనట్టు పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.ముఖ్యమంత్రిగా కేసీఆర్ తొలి టర్మ్ లోనే బావ,బామ్మర్దుల మధ్య  'ఆధిపత్య' పోరుకు బీజం పడింది.అప్పట్లో 'కేసీఆర్ తర్వాత సీఎం మా అన్న కేటీఆర్' అని ఎమ్మెల్సీ కవిత ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్య హరీశ్ రావుకు ఆయనకు మద్దతిచ్చే ఎమ్మెల్యేలకు తీవ్ర ఆగ్రహం తెప్పించాయి.అదే రోజు హరీశ్ రావు కేసీఆర్ నివాసానికి వెళ్ళి,కేటీఆర్,కవిత,సంతోష్... ఇతర కుటుంబసభ్యులతో 'ఘర్షణ'కు దిగారని బిఆర్ఎస్ నాయకులంటున్నారు.అది సద్దుమణిగినా ఇద్దరిమధ్యా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణంకొంత కాలం కొనసాగింది.

బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో నాటి మంత్రి హరీశ్ రావు క్వార్టర్ దగ్గర 'స్పెషల్ బ్రాంచ్' పోలీసులు మఫ్టీలో నిఘా పెట్టడం,ఆ విషయాన్ని హరీశ్ రావు గుర్తించి కేటీఆర్ తో గొడవ పెట్టుకోవడం,నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు ఈ పంచాయతీ వెళ్లడం,ఇద్దరినీ ఆయన నచ్చచెప్పడం... వంటి  ఘటనలను కొందరు బిఆర్ఎస్ నాయకులు గుర్తు చేస్తున్నారు.హరీశ్ రావును ఎవరెవరు కలుస్తున్నారో 'ఆరా' తీయడానికి కేసీఆర్ లేదా కేటీఆర్ నుంచి స్పెషల్ బ్రాంచ్ కు ఆదేశాలు అందినట్టు అప్పట్లో ఒక ప్రచారం జరిగింది.కేటీఆర్ ఆదేశాలతోనే  తనపైన నిఘా పెట్టినట్టు హరీశ్ రావు అనుమానించినందువల్ల ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరిగాయని తెలిసింది.

అలాగే ఇరిగేషన్ మంత్రిగా హరీశ్ రావు 'డిస్టింక్షన్' మార్కులు సంపాదించడంతో కేటీఆర్ లో అసూయ పెరిగిందన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది.పైగా టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా,నాయకునిగా హరీశ్ కు గుర్తింపు ఉంది.ఆ గుర్తింపే పార్టీపై ఆయన  పట్టు పెరగడానికి కారణమైంది.కానీ పార్టీ అధ్యక్షుడు,ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారునిగా కేటీఆర్ కు తగిన గౌరవం లభించింది తప్ప అది ఆయన 'కష్టార్జితం' కాదన్న అభిప్రాయం పార్టీ కార్యకర్తల్లో ఉన్నది.ఐటి,పరిశ్రమల మంత్రిగా కేటీఆర్ సక్సెస్ కావడం వెనుక తన కృషితో పాటు  కొందరు ఐఏఎస్,ఐపీఎస్ అధికారులు శక్తివంచన లేకుండా పనిచేశారని చెబుతున్నారు.  

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు అధికార కాంగ్రెస్ పార్టీకి అయాచిత వరంగా మారింది.ఈ పోరాటంలో ఆజ్యం పోయడానికి సీఎం రేవంత్  రెడ్డి ప్రయత్నిస్తున్నారు.వాళ్ళిద్దరి మధ్య దూరం మరింత పెరిగేలా రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.బిఆర్ఎస్ లో 'అంతా తానే' అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చిన కేటీఆర్ కు చెక్ పెట్టడానికి పార్టీ అధికారం కోల్పోవడం వల్ల హరీశ్ రావుకు కలిసి వచ్చిందంటున్నారు.ఒకవేళ కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి ఉంటే కేటీఆర్ మరింత రెచ్చిపోయేవారని,హరీశ్ కు మంత్రి పదవి కూడా రాకుండా చేసే వారన్న చర్చ పార్టీ వర్గాల్లో ఉన్నది.  

కాగా కేటీఆర్ ప్రభావాన్ని అటు బిఆర్ఎస్ లోనూ,జనాల్లోనూ తగ్గించాలన్నది  రేవంత్ ఎత్తుగడ. కొద్ది రోజులుగా కేటీఆర్ విమర్శలను పట్టించుకోనట్టుగా వ్యవహరిస్తూ, అదే సమయంలో హరీష్ రావు విమర్శలకు  కౌంటర్ ఇస్తుండడాన్ని గమనించవచ్చు.దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేయడంతో సహజంగానే ప్రతిపక్ష శిబిరంలో హరీష్ రావు హైలెట్ అవుతున్నారు.బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను పట్టించుకోకుండా హరీష్ రావు పైనే విమర్శలు చేయడం,ఆయనకే సవాళ్లు విసరడం వెనుక రేవంత్ రెడ్డి
వ్యూహాన్ని అర్ధం చేసుకోవచ్చు.తనకు కేసీఆర్ లేదా హరీశ్ తప్ప కేటీఆర్ పోటీదారు కాదనే సందేశాన్ని ప్రజల్లోకి పంపిస్తున్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ ను 'మేనేజ్మెంట్ కోటా'అంటూ విమర్శలు చేసిన రేవంత్ రెడ్డి తాజాగా  కేటీఆర్ విమర్శలకు,సోషల్ మీడియాలో ఆయన కౌంటర్లకు స్పందించడం లేదు. కొన్ని రోజులుగా హరీష్ రావు చుట్టూనే తెలంగాణ రాజకీయాలు నడుస్తున్నవి.కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా తాను  టార్గెట్ చేస్తే అది ఆయనకు రాజకీయంగా మైలేజ్ రావచ్చునని రేవంత్ భావిస్తున్నారు.  హరీష్ రావును హైలైట్ చేయడం వల్ల ఆయనకు పాపులారిటీ రావడంతో పాటు,బావ బామ్మర్దుల మధ్య  వైరం పెరుగుతుందని కాంగ్రెస్ నాయకులంటున్నారు.

-ఎస్.కే.జకీర్ (సీనియర్ జర్నలిస్ట్) 
 

By
en-us Political News

  
తెలంగాణ సాధించుకున్న తర్వాత పక్క రాష్ట్రంతో పోలికలు పెట్టాల్సిన అవసరం హరీష్ రావుకు ఎందుకో అర్థం కావడం లేదు.
జగన్ పరిపాలన జరిగిన ఐదేళ్ళ కాలంలో శ్రీవారి దర్శనం టికెట్లు గోల్ మాల్ చేసి మాజీమంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా కోట్ల రూపాయలు దండుకొన్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు.
ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు దర్యాప్తులో సోమవారం (సెప్టెంబర్ 23) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్టైన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్ట్‌లో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను పోలీసులు చేర్చారు. ఇదే కేసుకు సంబంధించి ఈ ముగ్గురినీ అంటే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ కమిషనర్ కాంతి రాణా తాతా, మరో ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ పేర్లను కుక్కల విద్యాసాగర్ రిమాండ్ రిపోర్టులో చేర్చారు.
హైడ్రా బీద బిక్కి ప్రజానీకం మీద కరుణించినట్లు తెలుస్తోంది. ఆదివారం నుంచి చేపట్టిన హైడ్రా కూల్చివేతల్లో పేద ప్రజల జోడికి హైడ్రా వెళ్లడం లేదు. చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ దూకుడుగా వెళుతున్నారు. ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో నిర్మించే అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నప్పటికీ గత రెండు రోజుల నుంచి పేదల ఇళ్లను ముట్టుకోవడం లేదు
జగన్మోహన్ రెడ్డి వేడి వేడి కల్తీ నెయ్యిలో పడ్డారు. ఇక అందులో మునిగిపోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు.
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం ఇప్పుడు దేశ వ్యాప్తంగా ప్రధాన అంశంగా చర్చల్లో నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులంతా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
తీన్మాన్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ హోరాహోరీగా పోరాడి ఎమ్మెల్సీ అయ్యారు. అంత పోరాడి ఎమ్మెల్సీ అయ్యాను కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పోరాటపటిమను మెచ్చి ఏదైనా మంచి పదవి ఇస్తారేమోనని మల్లన్న ఆశించి వుండవచ్చు.
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రేవంత్ రెడ్డి షాక్ ఇచ్చారా? ఆ ఈవెంట్ రద్దు కావడానికి రేవంత్ రెడ్డే కారణమా అంటే అంటే ఎన్టీఆర్ అభిమానులు ఔననే అంటున్నారు. ఎంతో ముందుగా ఫిక్స్ అయిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆగిపోవడానికి రేవంత్ రెడ్డి అదే రోజు మాదాపూర్ లోని ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రావడంతో దేవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేశారని అంటున్నారు.
చంద్రబాబు ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా మార్చింది. లడ్డూ తయారీకి ఉపయోగించే నేతిని మార్చింది. ఇప్పుడు శ్రీవారి లడ్డూని ఎలాంటి ఇబ్బంది లేకుండా, పవిత్రత విషయంలో ఎలాంటి అనుమానాలకు గురికాకుండా మహాప్రసాదాన్ని హాయిగా స్వీకరించవచ్చు.
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై తార స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ కూడా లడ్డూ ప్రసాదాల విక్రయాలు తగ్గలేదు సరికదా గణనీయంగా పెరిగాయి. ఈ వివాదం వెలుగులోకి రాకముందు.. అంటే జగన్ హయాంతో పోలిస్తే.. గత పది రోజులుగా లడ్డూ విక్రయాలు విపరీతంగా పెరిగాయి.
ఈసారి జరిగే ఎన్నికలలో తన ప్రజాబలాన్ని నిరూపించుకుని, ఆ తర్వాతే ముఖ్యమంత్రి స్థానం మీద కూర్చుంటానని కేజ్రీవాల్ శపథం చేశారు.
తిరుమల తిరుపతి లడ్డూ వివాదంతో దేశం అట్టుడికిపోతున్నది. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడకం జరిగిందన్న విషయం ల్యాబ్ నివేదికతో నిర్ద్వంద్వంగా తేలిపోయింది. జగన్ హయాంలో దేవాలయాలపై జరిగిన అరాచకాలు, దాడులను మించి లడ్డూ ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వినియోగం.. ప్రజల మనోభావాలను తీవ్రాతి తీవ్రంగా దెబ్బతీసింది.
నిన్న మొన్నటి వరకూ భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆంధ్రప్రదేశ్ కు మరో సారి భారీ వర్షాల ప్రమాదం పొంచి ఉంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.