Publish Date:Jun 19, 2022
చదువుకునే పిల్లలకు కావలసినవి సమకూర్చనపుడు ప్రభుత్వాలెందుకు? ఇప్పుడు అంతటా వినపడుతోన్న ప్రశ్న ఇదే.
బాసర ట్రిపుల్ఐటిలో అనేక సమస్యల పరిష్కారం గురించి విద్యార్ధులు అనేక రోజులుగా గోడు పెడుతున్నారు. వైస్ ఛాన్సలర్ లేకపోవడం, లైబ్రరీలో పుస్తకాలు లేకపోవడం .. ఇలా అనేకం. వాటికి తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి కావలసినవి సమకూర్చడంలో విఫలమయింది.
తెలంగాణాలో విద్యార్ధిలోకం కూడా పూనుకుంటేనే రాష్ట్రం ఏర్పడిందన్నది టిఆర్ ఎస్ ప్రభుత్వం ఎప్పుడో మర్చిపోయింది. కాకున్నా, విద్యర్దులు కాకమ్మ కోరికలేమీ కోరడం లేదు. మౌలిక సదుపాయాల గురించి తలెత్తిన సమస్యలు పరిష్కరించమనే గోడు పెడుతున్నారు. వాటని అవేమీ పెద్ద అంశాలు కానట్టు, అసలు వారి గోలను పెద్దగా పట్టించుకోన వసరం లేనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అందుకే తీవ్రస్థాయిలో విద్యార్ధులు మండి పడి భారీ నినాదాలతో ముఖ్యమంత్రికి, విద్యా శాఖ మంత్రికి బాసర ట్రిపుల్ ఐటిలో పరిస్థితులు బాగా తెలిసేలా బాగా వినిపించేలా ఉద్యమి స్తున్నారు. కానీ విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డిగారికి వారి పరిస్థితులు, సమస్యలు చాలా చిన్నవిగా కనపడటమే విడ్డూరం.
ముఖ్యమంత్రితో సంప్రదించి వెంటనే వారి సమస్యలు పరిష్కరించాల్సిందిబోయి అవి చిన్న సమస్యలే, వాటి గురించి ఆందోళనకు దిగడం మంచిది కాదు, ప్రభుత్వం ప్రతిష్టకు భంగం కలిగేలా చేయరాదని మంత్రిగారు ఒక లేఖలో విద్యార్ధులను కోరడంలో అర్ధ మేమిటో మంత్రి గారే సెలవియ్యాలి. అంతే కాకుండా బాసర ట్రిపుల్ఐటీ అన్న విషయమే విద్యామంత్రి సబిత గారికి తెలియదు. అందుకే కాబోలు బాసర ఐఐటి అని ప్రస్తావించారు. బాసరలో వున్నది ఐఐటి కాదు త్రిబుల్ ఐటి! ఈ విషయాన్ని కూడా విస్మరించారు. మొన్నటివరకూ ఎంతో ప్రతిష్టాత్మకమయినది,
ప్రభుత్వానికి రాష్ట్రానికి ఎంతో పేరు తెస్తున్న సంస్థ అంటూ పొగిడినవారే విద్యా ర్ధుల మౌలిక వస తుల గురించి పట్టించుకొనకుండా కేవలం రాజకీయ ప్రసంగాలతో మభ్యపెట్టే ప్రయత్నాలు చేయడంలో అర్ధమే మిటని విద్యార్ధి లోకం ప్రశ్నిస్తోంది. ఐఐఐటికి శాశ్వత వైస్ ఛాన్సలర్ను నియమించడానికి మీనమేషాలు లెక్కించడాన్ని రాజకీయ దురుద్దేశం గానే తీసుకోవాలా? ఎందుకు ఇంత నిర్లక్ష్యమని అడుగుతున్నారు. తల్లిలా తాను చెబుతున్న మాటలు విద్యా ర్ధులు చెవికెక్కిం చుకోని ఉద్యమించడం ఆపేయాలని అడుగుతున్న మంత్రి మరి ఇన్ని రోజులు తన బిడ్డలవంటి విద్యార్ధుల గోడు వినడానికి సమయం ఇవ్వకపోవడమేమిటి? విద్యార్ధుల భవిష్యత్తుతో ఆడుకున్న ప్రభుత్వాలు కలకాలం నిలవవు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పటికైనా తెలంగాణా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకుంటారనే ఆశిద్దాం.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/basara-tripleit-not-iit-39-137972.html
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.