కే.యూ, టీ.యూల‌కూ తాకిన బాస‌ర ఐఐఐటీ సెగ!

Publish Date:Jun 21, 2022

Advertisement

హ‌మ్మ‌య్య స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌యి బాస‌ర ఐఐఐటి విద్యార్ధులు ఆనందంలో మున‌క‌లేస్తున్నారు. ఎండా వాన‌ల‌కు, రాత్రిప‌గ‌లు అన‌క‌, అధికారుల బెదిరింపులు, హెచ్చ‌రిక‌ల‌కు వెర‌వ‌క సాగించిన  ఆందోళ‌న స‌త్ఫలితాన్నే ఇచ్చింది. మొత్తానికి ప్ర‌భుత్వం కొండదిగి వ‌చ్చి విద్యార్ధులు కోరిన డిమాండ్ల‌ను అంగీక రించింది. రెగ్యులర్‌ వైస్‌ చాన్స్‌లర్‌ నియామకం సహా వసతి గృహాల్లో సమస్యల పరిష్కారం, ఇతర మౌలిక, విద్యాపర మైన వసతులు, సౌకర్యాల కల్పనకు ఏడు రోజుల పాటు నిరసన చేపట్టిన నిర్మల్‌ జిల్లా బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు.. చివరకు అనుకున్నది దక్కించుకున్నారు. వారి డిమాండ్లన్నిటినీ  నెల రోజుల్లోగా  తీర్చేందు కు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ మేరకు సోమవారం అర్ధరాత్రి అధికారులు ప్రకటిం చారు.  కాగా, విద్యార్థులు లేవెనెత్తిన అంశాలపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బాసర ట్రిపుల్‌ ఐటీ ఇన్‌చార్జి వీసీ రాహుల్‌ బొజ్జా, విద్యాశాఖ ఉన్నతాధికారులు సోమవారం మధ్యాహ్నం  హైదరా బాద్‌లో చర్చించారు.  ఈ సందర్భంగానే రెగ్యులర్‌ వీసీ నియామకానికి ముగ్గురు సభ్యులతో సెర్చ్‌ కమిటీ ఏర్పాటు సహా విద్యార్థుల డిమాండ్ల అంగీకారానికి మొగ్గుచూపింది.
మంత్రి స‌బిత‌, రాహుల్‌ బొజ్జా, విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ,  నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూ ఖీ, ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సతీశ్‌ కుమార్‌ బాసర కు రాత్రి వెళ్లి  11 గంటలకు విద్యార్థి నాయకులతో చర్చల కు ఉపక్రమించారు.  అయితే విద్యార్ధి నాయ‌కులు మంత్రిని ప్ర‌భుత్వ అంగీకారాన్ని రాత‌పూర్వ‌కంగా ఇవ్వాల‌ని కోరారు. అందుకు రాత‌పూర్వ‌కంగా ఎందుకు మంత్రిగా  చెబుతున్నానుక‌దా అని మంత్రి స‌బిత  సున్నితం గా వారి విన‌తిని  తిర‌స్క‌రించారు. విద్యార్థులు మంత్రి చెప్పినదానికి అంగీకరించినట్లు తెలిసింది. ప్రభు త్వం నుంచి డిమాండ్ల పరిష్కా రానికి అంగీకారం రావడంతో విద్యార్థులు నిరసనను విరమిస్తు న్నట్లు అధి కారులతో కలిసి వెల్లడించారు. చర్చలు సఫలం అయినట్లు ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ సతీశ్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు.

ఇదిలా వుండ‌గా మ‌రోవైపు హ‌నుమ‌కొండ‌లోని కాక‌తీయ విశ్వ‌విద్యాల‌యం (కేయూ), నిజామాబాద్ డిచ్‌ప‌ల్లి లోని తెలంగాణా విశ్వ‌విద్యాల‌యం(టీయూ) లో విద్యార్ధులు త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించాల‌ని ఆందోళ‌న కు దిగారు. కేయూలో  విద్యా సంవత్సరం ప్రారంభమైనా వసతి గృహాలను తెరవకపోవడం, మరమ్మతుల ను నిర్లక్ష్యంగా చేపడుతుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమావేశాన్ని అడ్డుకుని రిజి స్ట్రార్‌ చాంబర్‌ను ధ్వంసం చేశారు. భౌతిక తరగతులు నిర్వహించకుండా ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో తాత్సారం చేయడం పట్ల సోమవారం తొలుత వర్సిటీ పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు.

భవనంలోకి దూసుకుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, రిజిస్ట్రార్‌, ఇతర అధికారుల నుంచి వసతి గృహాలను తెరిచే విషయంలో స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గుర య్యారు. పోలీసులను చేధించుకుని పరిపాలన భవనం పై అంతస్తులో ఉన్న రిజిస్ట్రార్‌ చాంబర్‌లోకి దూసుకెళ్లారు.

కేయూలో  విద్యా సంవత్సరం ప్రారంభమైనా వసతి గృహాలను తెరవకపోవడం, మరమ్మ తులను నిర్లక్ష్యంగా చేపడు తుండడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల సమావేశాన్ని అడ్డుకు ని రిజిస్ట్రార్‌ చాంబర్‌ను ధ్వంసం చేశారు. భౌతిక తరగతులు నిర్వహించకుండా ఆన్‌లైన్‌ తరగతుల పేరుతో తాత్సారం చేయడం పట్ల సోమవారం తొలుత వర్సిటీ పరిపాలన భవనం ఎదుట విద్యార్థులు ఆందోళన చేశారు. భవనంలోకి దూసుకుకెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. అధికా రులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే, రిజిస్ట్రార్‌, ఇతర అధికారుల నుంచి వసతి గృహాలను తెరిచే విషయంలో స్పందన రాకపోవడంతో ఆగ్రహానికి గురయ్యారు. పోలీసు లను చేధించుకుని పరిపాలన భవనం పై అంతస్తులో ఉన్న రిజిస్ట్రార్‌ చాంబర్‌లోకి దూసుకెళ్లారు.
విద్యార్థులు రిజిస్ట్రార్‌ చాంబర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు అడ్డుకుంటున్నా ఫర్నీచర్‌, ఇతర వస్తువు లను పగులగొట్టారు. రిజిస్ట్రార్‌, ఇతర అధికారులు వారిస్తున్నా వినలేదు. వసతి గృహాలను తెరవాలంటూ అక్కడే కూర్చొని వాదనకు దిగారు. హామీ ఇస్తేనే వెళ్తామని మొండికేశారు. దీంతో కొద్దిసేపు అధికారులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు పోలీసుల జోక్యంతో శాంతించారు. రెండు రోజుల్లో వసతి గృహాలు తెరవకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తూ విద్యార్థులు ఆందోళనను తాత్కాలి కంగా విరమించారు.

అవసరమైతే బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల తరహాలో తామూ వర్సిటీలో నిరసనలు చేపడతామని తేల్చి చెప్పారు. దీంతో వీసీ రవీందర్‌, రిజిస్ట్రార్‌ శివశంకర్‌లు.. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులతో చర్చలు జరిపారు. వారంలోగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. విద్యార్థులు మాత్రం తక్షణ పరిష్కారం కోరారు. ఈ నేపథ్యంలో వీసీ.. ప్రిన్సిపాల్‌ హారతి, వర్సిటీలోని వివిధ విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలివ్వడంతో విద్యార్థులు శాంతిం చారు.

By
en-us Political News

  
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే..  క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.  దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్‌ ద్వారానే ఇంటర్నెట్‌ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
 ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి.  మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి.  ఈ ఫలితాలు కేవలం  ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి. 
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.