భార‌త్ పాక్ పై ఎలాంటి యుద్ధ వ్యూహం ర‌చిస్తోంది... మ‌న ద‌గ్గ‌రున్న ఎవిడెన్సులు ఏంటి?

Publish Date:Apr 27, 2025

Advertisement

ఉగ్ర‌దాడికి భార‌త్ గ‌ట్టి బ‌దులే ఇస్తుంది. అది మ‌రెవ్వ‌రూ ఊహించ‌న‌దిగా ఉంటుంది. ఇదీ మోడీ ప‌హెల్గామ్ అటాక్ త‌ర్వాత చేసిన కామెంట్. మోడీ ఇంత సీరియ‌స్ వార్నింగ్ ఇవ్వ‌డం ఇదే మొద‌టి సారి. అయితే ఇప్ప‌టికే సింధూ జ‌లాల ఒప్పందం ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు ప్ర‌ధాని మోడీ. యుద్ధం చేయ‌డం కంటే నీళ్లు ఆప‌డం అతి పెద్ద యుద్ధం. దీని సాధ్యాసాధ్యాలు వ‌చ్చే రోజుల్లోగానీ తెలీదు. అలాగ‌ని ఇదే చాల‌నుకున్నా క‌ష్ట‌మే. ఎందుకంటే ఇందుకు కావ‌ల్సినంత టైం తీస్కుంటుంది. ఈలోగా ఇలాంటి ఎన్నో ఉగ్ర‌దాడులు జ‌రిగే అవ‌కాశం కూడా ఉంది. దానికి తోడు ఇదే అంశంపై ల‌ష్క‌రే తోయిబా చీఫ్ హ‌ఫీజ్ స‌యిద్ మీరు మా నీరు ఆపితే మేము మీ శ్వాస ఆపేస్తామ‌ని.. ఈ స‌రికే ప్ర‌క‌టించి ఉన్నాడు.. రీసెంట్ గా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావ‌ర్ భుట్టో సైతం స‌రిగ్గా ఇలాంటి లాంగ్వేజీనే వాడి భార‌త్ ను హెచ్చ‌రించాడు. దీన్నిబ‌ట్టీ చూస్తే ఈ లాగ్ తో కూడిన  వాట‌ర్ వార్ తో పాక్ ని అంత తేలిగ్గా భ‌య‌పెట్ట‌లేం. ఇక మిగిలింది ఏంట‌ని చూస్తే..ముందుగా ఐఎన్ఎస్ విక్రాంత్ అనే విమాన వాహ‌క యుద్ధ నౌక‌ను అరేబియా స‌ముద్రంలో అంత‌ర్జాతీయ జ‌లాల‌లో ఉండేలా.. కారాచీ రేవుకు ద‌గ్గ‌ర్లోకి పంపారు. ఒక ర‌కంగా చెబితే ఇది పూర్తి స్థాయి యుద్ధ స‌న్న‌ద్ధానికి స‌మాయుత్తం అవుతున్న‌ట్టుగానే భావించాలంటారు ర‌క్ష‌ణ రంగ నిపుణులు.విక్రాంత్ అనే విమాన వాహ‌క నౌక అంటే అది ఒక్క‌టే వెళ్ల‌దు. దీంతో పాటు నాలుగు ఫ్రీగెట్ లు, ఒక కార్వేటి, రెండు డెస్ట్రాయ‌ర్లు ఉంటాయి. ఇవే కాక‌.. వీటిని అనుస‌రిస్తూ స‌ముద్ర జ‌లాల్లో రెండు అటాక్ స‌బ్ మెరైన్లు ప్ర‌యాణిస్తాయి. ఈ మొత్తాన్ని క‌లిపి కారియ‌ర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు షార్ట్ క‌ట్ లో సీటీజీ అంటారు.యుద్ధం జ‌రుగుతోంద‌న్న నిర్ణ‌యిస్తేనే ఈ కారియ‌ర్ స్ట్రైక్ గ్రూప్ ని పంపుతారు. 

కాబ‌ట్టి ఈసారికి స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అయితే ఉండ‌బోదని అంటున్నారు ఎక్స్ ప‌ర్ట్స్. ఒక సారి అంటే 2016లో అజిత్ దోవ‌ల్ అన్న‌మాట‌ల‌ను అనుస‌రించి చెబితే.. పాకిస్థాన్ కానీ మ‌రో ముంబై లాంటి దాడుల‌కు పాల్ప‌డితే బ‌లూచిస్తాన్ని కోల్పోతారని అన్నారాయ‌న‌. అంటే దీన‌ర్ధ‌మేంటో సుల‌భంగానే అర్ధం చేసుకోవ‌చ్చు. ఇంతకీ స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ ఎందుకు చేయ‌కూడ‌దు? అని చూస్తే ఇప్ప‌టికే రెండు స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ చేసింది భార‌త్. మొద‌టిది యూరీ సెక్టార్లో ఆర్మీ నిర్వ‌హించ‌గా.. రెండోది బాలాకోట్ పై ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ చేసిన‌ది.  ఇక మిగిలింది ఇండియ‌న్ నావీ తో స్ట్రైక్స్ చేయించ‌డం. అయితే నావీ అలాంటి స్ట్రైక్స్ చేయ‌దు. డైరెక్ట్ వారే.  ఇదిలా ఉంచితే పీవోకేని స్వాధీనం చేసుకోవ‌డం. పీవోకేని స్వాధీనం చేసుకునే స‌మ‌యంలో పాకిస్థాన్ నావీ భార‌త్ పై దాడి  చేయ‌కుండా నిలువ‌రించ‌డానికే విక్రాంత్ ని అరేబియా స‌ముద్రంలో మొహ‌రించార‌ని అంటారు నిపుణులు. ఇక బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీకి మ‌ద్ద‌తుగా గ్వ‌ద‌ర్ పోర్టు వైపు విక్రాంత్ ని పంపి ఉండొచ్చు కూడా. ఇక్క‌డ స‌స్పెన్స్ ఏంటంటే భార‌త్ అస‌లు యుద్ధ వ్యూహ‌మేంట‌న్న‌ది. ఇండియ‌న్ ఆర్మీ ప్లాన్ ఏమిటో ఎవ‌ర‌కీ తెలియ‌దు. ఏద‌యినా జ‌ర‌గొచ్చు కూడా. ఇప్ప‌టి వ‌ర‌కూ భార‌త్ రెండున్న‌ర ల‌క్ష‌ల ఫ్రంట్ ల‌తో యుద్ధం చేయాల్సి ఉంటుంద‌ని భావించేవారు. ఇప్పుడు చూస్తే ఇందుకు భిన్నంగా ఉంది ప‌రిస్థితి. పాకిస్థాన్ త్రీ ఫ్రాంట్ వార్ ఫేస్ చేయాల్సి రావ‌చ్చ‌ని అంచ‌నా వేస్తున్నారు.అదెలాగో చూస్తే మొద‌ట బ‌లూచ్ లిబ‌రేష‌న్ ఆర్మీని భార‌త్ నావీ స‌పోర్ట్ తో పాక్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఖైబ‌ర్ ప‌ఖ్క్తున్ క్వాని తాలిబాన్లు అటు నుంచి ముట్ట‌డిస్తారు. కాశ్మీర్ వైపు భార‌త దాడిని చ‌వి చూడాల్సి వ‌స్తుంది. ఇక్క‌డ గుర్తించాల్సిన మ‌రో ముఖ్య‌మైన విష‌యం.. ఇప్ప‌టికే తాలిబ‌న్లు భార‌త్ కి మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ మోడీతో మాట్లాడుతూ త‌న స‌పోర్ట్ తెలియ చేశారు. ఇదెలా ప‌నికి  వ‌స్తుందంటే.. మ‌న ఆయ‌ధాల‌లో 70 శాతం పైగా సోవియ‌ట్ ర‌ష్యాకి చెందిన‌వి ఉన్నాయి. వీటి స్పేర్ పార్ట్స్ అవ‌స‌రాలు చాలానే ఉంటాయి. ఈ మాత్రం సాయం చేసినా చాలు మ‌నం యుద్ధాన్ని ఎంతో గొప్ప‌గా చేయ‌గ‌లం అంతే స్థాయిలో ముగించ‌గ‌లం.ఇక అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ కూడా ఫోన్ చేసి త‌న స‌పోర్ట్ ప్ర‌క‌టించారు. ఈ దిశ‌గా త‌న యంత్రాంగం ద్వారా ఒక అధికారిక ప్ర‌క‌ట‌న సైతం చేయించారు. ఫ్రాన్స్ అధ్య‌క్షుడు మ‌క్రాన్ మోడీకి గ‌ట్టి మ‌ద్ధ‌తే ప్ర‌క‌టించారు. మిరేజ్ 200 జెట్ ఫైట‌ర్స్, రాఫెల్ ఓమ్ని రోల్ ఫైట‌ర్ జ‌ట్స్ ఫ్రాన్స్ కి చెందినివి కావ‌డం గుర్తించాల్సిన విష‌యం.కాబ‌ట్టి పాక్ పై మోడీ ఎలాంటి అటాక్ చేసినా అడిగే దిక్కు లేదు. ప్ర‌పంచ ఉగ్ర‌వాద క‌ర్మాగారం పాక్ లో తిష్ట‌వేసి.. అక్క‌డి నుంచి ప్ర‌పంచం మీద‌కు వ‌దులుతోంద‌ని స్ప‌ష్టంగా తెలిసి పోతోంది. ఆ దేశ ర‌క్ష‌ణ మంత్రి వ్యాఖ్య‌లే ఇందుకు సాక్షి.ప‌హెల్గామ్ దాడి జ‌ర‌గ్గానే పాకిస్థాన్ వెంట‌నే త‌న ఎయిర్ స్పేస్ మూసేసింది. ఎప్పుడైనా స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ జ‌ర‌గొచ్చ‌నే భ‌యంతో క‌శ్మీర్ స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌ర‌కు త‌ర‌లించారు. బ‌లూచిస్తాన్ లో ఉన్న సైన్యాన్ని పీఓకీ స‌రిహ‌ద్దుల ద‌గ్గ‌ర‌కు త‌ర‌లించే టైంలో నిన్న పాకిస్థాన్ ఆర్మీ కాన్వాయ్ మీద దాడి చేసి ప‌ది మంది పాక్ సైనికుల‌ను చంపింది బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ.మ‌రోవైపు క‌రాచీ ఓడ‌రేవుకు ద‌గ్గ‌ర్లో పాకిస్థాన్ నావీ  డ‌మ్మీ మిస్సైల్స్ ప్ర‌యోగించి టెస్ట్ చేస్తోంది. శుక్ర‌, శ‌ని.. రెండు రోజుల పాటు అరేబియా స‌ముద్రంలో నావీ డ్రిల్ ఉంటుంద‌ని అధికారికంగా ప్ర‌క‌టించింది.. పాపిస్తాన్...కాబ‌ట్టి స‌ర్జిక‌ల్ స్ట్రైక్ అయితే ఉండ‌ద‌ని క‌న్ఫం అయ్యింది. ఇక మిగిలింది ఏంటంటే పూర్తి స్థాయి లేదా పాక్షిక యుద్ధం మాత్ర‌మే మిగిలాయి. పాకిస్థాన్ యుద్ధ ఖ‌ర్చు భ‌రించ‌గ‌ల‌దా? అన్న‌ది మ‌రొక ప్ర‌శ్న‌.  అయితే ఇది ఎంతో క‌ష్ట‌సాధ్య‌మైన ప‌ని. ఒక సారి యుద్ధం ప్ర‌క‌టిస్తే.. ముందుగా గోధుమ‌లు చ‌క్కెర‌, బియ్యం, పెట్రోల్- డీజిల్ పై రేష‌న్ విదిస్తుంది పాక్ ఆర్మీ. ముందు సైన్యానికి స‌ర‌ఫ‌రా చేశాక మిగిలితే సాధార‌ణ  పౌరుల‌కు అమ్మాల్సి వ‌స్తుంది.యుద్ధం లేని  టైంలో కూడా పాకిస్థాన్ కి గోధుమ పిండి క‌ర‌వుగా ఉంది. ఈ సిట్యువేష‌న్లో ఆ కాస్త పిండి  కూడా సైన్యం ప‌ట్టుకుపోతే ప‌రిస్థితేంటి? ఇక సాధార‌ణ  పాకిస్తానీయుల ఆహాకారాలు ఆకాశాన్ని అంట‌డం ఖాయం. 


ఇప్ప‌టికే న‌గ‌రాల మాట అటుంచితే.. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి సంగ‌తి దేవుడెరుగు ప‌గ‌టి పూట కూడా క‌రెంటు స‌ప్లై ఉండ‌టం లేదు. ఇక యుద్ధం మొద‌లైతే న‌గ‌రాలు కూడా చీక‌ట్లో అల‌మ‌టించాల్సి వ‌స్తుంది. ఆయుధాల క‌ర్మాగారాల‌కు ఈ విద్యుత్ మొత్తం మ‌ళ్లించాలి కాబ‌ట్టి.. ఈ మాత్రం క‌రెంటు కోత పాకీయుల‌కు త‌ప్ప‌దు.కాబ‌ట్టి పాకిస్థాన్ యుద్ధం చేయ‌డం మాత్ర‌మే కాదు చేయ‌డానికి ప్లాన్ చేసుకోవ‌డం కూడా గ‌గ‌న‌మే.. కొన్నాళ్లు పాటు ఎలాంటి యుద్ధం చేయ‌కుండా యుద్ధ స‌న్నాహాల్లో ఉంచినా  చాలు పాకిస్థాన్ వ్య‌వ‌స్థ మొత్తం నిలువునా  కుప్ప‌కూలిపోతుంది. ఎందుకంటే యుద్ధం చేయ‌డానికి వంద రూపాయ‌లు ఖ‌ర్చు అవుతుంద‌నుకుంటే, యుద్ధ స‌న్నాహం కోసం యాభై రూపాయ‌లు వెచ్చించాల్సి వ‌స్తుంది. ఈ మొత్తం ఖ‌ర్చు చేస్తే చాలు పాకిస్తాన్ మ‌ల‌మ‌ల‌మాడిపోవ‌డానికి.  ఇప్ప‌టికే యుద్ధ భ‌యానికి పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ ఛేంజ్ మూత ప‌డింది. ఇక కొన్నాళ్లు ఇలాగే ఉంటే మార్కెట్ల మీద ఎగ‌బ‌డి అవీ ఇవీ ఎగ‌బ‌డి కొనేస్తారు పాకిస్తానీలు. ఇక క‌రాచీ పోర్టు మీద దాడి చేస్తే  దిగుమ‌తులు వెంట‌నే ఆగిపోతాయి. ఇండియ‌న్ నావీ క‌రాచీ పోర్టును దిగ్బంధించే ప‌రిస్థితి కూడా క‌నిపిస్తోంది. స‌ప్లైస్ ఆగినా చాలు పాకిస్థాన్ ఖేల్ ఖ‌తం కావ‌డానికి. చూశారుగా అదీ పరిస్తితి. కేవ‌లం 26 మంది  ప్రాణాల‌ను తీసిన  పాపానికి దేశం మొత్తం గ‌జ‌గ‌జ ఒణ‌కాల్సిన‌ప‌రిస్థితి. అవ‌స‌ర‌మా ఇదంతా అంటూ పాకిస్తానీయులు తెగ కుమిలిపోతున్నారు. ఏం చేద్దాం వారి చేతుల్లో కూడా ఏమీ ఉండ‌దు. పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ టెర్ర‌రిస్టులు ఇదో టెర్ర‌ర్ కారిడార్. ఈ మొత్తం లింకు తెగితే గానీ పాపం పాకిస్థానీయుల‌కు సైతం ఊర‌ట ల‌భించ‌దు. దీన్నే ప్ర‌పంచ అగ్ర దేశాలు గుర్తించి తునాతున‌క‌లు చేయాల్సి ఉంటుంది. మ‌రి చూడాలి... ప్ర‌పంచ‌మంతా క‌ల‌సి ఇప్పుడు భార‌త్ ద్వారా  ఎలాంటి యాంటీ టెర్ర‌ర్ ఆప‌రేష‌న్ చేయిస్తాయో తేలాల్సి ఉంది.

By
en-us Political News

  
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ప్రత్యర్థులను అణచివేయడానికి ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను ఆయుధాలుగా ప్రయోగిస్తోందని ధ్వజమెత్తారు.
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గ‌తంలో ఓ యువ‌కుడు ర‌ప్పా ర‌ప్పా అంటూ ఫ్లెక్సీలు క‌ట్టి త‌న ర్యాలీలో పాల్గొన్న‌పుడే జ‌గ‌న్ వారించాల్సింది. కానీ అలా చేయ‌లేదు స‌రిక‌దా? ర‌ప్పా ర‌ప్పా అంటూ గంగ‌మ్మ జ‌త‌ర‌లో పొట్టేలు న‌రికిన‌ట్టు న‌రుకుతామ‌న‌డంలో త‌ప్పేంట‌ని మీడియానే ఎదురు ప్ర‌శ్నించారు. దీంతో వైసీపీయులు బ‌రితెగించేశారు. ఆయ‌న‌కేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బ‌య‌ట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.