కరీంనగర్ లో బండి నడక నల్లేరు మీద కాదు!

Publish Date:Feb 7, 2024

Advertisement

తెలంగాణలో బీజేపీ ప్రస్థానం ఆశలు, నిరాశల మధ్య కొనసాగుతోంది. అధికారం తథ్యం అంటూ ఆత్మవిశ్వాసంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి దిగిన ఆ పార్టీకి నిరాశ తప్పలేదు. ఇప్పుడు మళ్లీ వచ్చే లోక్ సభ ఎన్నికలలో అత్యధిక స్ఖానాలలో విజయమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. 

బీజేపీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో సింగిల్ డిజిట్ దాటకపోయినా ఎనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని గౌరవ ప్రదమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే ఆ ఎన్నికలలో అధికారమే తరువాయి అన్నంతగా ఆ పార్టీ చేసిన, చేసుకున్న ప్రచారం కారణంగా ఆ పార్టీ తెలంగాణలో సింగిల్ డిజిట్ పార్టీయే అంటూ ప్రత్యర్థులు చేసిన విమర్శలు నిజమయ్యాయి. 

ఇక ఇప్పుడు ఆ పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించింది. 2019 సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాలలో నాలుగింటిలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆ స్కోరును అధిగమించాలన్న పట్టుదలతో ఉంది. వీలైతే అసెంబ్లీ ఎన్నికలలో సాధించలేని డబుల్ డిజిట్ ను ఈ సార్వత్రిక ఎన్నికలలో సాధించాలని ఆశపడుతోంది.  అయితే ఆ ఆశ నెరవేరుతుందా? లేదా అన్నది పక్కన పెడితే.. గత సార్వత్రిక ఎన్నికలలో గెలుచుకున్న స్థానాలను నిలబెట్టుకుంటుందా? అంటే పరిశీలకులు అదంత ఈజీ కాదంటున్నారు. ముఖ్యంగా గత ఎన్నికలలో కరీంనగర్ లోక్ సభ స్థానంలో విజయం సాధించిన బండి సంజయ్ కు ఈ సారి అక్కడ ఎదురు గాలి వీస్తోందని, ఆయన విజయం నల్లేరు మీద బండి నడక ఇంకెంత మాత్రం కాదనీ చెబుతున్నారు.  

అయితే అయోధ్య రామమందిరం ప్రభావం పడితే మాత్రం రాష్ట్రంలో బీజేపీ పలు లోక్ సభ స్థానాలలో గట్టి పోటీ ఇస్తుందని అంటున్నారు. బండి సంజయ్ కు అది కలిసి వస్తే కనుక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని చెబుతున్నారు.  అయితే బండి సంజయ్ విజయాని కాంగ్రెస్ రూపంలో గండం ఉందని కూడా చెబుతున్నారు.  అయితే ఇక్కడ బీఆర్ఎస్ బలహీనంగా ఉండటం, అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ట ప్రభావాన్ని పరిగణనలోనికి తీసుకుంటే తెలంగాణ మొత్తంలో బీజేపీకి గ్యారంటీ అని చెప్పడానికి  కరీంనగర్ స్థానం ఒక్కటే ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ ను బీజేపీ అధిష్టానం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంతో పార్టీలోనే కాకుండా సామాన్య జనంలో కూడా ఆయన పట్ల సానుభూతి వ్యక్తం అవుతోంది. అయితే ఆ సానుభూతి ఆయనకు అసెంబ్లీ ఎన్నికలలో పెద్దగా ఉపయోగపడలేదు. ఆయన పోటీ చేసిన కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుంచి పరాజయం పాలు కావడమే ఇందుకు నిదర్శనం. 
అదే విధంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత రాష్ట్రంలో బీజేపీ శ్రేణులు బాగా డీలా పడ్డాయి. అదే సమయంలో ఎన్నికల ముందు బండి సంజయ్ కు పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బీజేపీ హైకమాండ్ వైఖరి పట్ల కూడా గుర్రుగా ఉన్నారు. ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడి, జైలు పాలై, పలు కేసులలో ఉన్న బండి సంజయ్ విషయంలో బీజేపీ అధిష్ఠానం తీరు కారణంగానే గెలుపు తథ్యమనుకున్న పలు స్థానాలలో గత అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఓటమిని మూటగట్టుకున్నారన్న అసంతృప్తి క్యాడర్ లో ఉంది.   ఆ కారణంగానే బీజేపీలో పెద్దగా జోష్ కనిపించడం లేదు.   

By
en-us Political News

  
రాయలసీమ లిఫ్ట్ విషయంలో మాజీ సీఎం జగన్ మోహన్‌రెడ్డి ఆ ప్రాంతానికి ద్రోహం చేశారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు.
తెలుగువన్ ఎండీ రవిశంకర్ కంఠమనేని సారథ్యంలో వాస్తవ వేదిక ఎనిమిదో ప్రోమో విడుదలైంది.
అనంతపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత దగ్గుబాటి ప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.
తెలంగాణలో ఒక రైల్వే అండర్ బ్రిడ్జి పనుల శంకుస్థాపన సమయంలో ఈ బ్రిడ్జి పనులకు నిధులు తెచ్చింది తామంటే తామంటూ బీజేపీ, బీఆర్ఎస్ లు క్రెడిట్ కోసం పోటీ పడుతున్నాయి. ఈ వ్యవహారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖరరెడ్డిగా మారింది.
స్కిల్ కేసు పేరుతో జగన్ సర్కార్ 2023 సెప్టెంబర్ 9నచంద్రబాబును అన్యాయంగా అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 53 రోజుల పాటు రాజమహేంద్రవరం జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబు ఆ తరువాత హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆధునిక శుక్రాచార్యుడిగా అభివర్ణించారు. శుక్రాచార్యుడు రాక్షసుల గురువన్న సంగతి తెలిసిందే. ఇక కేటీఆర్ ను అయితే ఆయన ఏకంగా మారీచుడిగా అభివర్ణించారు.
మేడారంలో తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 28 నుంచి మేడారం జాతర ప్రారంభం కానున్న నేపథ్యంలో మేడారం వేదికగా కేబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
పండగైనా, పబ్బమైనా చంద్రబాబుకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి ఉంటుందన్న సంగతి తెలిసిందే. అలాగే ప్రగతి అడుగులు నెమ్మదించకూడదన్న పట్టుదలా ఉంది.
జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా వెలుగు వెలిగిన సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయాల నిర్మాణాలను పోలుస్తూ ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. రెండింటినీ పోల్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిద్దామని చూస్తున్న వారిది అవగాహనా రాహిత్యమని చెప్పారు.
పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి అధికారంలో ఉంది. ఇక జాతీయ స్థాయిలో కూడా ఎన్డీయే కూటమిలో తెలుగుదేశం, జనసేన భాగస్వామ్య పార్టీలు. ఈ నేపథ్యంలో తెలంగాణలో జనసేనతో తమ పార్టీ పొత్తు ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని నిర్ణయించింది.
2026 లో రాజ్యసభ నుంచి ఈ ఏడాదిలో ఏకంగా 73 మంది రిటైర్డ్ కానున్నారు.
అమరావతి విషయంలో జగన్ దృక్ఫథంలో ఇసుమంతైనా మార్పు లేదు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరిగితే చంద్రబాబు పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుందన్న దుగ్ధతోనే ఆయన అమరావతిపై ఇప్పటికీ కుట్రలు చేస్తున్నారన్నది రాజకీయవర్గాల టాక్.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.