కేసీఆర్ కోన్ కిస్కా.. బండి సంచలన వ్యాఖ్యలు

Publish Date:Jul 4, 2022

Advertisement

తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. ముగింపు సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభ బ్రహ్మాండంగా విజయవంతమైంది. మోడీ ప్రసంగించిన ఆ సభకు జనసమీకరణలో రాష్ట్ర బీజేపీ విజయవంతమైంది. ప్రధాని మోడీ కూడా సభకు హాజరైన జనసందోహాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. సభా నిర్వహణ భేష్ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను భుజం తట్టి మరీ అభినందించారు.

అదీ సభా వేదికపైనే. ఇది బండికి అనుకోని కానుక. అగ్రనేత, అందునా ప్రధాని మోడీ నుంచి భుజం తట్టి అభినందన అందుకోవడంతో ఆయన ఆనందం పట్టలేకపోయారు. కన్నీటి పర్యంతమయ్యారు. సరే అదంతా అయిపోయింది. సోమవారం ఉదయం బేగంపేట విమానాశ్రయం వద్ద మోడీకి వీడ్కోలు పలికిన తరువాత బండి తనను తాను మరచిపోయి ముఖ్యమంత్రిపై విమర్శలు గుప్పించారు. కోన్ కిస్కా అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సభ విజయవంతమైన ఆనందం ఆయనలో పట్టలేనంతగా ఉండొచ్చు తప్పు లేదు. ఆ ఆనందాన్ని పార్టీ సహచరులతో పంచుకోవచ్చు. మరింత ఉత్సాహంగా రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేయవచ్చు. కానీ బండి ఆ ఆప్షన్లు ఎంచుకోలేదు. ముఖ్యమంత్రిపై పరుష వ్యాఖ్యలతో రెచ్చి పోయారు.

సీఎం కేసీఆర్ ఎవరు కోన్ కిస్కా.. ప్రధాని మోడీ ఆయనకు సమాధానం చెప్పడమేమిటి, మోడీ చెప్పాల్సిందేదో తెలంగాణ ప్రజానీకానికే చెప్పారంటూ వ్యాఖ్యానించారు. మోడీ ప్రసంగం తరువాత కేంద్రం రాష్ట్రానికి చేసిందేమీ లేదంటూ ఇంత కాలం ఊదరగొట్టిన కేసీఆరే తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పుకోవాల్సి ఉందన్నారు.

అత్త సొమ్ము అల్లుడు దానం చేసిన చందంగా ఇంత కాలం కేంద్రం నిధులతో షోకు చేసిన కేసీఆర్ బండారం మోడీ ప్రసంగంతో బట్టబయలైందని విమర్శించారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎంత ఘాటుగానైనా ఉండొచ్చు కానీ బాధ్యతాయుతమైన నేత ఎవరూ ప్రత్యర్థులపై అనుచిత వ్యాఖ్యలు చేయరు. ఇష్టారీతిన చేసే వ్యాఖ్యల వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని కోన్ కిస్కా అని బండి చులకన చేయడం పట్ల బీజేపీ శ్రేణుల్లోనే అభ్యంతరం వ్యక్తం అవుతోంది. 

By
en-us Political News

  
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఉభ సభలు ఆమోదించాయి. అన్ని పార్టీలు ఏకమై మరీ బిల్లుకు ఆమోద ముద్ర వేశాయి.
తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఎక్కడి కక్కడ నిరశన దీక్షలు చేస్తున్నారు.
బీజేపీ,తెలుగు దేశం లు చిరకాల మిత్ర పక్షాలు. ఎన్ని సార్లు విడిపోయినా, ఆ రెండు పార్టీలు మళ్ళీ అన్ని సార్లు కలిసి ఒకటయ్యాయి. ఆ రెండు పార్టీల మధ్య శతృమిత్ర సంబంధాలు, తారు మారైన సందర్భాలు చరిత్ర పుటల్లో చాలానే ఉన్నాయి.
ఏసీబీ కోర్టు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని సిల్ స్కామ్ కేసులో రెండు రోజుల పాటు సీఐడీ కస్టడీకి అనుమతిస్తూ గురువారం (అక్టోబర్22)న ఉత్తర్వులు ఇచ్చింది.
స్కిల్ స్కామ్ కేసులో అరెస్టైన చంద్రబాబును కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది. సీఐడీ ఐదురోజుల కస్టడీ కోరగా సీబీఐ కోర్టు చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో చంద్రబాబుకు హైకోర్టులో ఊరట లభించిలేదు.
వైనాట్ 175 ఇదీ కొద్ది కాలం కిందటి వరకూ ఏపీలో అధికార వైసీపీ నేతలు చేసిన ప్రకటనలు. స్వయంగా సీఎం జగన్ రెడ్డి ప్రదర్శించిన ధీమా. ఔను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నుండి ఆ పార్టీ ఎమ్మెల్యేల వరకూ అంతా వైనాట్ 175 అంటూ తమ భుజాలు తామే చరుచుకునే వారు. ఒక దశలో వైనాట్ 175 అనేది ఒక నినాదంగా ప్రజలలోకి తీసుకెళ్లాలని కూడా చూశారు.
కారణాలేమైతేనేం కోర్టుల్లో వ్యాజ్యాలు తేలడానికి తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆ విషయంలో ఎవరికీ మరో అభిప్రాయం ఉండే అవకాశం లేదు. అదే సమయంలో అరెస్టులు, కేసుల నమోదు నిబంధనలను, పద్ధతులు పాటించకుండా అడ్డగోలుగా జరిగిపోతున్నాయి.
స్కిల్ కేసులో సీఐడీ ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ పూర్తయినా రెండు రోజులుగా తీర్పు వాయిదా పడుతూవస్తున్నది. ఇందుకు కారణం ఏపీ హైకోర్టులో చంద్రబాబు స్వాష్ పిటిషన్ పై కోర్టు తీర్పు రిజర్వ్ లో ఉండడమే.
స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని అరెస్టు చేసిన ఏపీ సీఐడీ ఇప్పుడు నారా లోకేష్ అరెస్టుకు రంగం సిద్ధం చేసిందా? హస్తిన పర్యటనలో ఉన్న ఆయనను అక్కడే అరెస్టు చేసి ఏపీకి తీసుకురావాలని భావిస్తున్నారా అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే ఔననే సమాధానం చెప్పాల్సి వస్తున్నది.
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజూ తీవ్ర గందరగోళం మధ్యే ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అక్రమ అరెస్టుపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు.
అసెంబ్లీ స్పీకర్ స్థానంలో కూర్చున్నది ఎవరైనా, ఆ స్థానానికి ఒక విలువ ఉంది. అందుకే, చట్ట సభల్లో స్పీకర్ స్థానాన్ని, గౌరవంగా సంబోధించాలి, సంబోధిస్తారు. అలాగే, స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి తాను స్వతహాగా,ఎలాంటి వారైనా, ఎలాంటి రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినా తాను కూర్చున్న స్థానం గౌరవాన్ని నిలబెట్టవలసి ఉంటుంది.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శుక్రవారం (సెప్టెంబర్ 21)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ టీబీసీ వరకూ సాగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.