పేదల ఇళ్లకే బుల్డోజర్లా?..ఒవైసీ కాలేజీపై మౌనం ఎందుకు? : బండి సంజయ్

Publish Date:Jul 10, 2026

Advertisement

 

తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతల వ్యవహారం మరోసారి రాజకీయ వేడిని రాజేసింది. కేంద్ర సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్ హైడ్రా తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, అధికారంలో ఉన్నవారికి ఒక న్యాయం.. సామాన్యులకు మరో న్యాయం అనే విధానం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. ఒవైసీకి చెందిన కాలేజీపై హైడ్రా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు. కాలేజీ చెరువు భూమిలో లేదని ప్రజలను నమ్మించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. 

నిజంగా ఎలాంటి ఆక్రమణలు లేకపోతే ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని, ఒకవేళ ఆక్రమణలు జరిగి ఉంటే చట్టప్రకారం ఎలాంటి మినహాయింపులు లేకుండా చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్ల పైనే బుల్డోజర్లు నడుస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంటే, ప్రభావశీలులకు చెందిన నిర్మాణాల విషయం లో మాత్రం ప్రభుత్వం మౌనం పాటిస్తోందని విమర్శించారు.

"చట్టం అనేది వ్యక్తులను బట్టి మారకూడదు. పేదవాడైనా, పెద్దవాడైనా, అధికార పార్టీ నేతైనా, ప్రతిపక్ష నాయకు డైనా ఒకే నిబంధనలు వర్తించాలి. అదే రాజ్యాంగ స్ఫూర్తి" అని బండి సంజయ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వీడి పారదర్శకంగా వ్యవహరించాలని మంత్రి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఆక్రమణలు జరిగినా రాజకీయాలు, మతం, వ్యక్తులను పక్కనపెట్టి సమానంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైడ్రా చర్యలపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్న వేళ బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మరోసారి దుమారం రేపుతున్నాయి.
 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అమరావతి రాజధాని అంశం మళ్లీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఎవరూ ఊహించని ఒక అనూహ్యమైన ఘోర ఘటన చోటుచేసుకుంది.
డీఎస్పీ భీమ్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి ఆయన నివాసంతో పాటు బంధువులు, స్నేహితుల ఇళ్లలో పలుచోట్ల సోదాలు నిర్వహించారు.
మహిళా హక్కుల పరిరక్షణ, సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా అస్సాం
ఖమ్మం జిల్లా చింతకానిలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని కోరుతూ టీడీపీ నేతలు విజయవాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు
తెలంగాణలో ఓటరు జాబితాలో ఉన్న డబుల్, డూప్లికేట్ ఓట్లను తొలగించి ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
గగనతలంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య విమానంలో ఊహించని సాంకేతిక లోపం తలెత్తి తీవ్ర కలకలం రేపింది.
1000 కి.మీ. ప్రయాణించి.. గూగుల్ మ్యాప్స్‌తో వెతికి.. అప్పు తీర్చిన కేరళ స్నేహితుడు..!
పోక్సో కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నం చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి ఆయన విడుదలయ్యారు.
తెలంగాణలోని జనగామ జిల్లా కేంద్రంలో ఊహించని రీతిలో ఒక వింత ఘోరం జరిగింది.
ఓ యువకుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని నమ్మించి, అతని కుటుంబం నుంచి 3.5 కోట్లకు పైగా డబ్బులు తీసుకుని మోసం చేశారనే ఆరోపణలతో దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది.
తమిళనాడు రాజకీయాల్లో కరూర్ తొక్కిసలాట ఉదంతం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.