బండి భగీరథ్‌ ఫోక్సో కేసులో మైనర్‌గా బాధితురాలి నిర్ధారణ

Publish Date:May 15, 2026

Advertisement

 

హైదరాబాద్‌లో నమోదైన ఫోక్సో కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతూ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది. దర్యాప్తులో కీలక అంశమైన బాధితురాలి వయస్సుపై స్పష్టత రావడం కేసును మరింత సీరియస్ దశలోకి తీసుకెళ్లింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, బాధితురాలు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్లు జనన ధృవీకరణ పత్రం సమర్పించింది. ఆ పత్రాన్ని ఆధారంగా తీసుకుని సంబంధిత సంవత్సరానికి చెందిన జీహెచ్‌ఎంసీ జనన రికార్డులను పరిశీలించగా, ఆమె మైనర్ అని నిర్ధార ణ అయ్యింది. ఈ నిర్ధారణ కేసు దర్యాప్తులో కీలక మలుపుగా భావిస్తున్నారు.

ఇదే సమయంలో ఈ వ్యవహారం న్యాయపరంగా కూడా వేడెక్కింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఫోక్సో కేసు ఆరోపణల నేపథ్యంలో తన పేరు, ఫోటోలు, వీడియోలు భవిష్యత్తులో ఉపయోగించ కుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల్లో తన పేరుతో ప్రచారంలో ఉన్న వీడియోలను తొలగిం చాలని కూడా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కోర్టును కోరారు. 

తన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం జరుగుతోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు..పోలీసుల దర్యాప్తు ఒక వైపు వేగంగా కొనసాగుతుండగా, మరోవైపు కోర్టు విచారణ ప్రారంభం కావడం కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. రాజకీయ స్పందనలు, సోషల్ మీడియా చర్చలు, న్యాయ పరమైన పరిణామాలు... అన్ని కలిసి ఈ కేసును రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మార్చేశాయి. ఇకపై దర్యాప్తు ఎలా ముందుకు సాగుతుంది? కోర్టు నుంచి వచ్చే తదుపరి ఆదేశాలు ఏమిటి? అనే  దానిపై ఆసక్తి నెలకొంది.

By
en-us Political News

  
ఆమె అనుభవిస్తున్న బాధను నిరంతరం గమనిస్తున్న దామోదర్ తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యాడు. భార్య అనారోగ్యంపై బెంగ పెట్టుకున్న ఆయన, తాము లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే ఆందోళనతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు.
గోడౌన్‌లో నిల్వ ఉంచిన పెయింట్లు, ర రసాయనాల వల్లే ఈ ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు ధాటికి అనూప్ ప్రధాన్ శరీనం ఛిత్రమై శరీర భాగాలు పది మీటర్ల దూరం వరకూ ఎగిరి పడ్డాయి.
ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రజా ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రోగెస్
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరీలో అనుమానాస్పద స్థితిలో మరణించిన తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పారుపూడి రాధాగాయత్రి కేసులో ఊహించని మలుపు చోటుచేసుకుంది.
తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం నాడు ఒక భారీ పారిశ్రామిక దుర్ఘటన చోటుచేసుకుంది.
తెలంగాణలో ఆదివారం ఉదయం ఒక ఘోర అగ్నిప్రమాదం జరిగింది.
ఇంగ్లండ్ వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టు ప్రకటన
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ అనేది కేవలం ఒక సాంకేతిక పరిజ్ఞానం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు నగర అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు
బీజేపీ నా సీటు చోరీకి పాల్పడిందని కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ అన్నారు.
నేను హోంమంత్రిని కాకపోవడం ఆ క్రిమినల్స్ అదృష్టం...
సమాజంలో నేరస్థులను కేవలం నేరస్థులుగానే చూడాలని, వారికి కులం లేదా మతం అనే ముసుగు
హైదరాబాద్‌లోని KBR పార్క్ సమీపంలో కొత్తగా అమల్లోకి వచ్చిన వన్‌వే ట్రాఫిక్ నిబంధనలు పలువురు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.