దూసుకెళ్తున్న బాలశౌరి ... ఎన్నికల ప్రచారంలో బందరు పోర్టు  కీలకాంశం 

Publish Date:May 8, 2024

Advertisement

రాజ‌కీయంగా సీనియ‌ర్ కూడా అయిన మ‌చిలీప‌ట్నం ఎంపీ వ‌ల్లభ‌నేని బాల‌శౌరి త‌న మార్కు రాజ‌కీయాలు చేస్తున్నారు. బాలశౌరికి రాజ‌కీయంగా ఎంతో అనుభ‌వం ఉంది. ముఖ్యంగా ప్రజ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డంలోనూ ఆయ‌న నేర్పుగా ముందుకు సాగుతార‌నే పేరు తెచ్చుకున్నారు.గత  ఎన్నిక‌ల్లో మ‌చిలీప‌ట్నం నుంచి  ఎంపీగా పోటీ చేసి గెలిచిన వ‌ల్లభ‌నేని బాల‌శౌరి ఇక్కడి నుంచి  వ‌రుసగా రెండోసారి విజయం సాధిస్తారని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో  టీడీపీ నాయ‌కుడు కొన‌క‌ళ్ల నారాయ‌ణ‌ను ఓడించి విజ‌యం ద‌క్కించుకున్న బాలశౌరి త్రి కూటమి అభ్యర్థిగా మచిలీ పట్నం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.  ఆ వెంట‌నే ఆయ‌న కార్యరంగంలోకి దిగిపోయారు.బందరు పోర్టు విషయంలో బాలశౌరి  రాజీ లేని పోరాటం కొనసాగిస్తున్నారు. స‌మ‌స్యలున్న చోట తాను ఉన్నానంటూ నిరూపించుకుంటున్నారు. కీల‌క బందరు ప్రాజెక్టు విషయంలో బాలశౌరికి  మంచి పేరు తెస్తోంది. కృష్ణా జిల్లా వాసుల చిరకాల కల అయిన బందరు పోర్టు విషయంలో ఆయన హాయంలోనే  కదలిక వచ్చింది. గత  ఏడాది ఆగస్టులో పోర్టు నిర్మాణ బాధ్యతల నుంచి నవయుగ సంస్థను తప్పిస్తూ వైకాపా  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో పోర్టు నిర్మాణంపై జిల్లావాసుల్లో ఆశలు సన్నగిల్లాయి. పోర్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని మంత్రులు ప్రకటిస్తూ వచ్చినా దానిపై స్పష్టత లేకుండాపోయింది.
 తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి చొరవ తీసుకోవడంతో కెనరా బ్యాంకు పోర్టు నిర్మాణానికి రుణ సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. కెనరా బ్యాంకు ఎండీ ఆర్‌ఏ శంకర్‌నారాయణను బాల‌శౌరి స్వయంగా తీసుకువ‌చ్చి.. సీఎం జగన్‌ను సచివాలయంలో కలిసేలా ఏర్పాటు చేశారు. వీరి నడుమ సుమారు అరగంటకుపైగా భేటీ జరిగింది. ఈ భేటీలో బాలశౌరి కీల‌కంగా వ్యవ‌హ‌రించారు. బందరు పోర్టు నిర్మాణానికి సుమారు రూ.4వేల కోట్ల రుణసాయం చేసేందుకు కెనరా బ్యాంకు సంసిద్ధత వ్యక్తం చేసింది.   పోర్టు నిర్మాణం త్వరలో మొదలవుతుందని వ‌ల్లభ‌నేని బాల‌శౌరి స్పష్టం చేస్తున్నారు.  దీంతో బందరు పోర్టు నిర్మాణంపై మళ్లీ ఆశలు చిగురించినట్లయింది. దీని వెనుక బాల‌శౌరి క‌ష్టం ఉండ‌డంతో ఆయ‌న అనుచ‌రులు హ‌ర్షం వ్యక్తం చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.త్రి కూటమి కి చెందిన నేతలు, కార్యకర్తలతో బాటు వైకాపాలో ఆయన అనుచరులు ఎక్కువగానే ఉన్నారు. వీళ్లంతా సైలెంట్ గా బాలశౌరికి మద్దత్తు వహిస్తున్నారు.  అయితే, రెండు నెల‌ల కింద‌ట కూడా రాష్ట్ర స‌మ‌స్యల‌ను కేంద్రానికి వివ‌రించ‌డంలోను, లేఖలు రాయ‌డంలోనూ వల్లభనేని బాల‌శౌరి దూకుడు ప్రద‌ర్శించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

పోర్టుకు సుదీర్ఘ చరిత్ర
ప్ర‌స్తుతం కృష్ణా జిల్లా కేంద్రమైన మ‌చిలీప‌ట్నం ఒక‌ప్పుడు బ్రిటిష్ హ‌యంలో పెద్ద తీర ప్రాంత ప‌ట్ట‌ణం. ఇక్కడనుంచి ఎన్నో ఎగుమ‌తులు, దిగుమ‌తులు జరిగేవి. అంతకు ముందే రెండు వేల సంవత్సరాల పూర్వం నుంచే ఇక్కడ నుంచి విదేశాలకు ఎగుమతులు, దిగుమతులు జరిగేవి.
మచిపలీట్నం లోక్‌సభ నియోజకవర్గం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి పలవురు సీనియర్ రాజకీయ నేతలు ఎంపీగా గెలిచారు. ఈసారి ఎన్నికల్లో ఎలాగైన సత్తా చాటాలని ప్రధాన పార్టీలు పట్టుదలతో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌‌లోని 25 లోక్‌సభ స్థానాల్లో మచిలీపట్నం ఒకటి. అవనిగడ్డ, గన్నవరం, గుడివాడ, పామర్రు (ఎస్ సి), పెడన, పెనుమలూరు, మచీలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు మచిలీపట్నం లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తాయి. మచిలీపట్నం లోక్‌సభ స్థానానికి రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సీనియర్లుగా ఉన్న పలువురు నేతలు ఇక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్, టీడీపీల హవా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో మొత్తం 1,518,826మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 737,936కాగా.. మహిళలు 780,825మంది ఉన్నారు.
మచిలీపట్నం లోక్ సభ నియోజకవర్గం చరిత్రను గమనిస్తే.. 1952లో తొలిసారి ఎన్నికలు జరగ్గా.. సీపీఐ నుంచి పోటీచేసిన సనక బుచ్చికోటయ్య గెలిచారు. 1957లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మండలి వెంకట కృష్ణారావు విజయం సాధించారు. 1962లో మండలి వెంకటస్వామి ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలుపొందడం విశేషం. 1967లో కాంగ్రెస్ నుంచి వై.అంకినీడు ప్రసాద్ విజయాన్ని అందుకున్నారు. 1971లో కాంగ్రెస్ నుంచి మేడూరి నాగేశ్వరరావు గెలిచారు. 1977లో కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి అంకినీడు విజయం సాధించారు.. 1980లో తిరిగి ఆయనే గెలిచారు. 1984, 1989, 1991లో కాంగ్రెస్ నుంచి కావూరి సాంబశివరావు విజయం సాధించారు. 1996లో కైకాల సత్యనారాయణ (నటుగు) తెలుగు దేశం పార్టీ నుంచి పోటీచేసి గెలుపొందారు.

ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘమైన సముద్రతీరం ఉండడంతో దానిని ఆసరాగా చేసుకుని అభివృద్ధి చేయాలని వరుసగా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తున్నాయి. కానీ, ఆచరణ మాత్రం అందుకు తగ్గట్టుగా లేదు.
సుదీర్ఘ చరిత్ర కలిగిన మచిలీపట్నంలోని పోర్టు నిర్మాణం రెండడుగులు ముందుకు, మూడడుగులు వెనక్కి అన్న చందంగా కనిపిస్తోంది. పోర్టు నిర్మాణానికి నవయుగ కంపెనీతో వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2007లో చేసుకున్న ఒప్పందాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక రద్దు చేశారు. 
ఏపీలో ఇప్పటికే పోర్టుల ఆధారంగా ఎగుమతులు ఊపందుకున్నాయి. కరోనావైరస్ మహమ్మారి తర్వాత విశాఖ, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల ద్వారా ఎగుమతులు పెరిగాయి. ఉదాహరకు కాకినాడ పోర్ట్ నుంచి 2020-21తో పోలిస్తే 2021-22 లో బియ్యం ఎగుమతులు 25 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
2019లో వల్లభనేని బాలశౌరి విజయం
2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీకి చెందిన వల్లభనేని బాలశౌరి గెలిచారు. ఆయన 60వేలకుపైగా మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కొనకళ్ల నారాయణరావుపై విజయం సాధించారు. వల్లభనేని బాలశౌరి వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచినా.. రెండు నెలల క్రితం పార్టీకి దూరమయ్యారు. ఆయన వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు.. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో ఉండటంతో మచిలీపట్నం టికెట్ జనసేన పార్టీకి దక్కింది. . సిట్టింగ్ ఎంపీ బాలశౌరి మరోసారి జనసేన పార్టీ నుంచి మచిలీపట్నం గెలుస్తారని ప్రచారం జరుగుతోంది.ఇటు వైఎస్సార్‌సీపీ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్‌రావును మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థిగా నియమించింది. వైకాపా కార్యకర్తలు ఇటీవల జనసేన నేత కర్రి మహేశ్ ఇంటిపై దాడి చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కిమ్మనకుండా వ్యవహరిస్తోంది. వైకాపా అరాచకాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైందని జనసేన నేత వాడ వీర ప్రతాప్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాలశౌరి విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

By
en-us Political News

  
ఎన్నో అంచనాలతో విడుదలైన వైసీపీ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. నిర్మాత, దర్శకుడు, హీరో అయిన జగన్ ఈ సినిమాని హింసాత్మకంగా, దారుణంగా రూపొందించడంతో ఆంధ్రా ప్రజలు రిజెక్ట్ చేశారు. ఫస్ట్ రిలీజ్‌లోనే ఈ సినిమాని జనం భరించలేకపోయారు.. ఇక సెకండ్ రిలీజ్ కూడానా?!
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఆయన అజర్ బైజాన్ వెళ్తూ వుండగా వాతావరణం అనుకూలించక హెలికాప్టర్ కూలిపోయిందని తెలుస్తోంది.
భూటాన్ రాజధాని ధింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిష్ట్ టూర్ ఆపరేటర్స్ కార్యాలయాన్ని ఆ సంస్థ ఉపాధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య ప్రారంభించినట్టు ఏబీటీవో ప్రధాన కార్యదర్శి డాక్టర్ కౌలేష్ కుమార్ తెలిపారు.
గ‌తం కంటే ఎక్కువ స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామంటూ ఏపీ సీఎం, వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇటీవ‌ల ఐప్యాక్ బృందంతో స‌మావేశ‌మైన స‌మ‌యంలో ధీమా వ్య‌క్తం చేశారు. వైసీపీ ముఖ్య నేత‌లు సైతం 150 నుంచి 160 స్థానాల్లో విజ‌యం సాధించ‌బోతున్నామ‌ని చెప్పుకుంటూ వ‌స్తున్నారు.
రాజ‌కీయాల్లో ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడలు కావ‌డానికి పెద్ద ఎక్కువ కాలం ప‌ట్ట‌దు. అధికారంలో ఉన్నంత సేపు ఈగ‌ల గుంపులా పార్టీ ముఖ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేసే నేత‌లు.. అధికారంలో కోల్పోయిన త‌రువాత వారి వైపు కూడా చూడ‌రు.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-17
ఆంధ్రప్రదేశ్ లో ఒక విచిత్ర పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉన్నారు. అంటే రాష్ట్రంలో అల్లర్లు శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యత వాటిని అరికట్టి సాధారణ స్థితి పునరుద్ధరించేలా అధికారులకు దిశానిర్దేశం చేయడం. అయితే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆ బాధ్యతను పూర్తిగా విస్మరించేశారు.
న్నికలలో విజయం సాధించడం కోసం అనుసరిస్తున్న విధానాలు, మాట్లాడుతున్న మాటలే కొంత కాదు.. చాలా బాధను కలిగిస్తున్నాయి. 
పల్నాడు జిల్లాలో పోలింగ్ సందర్భంగా, ఆ తర్వాత అల్లర్లు జరిగిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ను, తిరుపతి ఎస్పీని ఎన్నికల సంఘం బదిలీ చేసింది.
సర్వేలు, ఫలితాలు కాదు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పేశారు. ఏపీలో రాబోయే ప్రభుత్వం ఏదో. ఆయన అంచనా ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ విజయం సాధిస్తుంది.
పాపం ఈయనేమో జగన్ పేరు చెబితే ఆనందంతో గుడ్డలు చించుకుంటూ వుంటాడు. వాళ్ళేమో ఈయన్ని కూరలో కరేపాకుని తీసేసినట్టుగా తీసి అవతల పారేస్తూ వుంటారు. కేసీఆర్‌కి ఇలాగే అవ్వాలిలే!!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.