అరటి అంటే అంత అలుసా!

Publish Date:Jul 22, 2019

Advertisement

రోజుకో ఆపిల్ తింటే ఆహారంగా- ఉంచుతుంది డాక్టర్ ని దూరంగా. ఇది అసలు మన భారతీయ వాతావరణానికి సరిపోయే మాట కానే కాదు. నిజానికి మన చుట్టుపక్కల ఉన్న వాతావరణంలో  పండే పళ్ళని మనం తింటే అవి మన ఒంటికి సరిగా సరిపోతాయట. అంటే అరటి, జామ, కమలా, బొత్తాయి, నేరేడు ఇలాంటివి మన వాతావరణంలో పండే పళ్ళు కాబట్టి ఇవి మన వంటికి కరెక్ట్ గా సూట్ అయ్యే పళ్ళు. వీటిలో అరటిపండు మనకి ఏడాది మొత్తం సులువుగా దొరుకుతుంది.


కాని చేతికి అందుబాటులో ఉండటం వల్ల అరటి అంటే చాలా మందికి చులకన. నిజానికి ఒక అరటిపండులో 70% నీరు  ఉంటుందిట. ఎండాకాలంలో దీనిని తినటంవల్ల మనకి త్వరగా అలసట రాదు. అంతే కాదు ఒంట్లో నిస్సత్తువని కూడా దూరం చేస్తుందిట.

 

 

*  అరటిపండు తినటం వల్ల హై బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లో ఉంటుందిట. న్యూ ఇంగ్లాండ్ జనరల్ ఆఫ్ మెడిసిన్ వారు ఈ పండు తింటే గుండెపోటు 40% తగ్గే వీలుందని ప్రకటించారు కూడా.

*  దీనిలో  పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల గుండె సరిగా పనిచేసేలా చేస్తుంది. ఈ పొటాషియం కిడ్నీలకి, ఎముకలకి కూడా బలాన్నిస్తుంది.


*  దీనిలో ఫైబర్ కంటెంట్ ఉండటం వల్ల జీర్ణశక్తిని పెంచుతుంది. ఆహ్హారం అరుగుదలకు తోడ్పడుతుంది.

*  కడుపులో అల్సర్లు ఉన్నవారికి ఇదొక మంచి ఔషధం. కడుపు మంటని చక్కగా తగ్గిస్తుంది.

*  విటమిన్ B6 చాల ఎక్కువగా ఉండటం వల్ల ఇది హిమోగ్లోబిన్ తయారుకావటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

*  ఈ అరటిపండులో విటమిన్ సి, మెగ్నీషియం, మెంగనీస్ కూడా ఉండటం తో ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

*  మన అలసిపోయినపుడు ఒక్క అరటిపండు తింటే చాలు పోయిన ఓపిక తిరిగి వస్తుంది. ఇది ఒంట్లో శక్తిని పెంచటమే కాదు, స్ట్రెస్ ని కూడా బాగా తగ్గిస్తుంది.

 

 

*  రాత్రి పూట అరటి పండు ఒక గ్లాసు పాలు తాగితే నిద్ర హాయిగా పడుతుంది కూడా. నిద్ర కి కూడా ఇది మంచి మందులాంటిది.

డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.

* అరటిపండ్లలో కణోత్పత్తిని ప్రోత్సహించే గుణం, జీర్ణాశయం గోడలకున్న సన్నటి పొర నాశనం కాకుండా కాపాడుతుంది.

సంస్కృతంలో కదళి ఫలంగా పిలిచే అరటిపండు ఎన్నో ఉపయోగాలకు పుట్టినిల్లు లాంటిది. ఒకప్పుడు ప్రతి పెరడులోను ఈ చెట్టు కనిపించేది. కేవలం పండు మాత్రమే కాదు అరటికాయ కూడా ఒంటికి ఎంతో  మేలు చేస్తుంది. అరటి అక్కులో భోజనం చేస్తే తిన్నది చక్కగా అరిగి జీర్ణ సంభందిత వ్యాధులు దగ్గరకి కూడా రావు. ఇన్ని ఉపయోగాలు ఉన్న అరటిని రోజుకి ఒకటైన తినటం అలవాటుగా మార్చుకుంటే ఎన్నో వ్యాధులు రాకుండా చెక్ పెట్టచ్చు.

- కళ్యాణి  

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.