పవన్ తో బాలినేని భేటీ ఎందుకంటే?

Publish Date:Jan 24, 2025

Advertisement

ప్రకాశం జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైపోనుందా? ఆ పార్టీ జెండా కూడా ఇకపై కనిపించే అవకాశం లేదా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు. వైసీపీ అధినేత జగన్ కు బంధువైన బాలినేని జగన్ అధికారంలో ఉన్నంత కాలం వైసీపీలోనే ఉన్నారు. వాస్తవానికి జగన్ సొంతంగా వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ ను వీడి బాలినేని కూడా జగన్ తో అడుగు కలిపి నడిచారు. అంత వరకూ బాగానే ఉంది. ఎప్పుడైతే జగన్ అధకారంలోకి వచ్చిన మూడేళ్లకు తన మంత్రివర్గాన్ని విస్తరించారో.. అప్పటి నుంచే బాలినేనిలో అసంతృప్తి మొలకెత్తింది.

ఎందుకంటే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేబినెట్ లో బాలినేనికి చోటు ఇచ్చారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాలినేని మంత్రి పదవిని పీకేశారు. అదే సమయంలో అదే జిల్లాకు అంటే ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రిని మాత్రం కొనసాగించారు. ఇది సహజంగానే బాలినేనిలో అసంతృప్తికి, అసమ్మతికి కారణమైంది. అప్పటి నుంచీ బాలినేని వైసీపీలో కొనసాగినా, సొంత పార్టీలోనే అసమ్మతి వాదిగా మిగిలిపోయారు. జగన్ పొమ్మనకపోయినా, బాలినేనికి పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. మెడపట్టి గెంటినా చూరుపట్టుకు వేళాడిన చందంగా ఆయన  వైసీపీలో కొనసాగారు. ఇక 2024 ఎన్నికలకు ముందు బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ టికెట్ వస్తుందా? అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఎలాగోలా టికెట్ సంపాదించుకున్నప్పటికీ ఆ ఎన్నికలలో బాలినేని పరాజయం పాలయ్యారు. ఆ తరువాత ఆయన తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే తన ఫిర్యాదుకు పార్టీ నుంచి ఎటువంటి మద్దతూ రాకపోవడంతో ఆయన ఇక లాభం లేదనుకుని జనసేన గూటికి చేరారు. 

ఆర్భాటంగా జనసేన ఎంట్రీ కోసం బాలినేని తహతహలాడినప్పటికీ జనసేనాని పవన్ కల్యాణ్ అందుకు అంగీకరించలేదు. ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, దానికి పవన్ ను ఆహ్వానించి తన అనుచరులతో భారీగా కార్యక్రమం నిర్వహించాలని భావించిన బాలినేనికి పవన్ కల్యాణ్ చెక్ పెట్టారు. ఒంటరిగా మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చి పార్టీ కండువా కప్పుకుని వచ్చామా.. చేరామా అన్నట్లుగా కార్యక్రమాన్ని ముగించాలన్న పవన్ ఆదేశాల మేరకు బాలినేని అతి నిరాడంబరంగా జనసేన గూటికి చేరారు. 

ఇక ఇప్పుడు బాలినేనికి అవకాశం వచ్చింది. బాలినేని మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో  గురువారం (జనవరి 23) భేటీ అయ్యారు. ఈ భేటీలో బాలినేని మళ్లీ ఒంగోలులో బారీ బహిరంగ సభ ప్రస్తావన తీసుకువచ్చారు. ఆ సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. అందుకుపవన్ సానుకూలంగా స్పందించారని సమాచారం. ఒంగోలు వేదికగా బాలినేని భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ వేదికపై తన అనుచరులు పెద్ద ఎత్తున జనసేనలో చేర్చించాలని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒంగోలులో భారీ బహిరంగ సభకు వస్తే.. ఇక ప్రకాశం జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే బాలినేనికి ఒక్క ఒంగోలు నియోజకవర్గంలోనే కాదు మొత్తం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గట్టి పట్టు ఉంది. వాస్తవానికి బాలినేని జనసేన గూటికి చేరిన సమయంలోనే ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో జనసేన తీర్ధం పుచ్చుకోవాల్సి ఉంది. అప్పట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బాలినేని వారిని వారించారు. ఇక ఇప్పుడు అలా వారించే పరిస్థితి లేదు. ఆయనపై అనుచరుల ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తో తన అనుచరుల చేరిక గురించి మాట్లాడారని, ఫిబ్రవరి 5న ఒంగోలులో భారీ బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో వారిని పార్టీలో చేర్చుకోవాలన్న బాలినేని ప్రతిపాదనకు పవన్ అంగీకరించినట్లు సమాచారం.

అదే జరిగితే ప్రకాశం జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గిరి సహా వైసీపీ కార్పొరేటర్లంతా జనసేన గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారనీ, అలాగే జిల్లా నలుమూలల నుంచీ కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ క్యాడర్ జనసేన కండువా కప్పుకుంటారని అంటున్నారు. అంటే జనసేనాని ఒంగోలులో బాలినేని ఏర్పాటు చేసే సభకు రావడం అంటూ జరిగితే ప్రకాశం జిల్లాలో వైసీపీ గాయబ్ అయిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఆ వ్యూహం అమరావతి విధ్వంసమేనని నొక్కి వక్కాణిస్తున్నారు. విజయవాడ మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు జగన్ మావిగన్ ప్రతిపాదన కేవలం చంద్రబాబుపై విమర్శకే పరిమితం కాదన్నారాయణ. ఈ మావిగన్ ప్రతిపాదన వెనుక అమరావతి అస్థిత్వాన్నే ప్రశ్నార్థకం చేసే అతి బయంకరమైన కుట్ర కోణం ఉందని ఏబీ వెంకటేశ్వరరావు వివరించారు.
బీఆర్ఎస్ అఫీషియల్ సోషల్ మీడాయా ఖాతాలలో అంగన్ వాడీలకు సెల్ ఫోన్ల వ్యవహారంలో భారీగా అవినీతి జరిగిందంటూ వచ్చిన వరుస పోస్టులు తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగించాయని సీతక్క ఆ నోటీసులో పేర్కొన్నారు.
తమిళనాడులో ఆదివారం జరిగిన ఒక రోడ్‌షోలో హలోగ్రాఫిక్ ఏఐ టెక్నాలజీని ఉపయోగించారు. విజయ్ స్వయంగా అక్కడ ప్రచారంలో పాల్గొన లేదు. కానీ ఏఐ ద్వారా విజయ్ రూపం, గొంతుఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డిజిటల్ మీడియా, ఆ తరువాత త్వరలోనే పూర్తి స్థాయి శాటిలైట్ చానల్ అని ప్రకటిస్తూ విజయ సాయి రెడ్డి.. ఆ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే.. తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే అలా విమర్శించి ఊరుకోకుండా అమరావతిలో సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం అంటే దీక్ష చేస్తున్న రామచంద్రయాదవ్ కు మద్దతు ప్రకటించారు.
కేంద్రం ఇంత వేగంగా ఈ నిర్ణయం తీసుకోవడం, పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఇందుకు సంబంధిచిన బిల్లు ఆమోదం పొందడం, ఆ వెంటనే రాష్ట్రపతి సంతకం, గెజిట్ నోటిఫికేషన్ విడుదల ఎలాంటి జాప్యం లేకుండా సాగిపోవడం వెనుక ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు. ఆ విషయంలో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కీలక చర్చ జరుుగుతోంది.
జన్ సూరాజ్ పార్టీని స్థాపించి బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలలో ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. 2014 ఎన్నికలలో మోడీ నాయకత్వంలో ఎన్డీయే ఘన విజయం సాధించడం నుంచి మొదలు పెడితే.. 2019లో ఆంధ్రప్రదేశ్ లో జగన్ నాయకత్వంలోని వైసీపీ, ఆ తరువాత పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ లను అధికారంలోకి తీసుకురావడానికి తన వ్యూహాలే కారణమని తన భుజాలను తానే చరిచేసుకుని మరీ చెప్పుకున్న ప్రశాంత్ కిషోర్.. తన సొంత రాష్ట్రంలో సొంత పార్టీని గెలిపించుకోలేక చతికిల పడ్డారు.దీంతో ప్రశాంత్ కిశోర్ ప్రతిష్ఠ మసకబారింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎండగట్టారు. అమరావతిని జగన్ నిరంతరం ప్రయత్నిస్తున్నారనీ, ఇప్పుడు కొత్తగా మావిగన్ ప్రతిపాదనను తెరపైకి తెచ్చి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.