పవన్ తో బాలినేని భేటీ ఎందుకంటే?

Publish Date:Jan 24, 2025

Advertisement

ప్రకాశం జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైపోనుందా? ఆ పార్టీ జెండా కూడా ఇకపై కనిపించే అవకాశం లేదా? అంటే ఔనన్న సమాధానమే వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరావు. వైసీపీ అధినేత జగన్ కు బంధువైన బాలినేని జగన్ అధికారంలో ఉన్నంత కాలం వైసీపీలోనే ఉన్నారు. వాస్తవానికి జగన్ సొంతంగా వైసీపీ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ ను వీడి బాలినేని కూడా జగన్ తో అడుగు కలిపి నడిచారు. అంత వరకూ బాగానే ఉంది. ఎప్పుడైతే జగన్ అధకారంలోకి వచ్చిన మూడేళ్లకు తన మంత్రివర్గాన్ని విస్తరించారో.. అప్పటి నుంచే బాలినేనిలో అసంతృప్తి మొలకెత్తింది.

ఎందుకంటే 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కేబినెట్ లో బాలినేనికి చోటు ఇచ్చారు. అయితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాలినేని మంత్రి పదవిని పీకేశారు. అదే సమయంలో అదే జిల్లాకు అంటే ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రిని మాత్రం కొనసాగించారు. ఇది సహజంగానే బాలినేనిలో అసంతృప్తికి, అసమ్మతికి కారణమైంది. అప్పటి నుంచీ బాలినేని వైసీపీలో కొనసాగినా, సొంత పార్టీలోనే అసమ్మతి వాదిగా మిగిలిపోయారు. జగన్ పొమ్మనకపోయినా, బాలినేనికి పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి. మెడపట్టి గెంటినా చూరుపట్టుకు వేళాడిన చందంగా ఆయన  వైసీపీలో కొనసాగారు. ఇక 2024 ఎన్నికలకు ముందు బాలినేనికి ఒంగోలు అసెంబ్లీ టికెట్ వస్తుందా? అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. ఎలాగోలా టికెట్ సంపాదించుకున్నప్పటికీ ఆ ఎన్నికలలో బాలినేని పరాజయం పాలయ్యారు. ఆ తరువాత ఆయన తన ఓటమికి ఈవీఎంల ట్యాంపరింగే కారణమంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు. అయితే తన ఫిర్యాదుకు పార్టీ నుంచి ఎటువంటి మద్దతూ రాకపోవడంతో ఆయన ఇక లాభం లేదనుకుని జనసేన గూటికి చేరారు. 

ఆర్భాటంగా జనసేన ఎంట్రీ కోసం బాలినేని తహతహలాడినప్పటికీ జనసేనాని పవన్ కల్యాణ్ అందుకు అంగీకరించలేదు. ఒంగోలులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి, దానికి పవన్ ను ఆహ్వానించి తన అనుచరులతో భారీగా కార్యక్రమం నిర్వహించాలని భావించిన బాలినేనికి పవన్ కల్యాణ్ చెక్ పెట్టారు. ఒంటరిగా మంగళగిరి జనసేన కార్యాలయానికి వచ్చి పార్టీ కండువా కప్పుకుని వచ్చామా.. చేరామా అన్నట్లుగా కార్యక్రమాన్ని ముగించాలన్న పవన్ ఆదేశాల మేరకు బాలినేని అతి నిరాడంబరంగా జనసేన గూటికి చేరారు. 

ఇక ఇప్పుడు బాలినేనికి అవకాశం వచ్చింది. బాలినేని మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ తో  గురువారం (జనవరి 23) భేటీ అయ్యారు. ఈ భేటీలో బాలినేని మళ్లీ ఒంగోలులో బారీ బహిరంగ సభ ప్రస్తావన తీసుకువచ్చారు. ఆ సభకు పవన్ కల్యాణ్ ను ఆహ్వానించారు. అందుకుపవన్ సానుకూలంగా స్పందించారని సమాచారం. ఒంగోలు వేదికగా బాలినేని భారీ బహిరంగ సభ నిర్వహించి ఆ వేదికపై తన అనుచరులు పెద్ద ఎత్తున జనసేనలో చేర్చించాలని భావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒంగోలులో భారీ బహిరంగ సభకు వస్తే.. ఇక ప్రకాశం జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే బాలినేనికి ఒక్క ఒంగోలు నియోజకవర్గంలోనే కాదు మొత్తం ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గట్టి పట్టు ఉంది. వాస్తవానికి బాలినేని జనసేన గూటికి చేరిన సమయంలోనే ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో జనసేన తీర్ధం పుచ్చుకోవాల్సి ఉంది. అప్పట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో బాలినేని వారిని వారించారు. ఇక ఇప్పుడు అలా వారించే పరిస్థితి లేదు. ఆయనపై అనుచరుల ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే పవన్ కల్యాణ్ తో తన అనుచరుల చేరిక గురించి మాట్లాడారని, ఫిబ్రవరి 5న ఒంగోలులో భారీ బహిరంగ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో వారిని పార్టీలో చేర్చుకోవాలన్న బాలినేని ప్రతిపాదనకు పవన్ అంగీకరించినట్లు సమాచారం.

అదే జరిగితే ప్రకాశం జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైనట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ముఖ్యంగా ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గిరి సహా వైసీపీ కార్పొరేటర్లంతా జనసేన గూటికి చేరడానికి సిద్ధంగా ఉన్నారనీ, అలాగే జిల్లా నలుమూలల నుంచీ కూడా పెద్ద సంఖ్యలో వైసీపీ క్యాడర్ జనసేన కండువా కప్పుకుంటారని అంటున్నారు. అంటే జనసేనాని ఒంగోలులో బాలినేని ఏర్పాటు చేసే సభకు రావడం అంటూ జరిగితే ప్రకాశం జిల్లాలో వైసీపీ గాయబ్ అయిపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

By
en-us Political News

  
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
This special article looks at Dr. Sarvepalli Radhakrishnan not simply as a philosopher and former President, but as a teacher whose ideas remain deeply relevant today. What would he ask us about education, technology, our children, teachers and the kind of India we are building?
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
డా. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈరోజు మనకు గురువుగా ఉంటే ఏం చెప్పేవారు? విద్య, విలువలు, టెక్నాలజీ, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, దేశ భవిష్యత్తుపై ఆయన ఆలోచనలు ఈరోజు భారతదేశానికి ఎలా మార్గదర్శకంగా నిలుస్తాయి?
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.