వరుసగా నాలుగు సెంచురీలు. ఆపై మొన్నటికి మొన్నపద్మ అవార్డు. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ అవార్డు. ఇప్పుడు చూస్తే ఏకంగా ఆయన చిత్రానికి జాతీయ అవార్డు. ఎటు నుంచి ఎటు చూసినా బాలకృష్ణ ప్రభ నానాటికీ వెలిగిపోతూ కనిపిస్తోంది. ఆ మాటకొస్తే ఆయన పానిండియా స్టార్ కావడానికి పెద్దగా కష్టపడనవసరం లేదని తెలుస్తోంది.
ఇప్పటికే ఆయన అఖండ- 2 మేకింగ్ లో ఉన్నారు. ఇది చాలు బాలకృష్ణను మరో టాలీవుడ్ టర్న్ డ్ పానిండియా స్టార్ ని చేయడానికని తెలుస్తోంది. కారణమేంటంటే అది ఎలాగూ జాతీయ వ్యాప్తంగా గుర్తు పట్టే పాత్ర. కాబట్టి ఈ దిశగా బాలకృష్ణ ఇమేజీని పెంచడంలో ఏమంత కష్టం కాదంటున్నారు విశ్లేషకులు.
బాలకృష్ణతో సమానంగా అప్పట్లో ఒక వెలుగు వెలిగిన వారెవరని చూస్తే చిరంజీవి, వెంకటేష్, నాగార్జున. ఆ రోజుల్లో చిరంజీవి- బాలకృష్ణ- వెంకటేష్- నాగార్జున ఒక టాలీవుడ్ హీరో సెట్ గా పిలిచేవారు. వీరందరిలోనూ ప్రెజంట్ హైపర్ యాక్టివ్ గా ఉన్నవారెవరని చూస్తే బాలకృష్ణ మెయిన్ గా తెలుస్తోంది.
బాలయ్య బాబు ఏ శుక్రయోగంలో ఉన్నారో తెలీదు గానీ.. ఇటు చూస్తే రాజకీయంగా టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించి వరుసగా రెండో ఏడాది కూడా దూసుకెళ్తోంది. ఇటు చూస్తే బాలయ్య బాబు కూడా అన్ని రకాలుగా విజయపరంపర కొనసాగిస్తున్నారు. ఆ మాటకొస్తే బాలయ్య బాబు సినిమా బాగా ఆడితే అది పార్టీకి కూడా ఎంతో మేలు చేస్తుందన్న సెంటిమెంట్లున్నాయ్.
అంతెందుకు ఆయన బాగుంటే అంతా బాగుంటుందన్న నమ్మకం అందరిలోనూ ఉంది. దీంతో బాలకృష్ణ పరి పరి విధాల ఆనందంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఫ్యామిలీ పరంగా చూసినా ఆయన మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఆన్ ద ఎర్త్. ఎందుకంటే తన ఇద్దరు అల్లుళ్లలో ఒకరు ఎమ్మెల్యే- మంత్రి, మరొకరు విశాఖ ఎంపీ. ఇక కుమారుడి తెరంగేట్రం కూడా ఇదే టైంలో జరిగిపోతే.. బాలకృష్ణ సంతసం సంపూర్ణమయ్యేలా తెలుస్తోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/balakrishna-25-203288.html
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.