బాజిరెడ్డిది కాంగ్రెస్..కాదు..కాదు.. తెరాస గోత్రమేనట!

Publish Date:Apr 3, 2014

Advertisement

 

నిత్యం నీతి సూత్రాలు, ధర్మ పన్నాలు వల్లెవేసే మన రాజకీయనాయకులకు సిద్దాంతాలు ఉండవని, పార్టీ ఏదయినా టికెట్స్ పొందడం, మళ్ళీ అధికారం చేజిక్కించుకోవడమే ముఖ్యమని చకచకా కండువాలు మారుస్తూ నిరూపిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వైకాపాలో ఉన్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఆ పార్టీ సమైక్యరాగం అందుకొని సీమాంద్రాలోకి దూకేయడంతో ఆయన కూడా అనేకమంది వైకాపా నేతలలాగే ఆయన కూడా తెలంగాణా క్రాస్ రోడ్ల వద్ద ఆగిపోయి దిక్కులు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది.

 

మంచిపేరు, అర్ధబలం ఉన్న ఆయనను తమ వైపు లాక్కోవాలని కాంగ్రెస్, తెరాసలు చాలా గట్టిగానే ప్రయత్నించాయి. ఇంతకాలం ఆయన తెలంగాణను తీవ్రంగా వ్యతిరేఖించిన జగన్ తో కలిసి వైకాపాలో పనిచేసినా, ఇప్పుడు ఆయనను తమ పార్టీలో చేర్చుకోవడానికి ఆ రెండు పార్టీలకు ఎటువంటి అభ్యంతరమూ లేకపోగా ఆయన కోసం పోటీ పడ్డాయి కూడా. అంటే యదా నేత తదా పార్టీలన్నమాట.

 

బాజిరెడ్డి ముందుగా తెరాస వైపు మ్రోగ్గు చూపడంతో ఆయనకి నిజామాబాద్ రూరల్ లేదా ఆర్మూర్ అసెంబ్లీ సీట్లలో ఏదో ఒకటి ఖరారు చేసేందుకు తెరాస సిద్దమయిపోయింది. ఒకవేళ ఆయన కాంగ్రెస్ అభ్యర్ధి డీ.శ్రీనివాస్ పై పోటీలో ఓడిపోతే ఆయనను రాజ్యసభకు పంపిస్తామని తెరాస కౌంటర్ గ్యారంటీ కూడా ఇచ్చింది. కానీ, ఆ తరువాత వరుసపెట్టి తెదేపా నేతలు తెరాసలోకి వచ్చిపడుతుండటంతో కేసీఆర్ బాజిరెడ్డిని, ఆయనకి ఇచ్చిన హామీని కూడా మరిచిపోయారు. దానితో ‘అనుచరుల ఒత్తిడి’ మేరకే కాంగ్రెస్ హ్యాండ్ అందుకొనేందుకు పొన్నాలతో టచ్చులోకి వచ్చేరు బాజిరెడ్డి. ఆయన రాక చూసి పొన్నాల కూడా చాలా సంతోషిస్తూ నువ్వొస్తానంటే..నేనొద్దంటానా...అని పాటందుకొని బాజిరెడ్డికి బాన్సువాడ సీటులో కర్చీఫ్ వేసేసుకోవచ్చని హామీ ఇచ్చారు. మరింకెందుకు ఆలస్యం అనుకొన్న ఆయన దిగ్విజయ్ చేత కాంగ్రెస్ కండువా కప్పించుకొని వచ్చేందుకు డిల్లీ విమానం ఎక్కేసారు.

 

కాంగ్రెస్, తెదేపాలను తిట్టిపోయడంలో తీరికలేకుండా ఉన్న కేసీఆర్, తను ఏమరపాటుగా ఉన్న సమయం చూసి కాంగ్రెస్ ఈవిధంగా తన కాలి క్రింద చాపనే లాగేయడం చూసి షాక్ అయ్యారు. బాజిరెడ్డి గనుక బాన్సువాడ నుండి పోటీ చేసినట్లయితే అక్కడ నుండి పోటీకి దిగుతున్న తమ సిటింగ్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి తట్టుకోలేరని కంగారుపడిన కేసీఆర్, బాజిరెడ్డి ఎక్కిన విమానం ఇంకా డిల్లీలో ల్యాండ్ అవకముందే ఆయనను గాలిలోనే వలేసి పట్టుకొని, ఆయన చేతిలో నిజామాబాద్ రూరల్ టికెట్ పెట్టేసారు. దానితో ఆయన అదే విమానంలో మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేసి విమానాశ్రయం దగ్గర సిద్దంగా ఉన్న గులాబీ కారులో ఎక్కేసారు.

 

ప్రజాసేవ చేసుకోవాలంటే ఈ మాత్రం టెన్షన్లు, హడావుడి మామూలే. అందుకే పార్టీలుమారి చూడు... ప్రజాసేవ చేసి చూడు అంటారు రాజకీయ విశ్లేషకులు.

By
en-us Political News

  
యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.
ప్రణాళికా బద్ధంగా ప్రపంచంలో ఏ రాజధానికీ తీసిపోకుండా, ఇంకా చెప్పాలంటే వాటి కంటే మిన్నగా అమరావతి నిర్మాణం జరుగుతోంది. నిర్ణీత కాలవ్యవధిలో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న ధృఢ సంకల్పంతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
సుదీర్ఘ విరామం తరువాత కేసీఆర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి బయటకు రావడాన్ని పరిగణనలోనికి తీసుకుంటే..కేంద్రంతో అదే నండీ మెడీతో ఏదో డీల్ సెట్ అయినట్లే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. గత దశాబ్దంనర కాలంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ఫాలో అవుతున్న పాలసీని నిశితంగా గమనిస్తున్న వారు కూడా కేటీఆర్, మడీ మధ్య డీల్ సెట్ అయ్యిందనే భావించాల్సి వస్తోందంటున్నారు.
ప‌వ‌న్ త‌న‌కు తెలీకుండా అయితే ఒక గొప్ప మాట అనేశారు.
కేసీఆర్ కూడా యాక్టివ్ కావడానికి తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలను లేవనెత్తి జనంలో సెంటిమెంట్ ను రేకెత్తించాలని భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. నీటి కేటాయింపులు, హక్కులను ప్రధాన అజెండాగా కేసీఆర్ గళమెత్తేందుకు సమాయత్తమౌతున్నారని బీఆర్ఎస్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి.
బ్యాలెట్ ఓటింగ్ అంటే బీజేపీకి ఇందుకే అంత‌ భ‌య‌మ‌నీ, అందుకే ఆ పార్టీ ఈవీఎంలతోనే నెట్టుకొస్తోంద‌నీ నెటిజనులు పెద్ద ఎత్తున సెటైర్లు గుప్పిస్తున్నారు. మోడీ మూడు సార్లు ప్ర‌ధాని కాగ‌లిగార‌ంటే ఈవీఎంల పుణ్యం కూడా ఎంతో కొంత ఉందని అంటున్నారు.
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించింది. అదే విధంగా గృహ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నది. ఈ రెండూ మహిళకు సంతృప్తి కలిగించాయనడంలో సందేహం లేదు. దీంతో చాలా వరకూ మహిళలు రేవంత్ సర్కార్ పట్ల సానుకూలంగా ఉన్నారని చెప్పవచ్చు.
రెండు ఉప ఎన్నికలలో ఓటమి, తాజాగా పంచాయతీ ఎన్నికలలో పార్టీ పెర్ఫార్మెన్స్ చూడటంతో ఇక తాను రంగంలోకి దిగక తప్పదని భావించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ బీజేపీలో అస‌లేం జ‌రుగుతోంది?
ఈ గ్లోబల్ సమ్మిట్ ను తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వ‌ రెండో విజ‌య‌వంత‌మైన ఏడాది ముగింపు ఉత్స‌వంగా చెప్పాలి. అయితే రేవంత్ సర్కార్ దీనిని ఒక గ్లోబ‌ల్ ఇన్వెస్ట్ మెంట్ ఈవెంట్ గా రూపొందించి గొప్పగా నిర్వహించింది. తెలంగాణ‌ను ప్ర‌పంచ రోల్ మోడ‌ల్ గా తీర్చి దిద్దేలా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది.
ప్రస్తుతం పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ శాఖను ఎంతో సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. విన్నూత్న ఆలోచ‌న‌లతో విమానయానాన్ని సామాన్యులకు చేరువ చేయడానికి, దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజాధనాన్ని తమ సొంతానికి దుబారా చేయడంలో తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలు రికార్డులన్నీ తిరగరాసేశారని అంటున్నారు పరిశీలకులు. అలా అనడానికి కారణం ఇటీవల ఆర్టీఐ ద్వారా వారు పెట్టిన ఖర్చులు వెలుగులోకి రావడమే.
ఆయన ప్రయాణం చేసేది విమానంలో అయినా కెమ్లిన్ లోలాగా అన్ని సౌకర్యాలు ఉంటాయి.అలాగే ఆయన వెంట అదే తరహా మరో విమానం కూడా ఉంటుంది.ఆయన ఏ విమానంలో ప్రయాణిస్తారనేది తెలియకుండా ఉండడం కోసం ఈ ఏర్పాటు. ఆయన తినే ఆహారాన్ని పరిరక్షించే చిన్నసైజు ల్యాబ్ ,వ్యక్తిగత వంటవాడు కూడా ఉంటారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.