Publish Date:Jan 23, 2025
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 20న ఆయన అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసీ చేయడంతోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముందు వెనుకలు ఆలోచించకుండా.. సాధ్యాసాధ్యాలను పట్టించుకోకుండా.. నా మాటే వేదం, నా ఆజ్ణే శిలాశాసనం అన్నట్లుగా ఏకపక్షంగా ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసేశారు.
అలా తీసుకున్న నిర్ణయాలలో అమెరికాలో జన్మతహ వచ్చే పౌరసత్వ హక్కు రద్దు ఒకటి. ఈ నిర్ణయాన్ని అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. వారి పిటిషన్లను విచారించిన అమెరికాలోని సియాటిల్ ఫెడరల్ కోర్టు జన్మతహ వచ్చే పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై స్టే విధించింది. కీఈ సందర్భంగా న్యాయమూర్తి ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఆదేశాలపై స్టే విధించారు.
ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 78 ఫైళ్లపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే. వాటిలో వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వాన్ని రద్దు ఒకటి. ఇది తొందరపాటు నిర్ణయమన్న విమర్శలు వెల్లువెత్తాయి. ట్రంప్ నిర్ణయాన్ని వాషింగ్టన్, ఇల్లినాయిస్, ఓరెగాస్, అరిజోనా రాష్ట్రాలు సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించాయి. అమెరికా రాజ్యంగంలోని 14వ సవరణ ప్రకారం పౌరసత్వ చట్టం నిబంధలనకు ట్రంప్ ఆదేశాలు వ్యతిరేకమని పేర్కొన్నాయి. దీంతో సియాటిల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ జాన్ కాఫ్నర్.. జన్మతః పౌరసత్వ రద్దు కార్యనిర్వాహక ఆదేశాలపై స్టే ఇచ్చారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/back-lash-to-america-president-trump-25-191759.html
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!