ప్రత్యర్థులను సైతం విస్మయపరిచిన చంద్రబాబు చాణక్యం!

Publish Date:Apr 22, 2024

Advertisement

నాయకుడు పార్టీని ముందుండి నడిపించడమే కాదు.. క్లిష్ట సమయాల్లోనూ, సంక్షోభంలోనూ కూడా పార్టీ నేతలూ, క్యాడర్ లో తనపై విశ్వాసం, నమ్మకం కోల్పోకుండా నిలబెట్టుకోవాలి. చంద్రబాబు ఆ విషయంలో ఏ ఇతర రాజకీయ నేతకన్నా ముందు ఉంటారు. ఆయన నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలం కంటే విపక్షంగా ఉన్న కాలమే ఎక్కువ. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత తెలుగుదేశం 14 ఏళ్లు అధికారంలో ఉంటే పదిహేనేళ్లు విపక్షంలో ఉంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజా నేతగా, పార్టీ అధినేతగా ఆయన స్థానం చిక్కబడి గట్టిపడిందే తప్ప బలహీన పడింది లేదు. ఆయన నాయకత్వంపై నేతల్లో కానీ, క్యాడర్ లో కానీ విశ్వాసం సన్నగిల్లిన సందర్భం లేదు. 2019 ఎన్నికలలో పరాజయం తరువాత పార్టీ ఇక పుంజుకోవడం కష్టమన్న భావన రాజకీయవర్గాలలో వ్యక్తమైంది. అయితే ఫీనిక్స్ లా పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంది. సామాన్య జనంలో కూడా చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి రక్ష అన్న భావన వ్యక్తమయ్యేలా ఆయనపై విశ్వసనీయత పెరిగింది. 2024 ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీ విజయంపై దాదాపుగా ఎవరికీ ఎటువంటి సందేహం లేని పరిస్థితి నెలకొంది.

అయితే ఈ ఎన్నికలలో జనసేన, బీజేపీలతో తెలుగుదేశం పొత్త పెట్టుకుంది. ఒంటరిగానే అధికారంలోకి రావడం ఖాయమైన పరిస్థితుల్లో పొత్త పేరుతో కొన్ని స్థానాలను త్యాగం చేయడం అవసరమా అన్న భావన పార్టీ కార్యకర్తలలో వ్యక్తం అయ్యింది. అయితే చంద్రబాబు పార్టీ నేతలనూ క్యాడర్ ను పొత్తుకు ఒప్పించారు. పొత్తుపై చర్చలకు ముందు వరకూ జనసేన తమ వాటా కింది 40 నుంచి 50 స్థానాల వరకూ కోరుతోందన్న వార్తలు వినిపించాయి. అయితే చంద్రబాబు పొత్తులో భాగంగా 21 స్థానాలలో పోటీకి జనసేనను ఒప్పించి పార్టీ క్యాడర్ సహా అందరినీ ఆశ్చర్య పరిచారు. అలాగే బీజేపీతో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న అభిప్రాయంతో ఉన్న పార్టీ వర్గాలను సముదాయించారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలలోనే పోటీ చేయాల్సి రావడం, అలాగే పొత్తులో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో తెలుగుదేశంలో గత ఐదేళ్లుగా జగన్ పాలనను ఎదిరించి నిలబడి పోరాడిన కొందరు నేతలకు ఈ సారి పార్టీ టికెట్ దక్కలేదు.

దీంతో పలు నియోజకవర్గాలలో తెలుగేదేశం రెబల్స్ రంగంలోకి దిగే అవకాశాలు మెండుగా ఉంటాయనీ ఆ మేరకు తెలుగుదేశం నష్టపోయే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషించారు. అయితే  చంద్రబాబు రెబల్స్ బెడదలేకుండా హ్యాండిల్ చేసిన తీరు రాజకీయ పండితులను సైతం విస్మయపరిచింది. మైలవరం, ఉండి నియోజకవర్గాలలో అసమ్మతి లేకుండా ఆయన డీల్ చేసిన తీరే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.   మైలవరం తెలుగుదేశం టికెట్ ను వసంతకృష్ణ ప్రసాద్ కు ఇవ్వడం, అందుకు దేవినేని ఉమను ఒప్పించడంలో చంద్రబాబు రాజకీయ చాణక్యం బోధపడుతుంది. ఇప్పుడు మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ తరఫున దేవినేని ఉమ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

అలాగే ఉండిలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ వేధింపులను ఎదుర్కొంటూ పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. అయినే సహజంగా ఉండి తెలుగుదేశం అభ్యర్థి అవుతారు. చంద్రబాబు కూడా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. అయితే తీరా నామినేషన్ల కు ముందు అనివార్యంగా ఆయనను మార్చి ఆ సీటును రఘురామకృష్ణం రాజుకు ఇవ్వాల్సి వచ్చింది.  దీనిని వ్యతిరేకిస్తూ రామరాజు తిరుగుబాటు చేస్తారనీ, రెబల్ గా రంగంలోకి దిగుతారనీ అంతా భావించారు. కానీ ఇక్కడే చంద్రబాబు చక్రం తిప్పారు.  పార్టీ  సమావేశంలో రామరాజు రఘురామకృష్ణం రాజుతో కలివిడిగా మెలగడమే కాదు, ఆర్ఆర్ఆర్ నామినేషన్ ర్యాలీలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. అలాగే ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా చురుగ్గా ప్రచారం చేస్తున్నారు.  దెందులూరులో చింతమనేనినే అభ్యర్థిగా నిలపడం, అనపర్తిలో తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం లేకపోవడంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ఒప్పించడం ద్వారా చంద్రబాబు చాణక్యంలో తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకున్నారు. నాయకుడిగా పార్టీపై తన పట్టును మరోసారి సందేహాలకు అతీతంగా నిలుపుకున్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి  రోహిత్ వేముల దళితుడు కాదని,
మరో పది రోజుల్లో  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది. 
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన  రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్‌ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
 బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.