ప్రజాస్వామ్య విలువలకు బాబు పట్టం!

Publish Date:Jun 15, 2023

Advertisement

హత్యా రాజకీయాలే రాజ్యమేలుతున్న నేటి రోజులలో వాటికి దూరంగా ఉంటూ రాజకీయాలలో విలువలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. ప్రత్యర్థులపై ప్రతీకార దాడులకు పాల్పడాలని కోరుకునే సొంత పార్టీ నేతలను సైతం మందలిస్తూ తన ఔన్నత్యాన్ని చాటుకుంటున్నారు. అందుకు సంబంధించి కొండా మురళి, కొండా సురేఖ దంపతులు ఇటీవల ఓ టెలివిజన్ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, ప్రసారమాధ్యమాలలోనూ వైరల్ అయ్యింది.

చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలుగుదేశం కీలక నేత, ఎమ్మెల్యే ఒకరు చంద్రబాబును తన నియోజకవర్గంలో ప్రత్యర్థిగా ఉన్న ఒక విపక్ష నేత ఎలిమినేషన్ ప్రతిపాదన చేశారు. దీనిపై చంద్రబాబు చాలా సీరియస్ గా స్పందించారు. ఏం తమాషాగా ఉందా.. హత్యా రాజకీయాలు ప్రజాస్వామ్యంలో ఉండవు. అటువంటి ఆలోచనలనే నీ మనసులోంచి తుడిచేయ్ అని మందలించారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ ప్రత్యర్థే తన నోటితో చెప్పారు. ఇంతకీ తన ప్రత్యర్థిని ఎలమినేట్ చేయాలన్న అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే ఎవరంటే ప్రస్తతం బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు. ఆయన హత్య చేయమన్నది ఎవరినంటే.. అప్పట్లో ఎమ్మెల్యే అయిన కొండా సురేఖ భర్త కొండా మురళిని. ఈ విషయాన్ని కొండా సురేఖ దంపతులు స్వయంగా ఒక టీవీ ఇంటర్వ్యూలో తమ నోటితో చెప్పారు. ఇంతకీ కొండ మురళీ, కొండ సురేఖ.. సదరు ఇంటర్వ్యూలో  ఏమన్నారంటే.. 

ప్రస్తుతం చంద్రబాబు పాలనతో వైయస్ జగన్ పాలన పోల్చుకుంటే. చంద్రబాబు పాలన వంద శాతం గుడ్  అని వారు స్పష్టం చేశారు. అలాగే తనను ఎన్‌కౌంటర్ చేయాలన్నప్పుడు..ఓ ఎమ్మెల్యే భర్త విషయంలో తాను అలా చేయలేనని చంద్రబాబు కరాఖండీవగా చెప్పారని.. అదే వీరైతే.. అంటే వైయస్ జగన్ ప్రభుత్వం  తనను వందశాతం ఎన్ కౌంటర్ చేయించేదని కొండా మురళి వివరించారు. సరిగ్గా అదే సమయంలో కొండా సురేఖ జోక్యం చేసుకుని ఎర్రబెల్లి దయాకర్ పోయి.. సీఎం చంద్రబాబు కాళ్ల మీద పడితే.... ఆయన స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా  ఎం మాట్లాడుతున్నావ్ దయాకర్.. దేనికైనా ఓ లిమిట్ ఉంటుంది.. ఓ ఎమ్మెల్యే భర్తను చంపడం అంటే అంత ఈజీ అనుకున్నావా? ఇంకా ఏమైనా మాట్లాడు కానీ.. ఇది కుదరదని  ముఖం మీదే చంద్రబాబు క్లియర్ కట్‌గా చెప్పారని.. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు.. ఆ తర్వత తమతో  ఈ విషయం చెప్పారని కొండా సురేఖ స్వయంగా స్పష్టం చేశారు. ఇదే అంశంలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ అయితే... మురళిని ఎన్ కౌంటర్ చేసేసేవారని కొండ సురేఖ అదే ఇంటర్వ్యూలో చెప్పారు. 

తెలుగుదేశం అధినేత , విపక్ష నేత చంద్రబాబు నాయుడు అంటే.. హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి, సైబరాబాద్ నిర్మాణానికి దోహదపడిన వ్యక్తిగా అంతా భావిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి అండ్ కో అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై గత నాలుగేళ్లుగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకోసం.. జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులే కాదు.. జగన్ మలి కేబినెట్‌లోని మంత్రులు సైతం.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై తమ మాటలతో విరుచుకుపడిపోతారన్న విషయం విదితమే.  అలాంటి వేళ.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఫ్యాన్ పార్టీ అధినేత  జగన్ వ్యవహార శైలినే కాదు.. వీరిద్దరి మధ్య తారతమ్యాలను సైతం కొండ మురళి దంపతులు వివరించిన విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

By
en-us Political News

  
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.