కలిశారు సరే.. ఏం మాట్లాడారు?

Publish Date:Jun 4, 2023

Advertisement

తెలుగుదేశం   అధినేత చంద్రబాబునాయుడు హస్తిన వెళ్లారు. అమిత్, జేపీ నడ్డాలతో సమవేశం అయ్యారు.  అమిత్ షా నివాసంలో జరిగిన ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని వేరే చెప్పాల్సిన పని లేదు. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చేసిన తరువాత చంద్రబాబు అమిత్షా తో బేటీ కావడం ఇదే తొలిసారి.  

అంతే కాకుండా ఏపీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమంయంలో జరిగిన ఈ భేటీలో అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు చర్చలు పూర్తిగా రాజకీయపరమైనవేనని అనడంలో సందేహం లేదు.  అయితే అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు ఏం చర్చించి ఉంటారన్న విషయంలో రాజకీయ వర్గాలలో పలు రకాల చర్చలు జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీని ఎన్డీయేలో చేరాల్సిందిగా కోరేందుకే బీజేపీ హై కమాండ్ చంద్రబాబును హస్తినకు పిలిచిందన్న వాదన రాజకీయవర్గాలలో గట్టిగా సాగుతోంది.  

అదే సమయంలో గత నాలుగేళ్లుగా ఏపీలో బీజేపీ అధికార వైసీపీతో అంటకాగుతోందన్న భావన బలంగా జనంలోకి వెళ్లిపోయిందని గట్టిగా నమ్ముతున్న తెలుగుదేశం పార్టీ.. ఈ సమయంలో ఏపీలో బీజేపీ పొత్తు, ఎన్డీయేలో చేరిక అంటే ప్రజలలో పలుచన అయ్యే అవకాశం ఉందన్న సంగతి ఈ భేటీ సందర్భంగా చంద్రబాబు అమిత్ షా, నడ్డాలకు వివరించి ఉంటారని అంటున్నారు.  ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో పొత్తుకు సిద్ధపడితే అది పార్టీకి ప్రయోజనం చేకూర్చడం అటుంచి నష్టం చేకూర్చే అవకాశాలే అధికంగా ఉంటాయని చంబ్రబాబు అమిత్ షా, నడ్డాలకు వివరించి ఉంటారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

రాష్ట్ర ప్రభుత్వం,  రాజ్యాంగాన్ని చట్టాలను ఉల్లంఘిస్తున్నా, కోర్టు తీర్పులను ధిక్కరిస్తున్నా.. ఇంత కాలం కేంద్రం వైసీపీ సర్కార్ కు అన్ని విధాలుగా అండగా నిలవడం, ఆర్థిక అరాచకత్వానికి మద్దతు ఇవ్వడాన్ని చంద్రబాబు ఆ సందర్భంగా వారి వద్ద ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అన్నిటికీ మించి వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ తీరు వెనుక కూడా కేంద్రం ఉందన్న భావన ప్రజలలో బలంగా వ్యక్తమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు పెద్దగా ఉపయోగం ఉండదనీ, ముందు కేంద్రంలోని మోడీ సర్కార్ వైసీపీకి వ్యతిరేకం అన్న భావన కలిగేలా వ్యవహరించి, రాష్ట్ర బీజేపీ నాయకత్వం జగన్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్న తెలుగుదేశం, జనసేన పార్టీలతో క్షేత్ర స్థాయిలో కలిసి ఉద్యమాలలో పాల్గొంటే.. ఆ తరువాత పొత్తుల విషయం మాట్లాడుకోవచ్చని చంద్రబాబు అమిత్ షా నడ్డాలకు వివరించారని అంటున్నారు.

అన్నిటికీ మించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పొత్తు కంటే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వైసీపీకి దూరం పాటించడం అవసరమనీ, అప్పుడు సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలుగుదేశం బీజేపీకి మద్దతుగా నిలుస్తుందని చంద్రబాబు బీజేపీ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు వివరించారని అంటున్నారు. వచ్చే ఎన్నికల తరువాత కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు తెలుగుదేశం లోక్ సభలో అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని, అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ సర్కార్ అరాచకాలు, అక్రమాలకు పాల్పడకుండా   గట్టి చర్యలు తీసుకోవాలని చంద్రబాబు గట్టిగా చెప్పారని పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు.

అన్నిటికీ మించి రాష్ట్రంలో వైసీపీకి బీజేపీ వ్యతిరేకమన్న విషయాన్ని గట్టిగా చాటితే బీజేపీకి అవసరమైతే  తెలంగాణలో టీడీపీ నుంచి సహకారంఅందుతుందని కూడా చంద్రబాబు  అమిత్ షా నడ్డాలకు హామీ ఇచ్చి ఉండొచ్చని అంటున్నారు.  ఇవన్నీ పక్కన పెడితో అమిత్ షా, నడ్డాలతో బాబు భేటీపై ఏపీ సర్కార్ లో కలవరం విస్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ నేతలు, మంత్రులు ఈ భేటీపై చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలూ చూస్తుంటే  తమకు గతంలోలా కేంద్రం మద్దదు లభించదేమోన్న భయం వారిలో ప్రస్ఫుటమౌతోంది. 

By
en-us Political News

  
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.  తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.