బాబు దెబ్బకు దిగొచ్చిన జగన్

Publish Date:May 8, 2023

Advertisement

నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ అన్నీ తెలిసినట్లు ఆర్భాటం చేసి అధికారంలోకి వచ్చిన జగన్ గత నాలుగేళ్లుగా రాజధాని మార్పు, కోర్టు కేసులు, అప్పుల కోసం ఎదురు చూపులతో గడిపేశారు. తీరా స్పందించాల్సిన సమయంలో జగన్ సర్కార్ చేతులెత్తేసింది. ిటీవల రాష్ట్రంలో అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో  జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని తూర్పుగోదావరి జిల్లా వాసులు అంటున్నారు. 

రైతులకుఅండగా నిలబడేందుకు రాజమండ్రిలో మకాం వేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి 72 గంటల అల్టిమేటం యిచ్చారు. అప్పటి లోగా రైతుల కష్టార్జితాన్ని రైతు భరోసా కేంద్రాలకు తరలించి న్యాయం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.  తొలుత పట్టించుకోనట్లు వ్యవహరించిన అధికారులు రైతుల నుండి వస్తున్న ప్రతి స్పందనతో కదలాల్సి వచ్చింది.  వెంటనే ధాన్యం రైతు భరోసా కేంద్రాలకు తరలించే పని మొదలైంది. దీంతో ఊపిరి పీల్చుకున్న రైతులు అండగా నిలబడిన చంద్రబాబుకు కృతజ్ణతలు తెలపారు.  

కష్టంలో ఉన్న రైతాంగం కోసం జిల్లాలో బస చేసి ప్రభుత్వం మెడలు వంచిన చంద్రబాబు అక్కడి తెలుగుదేశం నేతలలో కొత్త ఆశలు నింపారు. యింత కాలం రైతు ప్రభుత్వం మాదే అని చెప్పుకున్న వైసీపీ నేతలకు రైతుల ముందుకు వెళ్లేందుకు ధైర్యం రావడం లేదు.  ఈ ఎపిసోడ్ లో చంద్రబాబు తీసుకున్నసాహసోపేత నిర్ణయం రైతు లోకాన్ని ఆకట్టుకుంది.  72 గంటల లోగా ధాన్యంపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే, ధాన్యం మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ ముంగిట కుప్పలుగా పోస్తామని చంద్రబాబు చేసిన హెచ్చరిక రైతులలో ఆయన గౌరవాన్ని పెంచింది.  ఎమ్మెల్సీ ఎన్నికలలో సాధించిన విజయం తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది.

రైతుల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించడం గ్రామీణ ప్రాంతాలలో తెలుగుదేశంప్రతిష్ట మరింత పెరిగింది.  యింత వరకూ హైకెట్ బాబు అంటూ, వ్యవసాయం దండగ అన్నారంటూ లేనిపోని ఆరోపణలు చేసిన వైసీపీ నోళ్లు ఈ దెబ్బతో మూతపడ్డాయి.  తెలుగుదేశం అధికారంలోకి వస్తే గ్రామీణ పరిశ్రమలపై దృష్టి పెడతామని చంద్రబాబు ముందే ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీడీపీలో 36శాతం వ్యవసాయ రంగం ఆక్రమించింది. కాగా పరశ్రమలశాతం 23శాతంగా ఉంది. సర్వీస్ సెక్టార్ వేల్యూ 41శాతంగాఉంది. అంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అవకాశాలు మెండుగా ఉన్నాయని చంద్రబాబు చెబుతున్నారు.

ఆయన మాటలను బట్టి చూస్తే తెలుగుదేశం అజెండాలో రైతుల సంక్షేమం, వ్యవసాయక అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు పెద్ద పీట వేస్తారని రైతులు ఆశిస్తున్నారు.  వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలంటే బాబు పాలన రావాలని రైతులు అంటున్నారు. 

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.