తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ధరల బాదుడుపై ఆందోళనా కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, స్వయంగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల నాలుగు నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనకు బయలు దేరనున్నారు. నాలుగు నుంచి విడతల వారీగా మహానాడు వరకూ ఆయన ఈ పర్యటనలు కొనసాగించనున్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు ఆందోళనా కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు. నాలుగో తేదీన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో ఆయన పర్యటిస్తారు, ఆ మరుసటి రోజు అంటే 5వ తేదీన భీమిలి నియోజకవర్గం తాళ్లవలసలో పర్యటిస్తారు, ఆరవ తేదీన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోరింగలో పర్యటిస్తారు. ఈ మూడు సందర్భాలలోనూ కూడా తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇప్పటికే చంద్రబాబు వైసీపీ పాలనలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి విదితమే. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని చెబుతున్న చంద్రబాబు, జగన్ సర్కార్ నిర్వాకాలపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ కేడర్ కు పిలుపు నిచ్చారు. అలాగే ఏపీలో దారుణాలపై డీజీపీకి లేఖ రాశారు.
మే 28న ఒంగోలులో తెలుగుదేశం మహానాడు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్యాడర్ లో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ నింపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాట స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా చంద్రబాబు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నిరసన గళమెత్తిన వారిపై పోలీసులు, వైసీపీ శ్రేణులూ దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు జిల్లాల పర్యటన పార్టీ క్యాడర్ లో ధైర్యాన్ని నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించే వారికి తెలుగుదేశం పార్టీ అండ ఉంటుందన్న భరోసాను ప్రజలకు చంద్రబాబు తన పర్యటనల ద్వారా ఇవ్వనున్నారని చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవకతవకల కారణంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ ధరల బాదుడుకు గురౌతున్నారనీ, ప్రభుత్వ అసమర్ధ, అస్తవ్యస్థ విధానాలే రాష్ట్రంలో ధరల బాదుడుకు కారణమని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించడానికి చంద్రబాబు జిల్లా పర్యటనలు దోహదపడతాయని చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనలతో పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం నిండటం ఖాయమని అంటున్నారు. అంతే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా జగన్ ఇంకెంత మాత్రం ఉచిత పథకాలు కొనసాగించలేని పరిస్థితి ఉందనీ, ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్, ఉచితాలు నిలిపివేసి మరింత వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి ముందే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న రాజకీయ పరిశీలకుల విశ్లేషణల నేపథ్యంలో పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడం కూడా బాబు పర్యటనలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/babu-district-tours-aganst-jagan-government-atrocities-39-135355.html
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.