తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ధరల బాదుడుపై ఆందోళనా కార్యక్రమాలకు పిలుపు నిచ్చిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, స్వయంగా జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఈ నెల నాలుగు నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటనకు బయలు దేరనున్నారు. నాలుగు నుంచి విడతల వారీగా మహానాడు వరకూ ఆయన ఈ పర్యటనలు కొనసాగించనున్నారు. తెలుగుదేశం పార్టీ చేపట్టిన బాదుడే బాదుడు ఆందోళనా కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు. నాలుగో తేదీన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో ఆయన పర్యటిస్తారు, ఆ మరుసటి రోజు అంటే 5వ తేదీన భీమిలి నియోజకవర్గం తాళ్లవలసలో పర్యటిస్తారు, ఆరవ తేదీన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కోరింగలో పర్యటిస్తారు. ఈ మూడు సందర్భాలలోనూ కూడా తెలుగుదేశం పార్టీ బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇప్పటికే చంద్రబాబు వైసీపీ పాలనలో మహిళలపై దాడులు, అఘాయిత్యాలపై ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న సంగతి విదితమే. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతిపాలైందని చెబుతున్న చంద్రబాబు, జగన్ సర్కార్ నిర్వాకాలపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలని పార్టీ కేడర్ కు పిలుపు నిచ్చారు. అలాగే ఏపీలో దారుణాలపై డీజీపీకి లేఖ రాశారు.
మే 28న ఒంగోలులో తెలుగుదేశం మహానాడు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి క్యాడర్ లో ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్నీ నింపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై పోరాట స్ఫూర్తిని నింపడమే లక్ష్యంగా చంద్రబాబు జిల్లా పర్యటనలకు శ్రీకారం చుట్టారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నిరసన గళమెత్తిన వారిపై పోలీసులు, వైసీపీ శ్రేణులూ దాడులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో చంద్రబాబు జిల్లాల పర్యటన పార్టీ క్యాడర్ లో ధైర్యాన్ని నింపుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నించే వారికి తెలుగుదేశం పార్టీ అండ ఉంటుందన్న భరోసాను ప్రజలకు చంద్రబాబు తన పర్యటనల ద్వారా ఇవ్వనున్నారని చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవకతవకల కారణంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలూ ధరల బాదుడుకు గురౌతున్నారనీ, ప్రభుత్వ అసమర్ధ, అస్తవ్యస్థ విధానాలే రాష్ట్రంలో ధరల బాదుడుకు కారణమని ప్రజలకు అర్ధమయ్యేలా వివరించడానికి చంద్రబాబు జిల్లా పర్యటనలు దోహదపడతాయని చెబుతున్నారు. చంద్రబాబు పర్యటనలతో పార్టీ క్యాడర్ లో నూతనోత్సాహం నిండటం ఖాయమని అంటున్నారు. అంతే కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా జగన్ ఇంకెంత మాత్రం ఉచిత పథకాలు కొనసాగించలేని పరిస్థితి ఉందనీ, ఇప్పటికే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న జగన్, ఉచితాలు నిలిపివేసి మరింత వ్యతిరేకతను మూటగట్టుకోవడానికి ముందే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న రాజకీయ పరిశీలకుల విశ్లేషణల నేపథ్యంలో పార్టీ క్యాడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేయడం కూడా బాబు పర్యటనలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/babu-district-tours-aganst-jagan-government-atrocities-25-135356.html
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కవితను పోలీసులు పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్.. బీఆర్ఎస్ నేతలు హరీశ్రావు, కేటీఆర్లకు సవాల్ విసిరారు.