టిక్కెట్ ఇవ్వలేదు.. చురకలు వేశారు!

Publish Date:Aug 20, 2022

Advertisement

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు .. సోమలింగం అన్నారుట వెనకటికో. ‘కుర్ర’ మనిషి. ఇప్పుడు, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ టికెట్ తమకు ఖరారై పోయిందని, కొందరు నేతలు చేస్తున్న సందడి,‘సోమ లింగం’ సామెతను గుర్తుకు తెస్తోంది. నిజమే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజాతీర్పును కోరేందుకు, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, యువ నేత లోకేష్ పార్టీని సన్నద్ధం చేస్తున్నారు.  మహా నాడుతో శంఖారావం పూరించిన టీడీపీ అధినేత ధరల పెరుగుదల, చార్జీల మోతకు వ్యతిరేకంగా, ‘బాడుడే బాదుడు’ వంటి కార్యక్రమాలతో  ముందుకు పోతున్నారు. మహానాడు ఉత్సాహాన్ని ముందుంచి పార్టీని పగులు తీయిస్తున్నారు. 
అలాగే, నియోజక వర్గాల వారీగా పార్టీ పరిస్థితి స్వయంగా సమీక్షించేందుకు,ఆయా నియోజక వర్గాల పార్టీ ఇన్ చార్జిలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. కార్యకర్తలు, నేతలతో పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిజానికి పరిపాలన విషయంలో కానీ, రాజకీయంగా అయినా, సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం, చంద్రబాబుకు కొత్త కాదు. నిజానికి, చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం అయినా అందరినీ సంప్రదించిన తర్వాతనే తీసుకుంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే, కొందరు నాయకులు, ముఖ్యంగా నియోజక వర్గ ఇన్ చార్జిలుగా ఉన్నకొందరు   తమకు టికెట్ ఖరారై పోయిందని ప్రచారం చేసుకుంటున్నారు.   
అయితే, ఈ సమావేశాలు ప్రధానంగా నియోజక వర్గంలో  పార్టీ పరిస్థితిని సమీక్షించుకుని, ముందుకు వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలే తప్ప, అభ్యర్ధుల ఎంపిక కోసం చేస్తున్న కసరత్తు కాదని పార్టీ సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి,  ఎన్నికలు ఇంకా రెండేళ్ళ దూరంలో ఉన్న సమయంలో ఏ పార్టీ కూడా ఇప్పుడే అభ్యర్ధులను ఖారారు చేయదు. ముఖ్యంగా  పొత్తుల విషయంలో స్పష్టత రావలసి ఉన్న నేపధ్యంలో, అలాంటి తొందరపాటు నిర్ణయం ఏ పార్టీ నాయకుడు తీసుకోరు. పొత్తుల విషయంలోనే తొందర వద్దని గట్టిగా చెప్పిన  చంద్రబాబు నాయుడు, ఇప్పుడే అభ్యర్ధులను ఎలా ఖారారు చేస్తారని, ప్రశ్నిస్తున్నారు అందులోనూ, ఆచి తూచి అడుగులు వేసే అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడు, అసలే అలాంటి తప్పు చేయరని, పార్టీ వర్గాలు చెపుతున్నాయి. నిజానికి, గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు ఇంత ముందుగా అభ్యర్ధులను ప్రకటించలేదని  ముఖ్య నేతలు గుర్తు చేస్తున్నారు. నిజానికి, ఈ ప్రచారం వెనక కొందరు ఇంటి దొంగల కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో వీస్తున్న టీడీపీ అనుకూల పవనాలను పసిగట్టి కొందరు  ఉద్దేశపూర్వకంగా వాతావరణాన్ని చెడగొట్టేందుకు, అప్పుడే టికెట్ ఖారరై పోయిందనే ప్రచారం సాగిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
నిజానికి ఇప్పడు చంద్రబాబు నాయుడు, పని తనం బాగాలేదని భావించిన నియోజక వర్గ ఇంచార్జిలను హెచ్చరించేందుకే సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారని పార్టీ నేతలు చెపుతున్నారు. అంతే కాదు, మాజీ డిప్యూటీ స్పీకర్,  అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ సహా మరికొందరు ఇన్ చార్జిలకు చంద్రబాబు నాయుడు గట్టిగా  చురకలు వేసినట్లు, పని తీరుపై తలంటు పోసినట్లు తెలుస్తోంది. పార్టీ ప్రకటించిన కార్యక్రమాల అమలులో వెనకబడిన వారిని పేరు పెట్టి మరీ చంద్రబాబు నాయుడు, గట్టిగా హెచ్చరించినట్లు చెపుతున్నారు. 
నిజానికి, మండలి బుద్ధ ప్రసాద్, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడి పోయిన నాటి నుంచి తెలుగు దేశం పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనేది బహిరంగ రహస్యం. చివరకు పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడుకు కూడా అయన హాజరు కాలేదు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి ఊపు తెచ్చిన, బాడుడే బాదుడు కార్యక్రమంలోనూ మండలి బుద్ధ ప్రసాద్  పాల్గొన్న దాఖాలాలు లేవు. అలాగే, పార్టీ సభ్యత్వ కార్యక్రమం, ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి పార్టీ ఆదేశాలను బుద్ధ ప్రసాద్ అంతగా పట్టించుకోలేదని,పార్టీ నాయకులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, “పార్టీ ఆదేశాలను అందరూ పాటించాలి, ముఖ్యంగా పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల విషయంలో ఉపేక్ష వహిస్తే సహించేది లేదు. మీ నియోజక వర్గంలో కార్యక్రమాలు నిర్వహించక పోతే, మీకంటే ఎక్కువగా పార్టీ నష్ట పోతుంది. మీ పని తీరుకు ఇవన్నీ ప్రామాణికంగా ఉంటాయి..మూడు నెలలలో మరోసారి మీతో మాట్లాడతాను, అప్పటికీ ఇదే పరిస్థితి ఉంటే, కఠిన నిర్ణయాలు తప్పవు”  అని చంద్రబాబు నాయుడు మండలి ముఖం మీదనే చెప్పినట్లు తెలుస్తోంది. వాస్తవం ఇలా, ఉంటే మండలి బుద్ధ ప్రసాద్ కు టికెట్ ఖరారైందని ప్రచారం చేసుకోవడం ఏమిటని స్థానిక నాయకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి, స్వతహాగా కాంగ్రెస్ డీఎన్’ఎ నింపుకున్న  మండలి బుద్ధ ప్రసాద్ మరో దారి లేక తెలుగు దేశం పార్టీలో చేరారే కానీ, ఆయన టీడీపీతో ఏ స్థాయిలోనూ మమైకం కాలేదని ఆయన సన్నిహితులే అంటారు. ఆయన, పార్టీలో చేరి ఇంచుమించుగా పదేళ్ళు కావస్తున్నా, ఇంతవరకు పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిసిన, మంచి చెడు పంచుకున్న సందర్భాలు దాదాపుగా లేవని అంటారు. అంతేకాకుండా మరోసారి, ఆయనకు పార్టీ టికెట్ ఇస్తే, టీడీపీ ఇక అవనిగడ్డఫై ఆశలు వదులుకోక తప్పదని  స్థానిక నాయకులు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

By
en-us Political News

  
జగన్ సంక్షేమ పథకాలన్నీ డొల్లే. అందుకు ఉదాహరణగా ఆరోగ్య శ్రీ పథకాన్ని చెప్పుకోవలసి ఉంటుంది. ఆరోగ్య శ్రీ పథకం కింద అర్హులైనవారికి ఉచితంగా చికిత్స పొందే విలువను రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ఏపీ ప్రభుత్వం గత డిసెంబర్ లో నిర్ణయం తీసుకుంది. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా రూ. 25 లక్షల వరకూ చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇస్తున్నట్లు జగన్ ఆర్భాటంగా ప్రకటించారు.
కేదార్ నాథ్ ఆలయం సమగ్ర అభివృద్ధి పథకంలో భాగంగా, ఆలయ సమీపంలో రూపుదిద్దుకోనున్న కేదార్ పరిచయ్ మ్యూజియం నిర్మాణ నిపునిగా డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిని కేంద్ర సాంస్కృతిక శాఖ నియమించింది.
ఎద్దు చేలో పడి మేస్తుంటే, దూడ గట్టున మేస్తుందా? మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు పరిస్థితి కూడా ఇలాగే వుంది. పేర్ని కిట్టు తండ్రి పేర్ని నాని
చేవెళ్ల పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గం నుంచి హేమాహేమీలు త‌ల‌ప‌డుతున్నారు. కాంగ్రెస్ నుంచి ప్ర‌స్తుత ఎంపీ రంజిత్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డి, బీఆరెస్ నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వ‌ర్ ముదిరాజ్‌ బరిలో ఉన్నారు. వీరిలో విశ్వేశ్వ‌ర్ రెడ్డి, జ్ఞానేశ్వ‌ర్ స్థానికులు.
గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో వున్న రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్
భయపడినట్టే జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారులు ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సిన పెన్షన్‌ జగన్ పుణ్యమా అని బ్యాంకులకు
నిందితులంతా ఆర్థికంగా, రాజ‌కీయంగా బాగా శక్తిమంతులని, ఏదో ఒక కారణం చూపుతూ పిటిషన్లు దాఖలు చేసి విచారణ ముందుకు సాగకుండా చేస్తున్నారని సీబీఐ, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ... దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, పార్లమెంటు సభ్యులు, అత్యంత సీనియర్ అఖిల భారత సర్వీసు అధికారులు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, మీడియా హౌస్‌లు, అత్యంత ధనవంతులైన వ్యాపారులున్నారు. నిందితులుగా ఉన్న వ్యక్తులు, కంపెనీలు దేశంలోని అత్యుత్తమ న్యాయవాదులను ఉపయోగించుకుంటూ.. కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ.2.40 కోట్ల నగదును పోలీసులు సీజ్‌ చేశారు. ఈరోజు ఉదయం గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారులోని అంతర్‌ జిల్లాల చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నానికి వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో రూ.2.40 కోట్ల నగదు తరలి వెళుతున్నట్టు పోలీసులు గుర్తించారు.
అనంతపురం జిల్లాలో పామిడి హైవే.. నాలుగు పెద్ద పెద్ద కంటైనర్లు వున్న నాలుగు లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తున్నాయి.
వైఎస్ షర్మిలా రెడ్డి.. రాజకీయాలలో ఆమె ఒక ఫైర్ బ్రాండ్. వైసీపీ అధినేత జగన్ కు స్వయానా సోదరి. వైఎస్ జగన్ విపక్షంలో ఉన్న సమయంలో షర్మిల అన్న కోసం.. అన్న వదిలిన బాణాన్నంటూ రాష్ట్రమంతా చుట్టేశారు. పార్టీ అధినేత అందుబాటులో లేని లోటు పార్టీకి కనబడకుండా చేశారు. అయితే షర్మిల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన జగన్.. సీఎంగా రాష్ట్రపగ్గాలు అందుకున్నాకా.. తనకు అధికార అందలం అందించడం కోసం రాష్ట్రమంతటా కాళ్లరిగేలా తిరిగిన షర్మిలను దూరం పెట్టేశారు.
 ఎన్నికలకు ఇంకా 11 రోజుల వ్యవధి ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అధికారపార్టీ నేతల  అరెస్ట్ సంచలనమైంది. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రతిపక్ష అభ్యర్థులపై వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా జగన్ పై తక్షణం బ్యాన్ విధించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.