బాబు అరెస్టు ఎఫెక్ట్.. జగన్ కు మోడీ, షా నో అప్పాయింట్ మెంట్

Publish Date:Sep 21, 2023

Advertisement

తెలుగుదేశం అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుని జగన్ ప్రభుత్వం అరెస్ట్ చేయడంపై కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు సీరియస్ అయ్యారా? ఆ క్రమంలోనే ఏపీ సీఎం జగన్‌కి మోడీ, అమిత్ షాలు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదా? అంటే అవుననే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్రం  పెద్దలు ఇప్పటి వరకు స్పందించకున్నా.. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ నేతలు మాత్రం  చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించడమే కాకుండా.. జగన్ ప్రభుత్వ వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు.  

మరోవైపు సీఎం జగన్ లండన్ పర్యటనలో ఉండగా.. చంద్రబాబు నాయుడిని సీఐడీ పోలీసులు నంద్యాలలో అరెస్ట్ చేశారు.   సీఎం జగన్... తన విదేశీ పర్యటన పూర్తి చేసుకొని.. స్వదేశానికి వచ్చిన వెంటనే.. అంటే ఆ మరునాడే ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారని.. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీతో, హోం మంత్రి అమిత్ షాతో సీఎం  జగన్ భేటీ కానున్నారని.. ఈ భేటీలో చంద్రబాబు అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది... దాని వెనుక ఉన్న కారణాలు.. ఢిల్లీ పెద్దలకు ఆయన వివరించనున్నారని.. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.   

కానీ జగన్ లండన్ నుంచి తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుకొని దగ్గరదగ్గర పక్షం రోజులు గడుస్తున్నా.. ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లింది   లేదు. ఎందుకు వెళ్లలేదంటే.. సీఎం జగన్‌కు మోడీ, అమిత్ షా ద్వయం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని అంటున్నారు. మరో వైపు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైనాయి.  అలాంటి వేళ.. ప్రదాని, హోం   మంత్రి క్షణం తీరిక లేకుండా ఉన్నారని.. అందుకే జగన్ ఢిల్లీ వెళ్లలేదనీ వైసీపీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. 

మరోవైపు చంద్రబాబు అరెస్ట్‌పై కేంద్రంలోని పెద్దలకు ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు అందాయని.. దీంతో వారు సైలెంట్ అయి.. చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించాలంటూ తెలుగు రాష్ట్రాల్లోని కమలం పార్టీ పెద్దలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయని.. దాంతో ఆయా రాష్ట్రాల్లోని బీజేపీ పెద్దలు చంద్రబాబు అరెస్ట్ అంశంపై స్పందించారనే చర్చ సైతం కొనసాగుతోంది. 

అదీకాక.. చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. సీఎం   జగన్‌కు కేంద్రంలోని పెద్దలు అపాయింట్‌మెంట్ ఇస్తే.. అందుకు సంబంధించి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి బలంగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని.. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ పెద్దలు.. సైలెంట్ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదీకాక ఎన్నికలు సమీపిస్తున్నాయి... ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆచి తూచి స్పందించాలని లేకుంటే అసలుకే మోసం వచ్చే పరిస్థితి ఉందన్న భావనలో   బీజేపీ అధినాయకత్వం ఉందని అంటున్నారు.  

ఇక ఇప్పటికే రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి వెళ్తామంటూ ఏపీ బీజేపీ పెద్దలు క్లియర్ కట్‌గా ప్రకటించారు. కానీ చంద్రబాబు అరెస్ట్‌ కావడం.. ఆయనను రిమాండ్‌లో భాగంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించడం... ఆ క్రమంలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్ ములాఖత్ కావడం.. అనంతరం బయటకు వచ్చిన పవన్ కల్యాణ్‌.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన వెళ్తుందంటూ స్పష్టమైన ప్రకటన చేయడంతో.. బీజేపీ పరిస్థితి డోలాయామానంలో పడినట్లు అయిందని.. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ వ్యూహాం ఎలా ఉండబోతుందనే ఓ చర్చ   పోలిటికల్ సర్కిల్స్ లో హల్ చల్ చేస్తోంది.

By
en-us Political News

  
శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.
ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో కాంగ్రెస్ నిరసన తెలుపుతున్నట్లు ప్రకటించారు
ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన.. 11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.
ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ విచారణలో కీలక అంశాలను రాబట్టినట్లు విశ్వసనీయ సమాచారం. ఆరా మస్తాన్ కు పోలీసులు ఇప్పటికే రెండు సార్లు విచారించారు. తాజాగా సిట్ విచారణలో అధికారులు ఆయన గతంలో ఇచ్చిన వాంగ్మూలాల కన్ఫర్మేషన్ కోసం ప్రశ్నించినట్లు తెలుస్తోంది...
ఈ సమావేశాల్లో ప్రాజెక్టులు, నీటి కేటాయింపులు, రాష్ట్ర విభజన తర్వాత ప్రాజెక్టులపై చేసిన వ్యయం తదితర అంశాలపై అధికార, విపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరిగే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశాలపైనే సభలో విస్తృత చర్చ జరగాలని అన్న సంగతి తెలిసిందే.
కేసీఆర్ పేరు చెప్పుకుని కేటీఆర్ బతుకుతున్నారు అన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేసీఆర్ మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపైనా, కాంగ్రెస్ ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించడం, అందుకు దీటుగా రేవంత్ కూడా ప్రతి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ వేదికగా అధికార, ప్రతిపక్షాల మధ్య వాడీ వేడి చర్చ జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రేవంత్ కేటీఆర్ పై చేసిన విమర్శలు జగన్ కు కూడా వర్తిస్తాయంటూ నెటిజనులు వ్యాఖ్యానిస్తున్నారు. రేవంత్ విమర్శలు అటు కేటీఆర్, ఇటు జగన్ లకు దిమ్మదిరిగేలా చేశాయని అంటున్నారు.
ఐటీ రంగం సాధించబోయే అభివృద్ధిని, సాంకేతికత ఆధారంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఆయన రెండు దశాబ్దాల కిందటే రూపొందించారు. ఆయన విజన్ ఫలితమే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు యువత ఐటీ రంగంలో దూసుకుపోతున్నది. ఆ కారణంగానే చంద్రబాబును దేశం విజనరీ నేతగా గుర్తించింది.
వాజ్ పేయి తొలిసారి ఒక నాన్ కాంగ్రెస్ ప్రధానిగా ఐదేళ్లు కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని నడిపి చరిత్ర సృష్టిస్తే.. పీవీ నాన్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా ఐదేళ్లు మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపి ఏలి రికార్డు సృష్టించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.