శాకాహారులకు దక్కని విటమిన్‌- B12

Publish Date:Jul 21, 2016

Advertisement

‘B విటమిన్’ మన శరీరానికి చాలా అవసరం అన్న విషయంలో ఎవరకీ ఏ సందేహమూ లేదు. ఇందులోనూ ఒకటి కాదు రెండు కాదు 8 రకాల విభాగాలు (B1, B2...) ఉన్నాయనీ, అవన్నీ కూడా శరీరానికి చాలా అవసరం అనీ తెలుసు. కానీ వీటిలో విటమిన్‌ B12 గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోక తప్పదు!

జీవక్రియలకు తప్పనిసరి

ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలోనూ, నాడీ వ్యవస్థ పనితీరులోనూ B12ది చాలా ముఖ్య పాత్ర. ఒక్క మాటలో చెప్పాలంటే మన శరీరంలోని జీవక్రియ సాగడంలో B12ది ఒక ప్రధాన పాత్ర. ఈ విటమిన్‌ కనుక లేకపోతే మన DNA వ్యవస్థ కూడా కుదేలవక తప్పదు. దురదృష్టవశాత్తూ మన శరీరం ఈ విటమిన్‌ను స్వయంగా తయారుచేసుకోలేదు. దాంతో బయట నుంచి వచ్చే ఆహారం మీదే శరీరం ఆధారపడవలసి ఉంటుంది. అక్కడే వస్తుంది అసలు చిక్క!

మాంసాహారంలోనే ఎక్కువ

వృక్షసంబంధమైన ఏ ఆహారంలోనూ ఈ B12 కనిపించదు. కేవలం మాంసాహారంలోనూ, పాలపదార్థాలలోనూ, గుడ్లలోనే ఈ విటమిన్‌ కనిపిస్తుంది. పెద్దవారిలో పాలు తాగే అలవాటు తక్కువ కాబట్టి, సహజంగానే ఈ విటమిన్‌ను తగినంతగా తీసుకునే శాకాహారుల సంఖ్య తక్కువగా కనిపిస్తుంది. తగినన్ని పాలని తీసుకున్నా కూడా ఒకోసారి వాటిని జీర్ణం చేసుకోలేకపోవడం, వాటిలోని విటమిన్‌ను శరీరం శోషించుకోలేకపోవడం వల్ల కూడా అవసరమైనంత మేర B12 లభించకపోవచ్చు.

ఇతరత్రా కారణాలు

VEGAN అనే నియమాన్ని పాటించేవారు కొందరుంటారు. వీరు పాలు, పెరుగులతో సహా జంతువులకు సంబంధించిన ఏ ఉత్పత్తినీ ముట్టుకోరు. వీరిలో ఈ విటమిన్‌ లోపం మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది. ఇక జీర్ణాశయం సరిగా పనిచేయకపోవడం, రక్తహీనత, మద్యపానం, కొన్ని రకాల మందుల దుష్ప్రభావం... ఇవన్నీ కూడా మన శరీరానికి తగినంత B12 లభించకుండా అడ్డుకునే ప్రమాదం ఉంది.

నష్టాలు అపారం

శరీరానికి తగినంత B12 లభించకపోతే అపారమైన నష్టాలు ఏర్పడతాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. వాటిలో కొన్ని నష్టాలు శాశ్వతంగా ఉండిపోయే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు. B12 లోపం వల్ల ఏర్పడే ఇబ్బందులలో కొన్ని...

- ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు.
- అతిగా ఆలోచించడం, ప్రతి విషయానికీ క్రుంగిపోవడం.
- ఆకలి మందగించడం, అరుగుదలలో సమస్యలు.
- రక్తహినత, దాని వల్ల శరీరం పాలిపోయినట్లు కనిపించడం.
- నాడీవ్యవస్థలో ఇబ్బందుల. వాటి వల్ల శరీరం తిమ్మిర్లు ఎక్కినట్లు తోచడం, కండరాలు బలహీనపడిపోవడం.
  పరిష్కారం

మాంసాహారులకి B12 లోపాన్ని అధిగమించడం అంత కష్టమేమీ కాదు. ఎందుకంటే మాంసం, చేపలు వంటి ఆహారంలో ఈ విటమిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎటొచ్చీ శాకాహారుల మాత్రం ఈ విషయంలో కాస్త తరచి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. B12 లోపాన్ని అధిగమించేందుకు సూక్ష్మజీవుల ద్వారా మందులను (supplements) తయారుచేస్తూ ఉంటారు. వైద్యుల సలహా మేరకు ఈ మందులను తీసుకోవడం మంచిది. అయితే పాలు, పాల పదార్థాలను పుష్కలంగా తీసుకుంటే కనుక ఈ సమస్యను చాలావరకూ నివారించవచ్చు. ఏది ఏమైనా మన శరీరానికి తగినంతగా B12 అందుతోందా లేదా? అందకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న విషయమై ఒకసారి వైద్యుని సంప్రదించడం మేలు.

 

- నిర్జర.
 

By
en-us Political News

  
సోంపు నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకుంటే అద్బుతమైన ఆరోగ్యప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. అసలు సోంపు నీటిలో ఉండే శక్తి ఏంటి? దీని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?
ప్రకృతి ప్రసాదించిన అద్బుతమైన ఆహారాలు ఎన్నో ఉన్నాయి. సీజన్ వారిగా లభిస్తూ ఇవి ఆరోగ్యాన్ని ఎంతో గొప్పగా సంరక్షిస్తాయి...
ఆరోగ్యం కోసం,  శరీరానికి కావలసిన ప్రోటీన్,  పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ తింటుంటారు.  వీటిలో వాల్నట్స్ కూడా ముఖ్యమైనవి...
సాయంత్రం అనగానే పనులన్నీ ముగించుకుని హాయిగా ఇంట్లో కూర్చుని కాఫీ, టీ, పాలు.. లాంటి పానీయాలు తాగుతూ ఎంచక్కా  ఏవైనా స్నాక్స్ తినడం గుర్తు వస్తుంది అందరికీ.  అవకాశం దొరకాలే కానీ ప్రతి ఒక్కరూ ఇంట్లో కూర్చుని సాయంత్రం స్నాక్స్ ఎంజాయ్ చేయాలని అనుకుంటారు...
వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు. ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు. అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు.
చాలా మంది ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీరు తాగుతూ ఉంటారు. ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయని నమ్ముతారు. బరువు పెరగకుండా ఉండటానికి,  అజీర్ణం చేయకుండా...
సమతుల, పోషకాహార లిస్ట్ లో చికెన్ ఎప్పుడూ ఉంటుంది. నేటికాలంలో చాలామంది చికెన్ తినడానకి ఇష్టపడతారు. చికెన్ తినడానికే కాదు....
అల్యూమినియం ఫాయిల్ నేటి కాలంలో వంటింట్లో చాలా కీలకంగా మారింది. ధర పరంగా చూసినా, వాడకం పరంగా చూసినా సిల్వర్ ఫాయిల్ చాలా సౌకర్యంగా ఉంటుంది. పైగా ఇది  ఆహారాన్ని ఎక్కువ సేపు వేడిగా ఉంచుతుంది...
ఉప్పు లేని వంట అస్సలు తినలేము. కానీ ఆహారంలో ఉప్పు ఎక్కువ తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం స్థాయిలు పెరిగి రక్తపోటు లేదా బీపి సమస్యను తీసుకొస్తాయి. చాలామంది ఆహారంలో ఉప్పు తక్కువగానే తీసుకుంటారు...
ఆరోగ్యకమైన ఆహారాలలో పల్లీలు కూడా ఒకటి.  పల్లీలు అటు ఆరోగ్యాన్ని ఇస్తూనే ఇటు మంచి స్నాక్స్ గా కూడా ఉంటాయి.  పల్లీలలో మంచి కొవ్వులు..
శరీరం ఆరోగ్యంగా ఉంటే సరిపోదు. మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరం కూడా పూర్తీ ఆరోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది.  అయితే నేటి కాలంలో మానసిక  ఆరోగ్యం చాలా క్లిష్టమైన సమస్యగా మారింది. అధిక శాతం మంది మానసిక ఇబ్బందులు పడుతున్నారు...
రక్తంలో  చక్కెర శాతం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉండటాన్ని చక్కెర వ్యాధి లేదా డయాబెటిస్ అని అంటారు. ప్రపంచ దేశాలలో చక్కెర వ్యాధి బాధితులు భారతదేశంలోనే ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగించే అంశం...
భారతీయులకు టీ అంటే ఒక ఎమోషన్. అయితే టీ తో పాటు స్నాక్స్ కూడా తినడం చాలామంది అలవాటు. టీ పాటు తీసుకునే స్నాక్స్ లో చాలా వరకు బిస్కెట్లు తినేవారు ఎక్కువ.  అయితే పోషకాహార నిపుణులు మాత్రం..
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.