Publish Date:Sep 26, 2022
దేశ రాజకీయాల్లోకి, ముఖ్యంగా కాశ్మీర్ రాజకీయాల్లోకి మరో పార్టీ ఆవిర్భవించింది. చాలాకాలం కాంగ్రెస్ కొమ్ము కాసిన కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ అజాద్ కాంగ్రెస్నుంచి ఇటీవల బయటపడి కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. తమ డెమొక్రటిక్ అజాద్ పార్టీ ఎవరి, ఏ ఇతర పార్టీ ప్రభావానికి అనుగుణంగా ఉండదని అజాద్ ఈ సందర్భంగా ప్రకటించారు.
కాంగ్రెస్ను వీడినప్పటికీ ఆయన స్వంతగా పార్టీ నెలకొల్పుతారని ఊరిస్తూ వచ్చారు. కాశ్మీర్లో తన అభి మానులు, మద్దతుదారులతో చర్చలు జరిపిన తర్వాత ఇప్పటికి స్వంత పార్టీ ఏర్పాటు చేశారు. సోమ వారం మీడియా సమావేశంలో తన పార్టీ పేరు ప్రకటించారు. తమ పార్టీ ఎవరి భావజాలానికి లొంగి పని చేయదని, స్వతంత్రంగా వ్యవహరిస్తుందన్నారు. పార్టీజెండాను కూడా ఆయన ఆవిష్కరించారు. జండా కి నిలువుగా నీలం, తెలుపు, పసుపు రంగులు ఉన్నాయి.
కాశ్మీర్కు ప్రత్యేక రాష్ట్ర హోదా సాధించడమే తమ పార్టీ లక్ష్యంగా అజాద్ ప్రకటించారు. పార్టీ పెడతా నని అంటున్నారే గాని దాని పేరు, జండాల గురించి కాశ్మీరీలు, ఇతర పార్టీలవారూ గత నెల రోజులుగా ఎదురు చూశారు. సోమవారం పార్టీ పేరు, జండా కూడా ఆవిష్కరించడంతో పాటు తమ పార్టీ లక్ష్యాన్ని ప్రజల సం క్షేమాన్ని దృష్టిలోపెట్టుకుని పార్టీ కార్యకలాపాలు ఉంటాయని అజాద్ అన్నారు. కాంగ్రెస్తో యాభ య్యేళ్ల అనుబంధాన్ని వదులుకొని బయటపడగానే భారీ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ పార్టీ పేరు, జండా కూడా ప్రజల ఆకాంక్షకు అనుగుణంగానే ఉంటుందని, వారే నిర్ణయిస్తారని అన్నారు.
పార్టీ తప్పకుండా కాశ్మీరీ ల నిరుద్యోగ సమస్య పరిష్కారంపై దృష్టి పెడుతుందని హామీ యిచ్చారు. త్వరలో రాష్ట్ర ఎన్నికలు ఉన్న కారణంగా తమపార్టీ కార్యాలయం ఇక్కడే ఏర్పాటు చేయనున్నట్టు తెలి పారు. కాంగ్రెస్తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, పార్టీలో ఇపుడు పరిస్థితులు ఎంతో మారి పోయాయని అన్నారు. రాహుల్ పార్టీ బాధ్యతలు మోసేంత శక్తిమంతుడు కాదని అన్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/azads-new-partydemocratic-azad-party-39-144432.html
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది.
మీరేదో పనిలో వుంటారు.. లేదా ట్రావెల్ చేస్తూ వుంటారు... లేదా కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతూ వుంటారు.
కోవిషీల్డ్ తో గుండె జబ్బులు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని ఆస్ట్రాజెనికా అంగీకరించిన రెండు రోజుల వ్యవధిలోనే కోవిన్ సర్టిఫికేట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో అదృశ్యమైంది. వ్యాక్సిన్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోన్న ఈ సమయంలో ఆ సర్టిఫికెట్లపై ప్రధాని ఫోటో మాయమవ్వడం అనేక అనుమానాలకు కారణం అవుతోంది.
police filed murder attempt case on perni kittu, perin kittu, murder attempt case, ap politics
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలలో అందరి దృష్టీ విశేషంగా ఆకర్షిస్తున్న స్థానం ఏదైనా ఉందీ అంటే అది ఖమ్మం లోక్ సభ నియోజకవర్గం మాత్రమే. అధికార కాంగ్రెస్ పార్టీకి ఈ నియోజకవర్గంలో విజయం నల్లేరు మీద బండి నడకే అని మొదటి నుంచీ అంతా భావిస్తూ ఉన్నారు. అయితే అభ్యర్థి ఎంపికలో జరిగిన జాప్యం కారణంగా చేజేతులా కాంగ్రెస్ ఖమ్మంలో అవకాశాలను చే జార్చుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్ సాధించే స్కోరు జీరో అనే విషయంలో అందరికీ క్లారిటీ వుంది. బీఆర్ఎస్ నాయకులకు
బిఆర్ఎస్ ఎంఎల్సి దండె విఠల్ ఎన్నిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం నుంచి బిఆర్ఎస్ అభ్యర్థిగా 2022లో దండె విఠల్ ఎన్నికయ్యారు.
ఏపీలో బీజేపీ రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తోందా? పేరుకు పొత్తు తెలుగుదేశం, జనసేనతో.. మద్దతు మాత్రం అధికార వైసీపీకే అన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా దేశంలో ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయ్యింది. రెండు దశల పోలింగ్ సరళిని పరిశీలించిన రాజకీయ నిపుణులు ఉత్తరాదిలో, ఈశాన్య రాష్ట్రాలలో బీజేపీ భారీగా నష్టపోవడం ఖాయమని గంటాపథంగా చెబుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత వచ్చిన లోకసభ ఎన్నికలు ఆ పార్టీకి సవాల్ గా మారాయి. మరో పదిరోజుల్లో లోకసభ ఎన్నికలు తెలంగాణలో జరుగనున్నాయి
తుని రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు కోసం....ఇటు టీడీపీ, అటు వైసీపీకి రెండు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అయితే కలిసొచ్చేదెవరికి, అని చూస్తే, ఇక్కడ సామాజిక సమకరణాలు కీలకంగా మారాయి. టీడీపీ, జనసేన పొత్తతో లెక్కలు మారిపోయాయి. నువ్వా నేనా అన్నట్లుగా హోరా హోరీగా పోటీ అయితే కొనసాగుతోంది