Publish Date:Jun 25, 2022
తెలుగుదేశం సీనియర్ నాయకుడు మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ విధానాలను విమర్శించడంలోనూ, జగన్, విజయసాయి దుర్మార్గాలను ఎండగట్టడంలోనూ అందరి కంటే ముందు వరుసలో నిలుస్తారన్న సంగతి తెలిసిందే.
ఆ కారణంగానే అధికార పార్టీ ఎప్పుడు అవకాశం దొరికినా అయ్యన్న పాత్రుడిపై విమర్శల దాడులకు రెడీగా ఉంటారు. ప్రభుత్వమైతే ఏదో విధంగా ఆయనను ఇరుకున పెట్టి కటకటాల వెనక్కు పంపించే యత్నాలను, మానసిక స్థైర్యం దెబ్బతీయడానికి ఆస్తులపై అధికారులతో దాడులను చేయిస్తుంటుంది. సందట్లో సడేమియా అన్నట్లుగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్లర్ వేదికగా అనుచిత పదజాలంతో అయ్యన్న పాత్రుడిని రెచ్చగొట్టే యత్నాలు చేస్తూనే ఉంటారు. పులి, పిల్లి అంటే విజయసాయి తాజాగా చేసిన ట్వీట్ కు అయ్యన్న పాత్రుడు అదే స్టైల్ లో అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..
వైసీపీ ఎంపి విజయసాయిరెడ్డి.. తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి మధ్య ట్విట్టర్ వేదికగా వార్ కొనసాగుతోంది. విజయసాయిరెడ్డి ఈ ఉదయం ట్విట్టర్ లో పెట్టిన పోస్టుపై అయ్యన్నపాత్రుడు ఆయనకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. 16 నెలలు చిప్పకూడు తినడం వలన చర్మం మందమైంది. తోటి ఖైదీలు, ఖాకీల చేతిలో తిన్న దెబ్బల వలన ఏర్పడ్డ చారలు చూసుకొని విజయసాయి రెడ్డి పులిగా ఫీల్ అవుతున్నాడు. బెయిల్ కోసం ప్రత్యేక హోదా తాకట్టు పెట్టడానికి ఢిల్లీ వెళ్లిన నువ్వు నన్ను అజ్ఞాతంలో ఉన్నావనడం విడ్డూరంగా ఉంది. అంత గొప్పగా ఉంది నీ ప్రభుత్వ సమాచార వ్యవస్థ. నేను నర్సీపట్నంలోనే ఉన్నా. ముహూర్తం ఎందుకు నువ్వు ఎప్పుడొచ్చినా నేను రెడీ. అన్నట్లు పులి అయితే పోలీసుల్ని వేసుకొని రాదుగా సింగిల్ గా రావాలి. అప్పుడు తేలిపోద్ది ఎవడు పులో ఎవడు పిల్లో!’ అంటూ అయ్యన్న పాత్రుడు ట్విట్టర్ వేదికగా ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.
అంతకు ముందు.. ‘పిల్లి తనను ఎవరు వేటాడతారా అని ఎప్పుడూ భయపడుతూనే ఉంటుంది. కానీ పులి కన్నా గొప్పదాన్నని తనకు తానే అనుకుంటుంది. నేను నర్సీపట్నం వస్తా. డేట్, టైం చెప్పు తాగుబోతు. అయినా నువ్వు అజ్ఞాతంలోకి పోయావట కదా! పారిపోకుండా నిలబడు గంజాయి’ అంటూ అయ్యన్న పాత్రుడిపై ట్విట్టర్ ఖాతాలో విజయసాయి వ్యాఖ్యలు పోస్టు చేశారు. దీంతో ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరినట్లయింది. అర్థరాత్రి అధికారులు మందీ మార్బలంతో నివాసాలు కూల్చడానికి రావడం వెనుక ఉన్న మర్మమేమిటో వీరిరువురి ట్వీట్ వార్ తో జనానికి దాదాపుగా అర్ధమైపోయింది. కోర్టు కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోనే ఎవరు రుజువర్తనతో ఉన్నారు, ఎవరు అవకాశవాదంతో ముందు వెనుకలాడుతున్నారన్నదీ తేటతెల్లమైపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ayanna-reply-vijayasai-tweet-in-fit-manner-39-138400.html
రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది. సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్ట్గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది. ఈ నేపథ్యంలో తాను కేవలం మంత్రి పదవిని మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది