అవినాష్ చివరి ఆశ

Publish Date:May 22, 2023

Advertisement

అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న సామెతను గుర్తు చేస్తున్నారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. గత నాలుగు నెలలుగా  సీబీఐని ముప్పుతిప్పలు పెడుతూ.. తన ఇష్టం వచ్చినప్పుడు విచారించాలని హుకుం జారీ చేస్తూ వచ్చిన అవినాష్ రెడ్డి ఇప్పుడు దారులన్నీ ముగిసిపోయి బంతి సీబీఐ కోర్టులో ఉండటంతో కాళ్ల బేరానికి వచ్చారు.

చివరి ఆశగా ముందస్తు బెయిలు కోసం సుప్రీం వెకేషన్ బెంచ్ లో వేసిన పిటిషన్ ను విచారించడానికి సర్వోన్నత న్యాయ స్థానం నిరాకరించింది. అవినాష్ ను కాపాడేందుకు కర్నూలు పోలీసులు శాంతి భద్రతల సాకు చూపితే సీబీఐ కేంద్ర బలగాలను రప్పించింది. దీంతో ఇక సీబీఐని అడ్డుకోవడం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చిన అవినాష్ రెడ్డి కేంద్ర దర్యాప్తు సంస్థతో కాళ్ల బేరానికి వచ్చారు.

కనీసం ఈ నెల 27 వరకూ తనకు గడువు ఇవ్వాలనీ, ఆ తరువాత విచారణకు హాజరౌతాననీ పేర్కొంటూ తాజాగా మరో లేఖ రాశారు. ఆ లేఖలో తన తల్లి అనారోగ్యం గురించి ప్రస్తావించారు. తన తల్లి కోలుకోగానే విచారణకు రెక్కలు కట్టుకుని మరీ హాజరౌతానని పేర్కొన్నారు.

అయితే అవినాష్ తాజా లేఖపై సీబీఐ నుంచి ఇంత వరకూ స్పందన రాలేదు. మరో వైపు హైదరాబాద్ నుంచి బయలు దేరిన కేంద్ర బలగాలు కర్నూలు చేరుకున్నాయి. సీబీఐ అధికారులు ఆదేశించగానే విశ్వభారతి ఆస్పత్రికి చేరడానికి సర్వ సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అవినాష్ లేఖపై సీబీఐ ఏ విధంగా స్పందిస్తుందన్న ఆసక్తి నెలకొంది.

మరో వైపు పరిశీలకులు మాత్రం అవినాష్ తాజా లేఖలో 27 వరకూ గడువు కోరడానికీ.. జగన్ హస్తిన పర్యటనకూ లింకు ఉందని విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా అవినాష్ లేఖను సీబీఐ పరిగణనలోనికి తీసుకుంటుందా? లేదా అన్నది మరి కొద్ది సేపటిలో తేలిపోనుంది. దారులన్నీ మూసుకుపోక ముందు వరకూ సీబీఐపై కనీస మర్యాద చూపని అవినాష్ ఇప్పడు బేలగా రాసిన లేఖకు సీబీఐ సానుకూలంగా స్పందించే అవకాశాలూ దాదాపు మృగ్యమనే పరిశీలకులు అంటున్నారు.

అన్నిటికీ మించి స్థానిక పోలీసులు సీబీఐ అధికారులకు సహకరించకపోవడం, సీబీఐని వాహనాలు కానీ, అధికారులు కానీ ఆస్పత్రిలోకి అడుగుపెట్టే అవకాశం లేకుండా ఆస్పత్రి ప్రధాన ద్వారం వద్ద అవినాష్ అనుచరులు, వైసీపీ కార్యకర్తలు బైఠాయించడం.. దీంతో గంటల తరబడి దర్యాప్తు సంస్థ అధికారులు కర్నూలులో నిస్సహాయంగా నిలబడిపోయే పరిస్థితి ఏర్పడటం ఇవన్నీ సీబీఐ ప్రతిష్టను దారుణంగా దెబ్బ తీసిన నేపథ్యంలో ఇంత వరకూ వచ్చాకా ఇక వెనకడుగు వేయవద్దని కేంద్ర దర్యాప్తు సంస్థ హెడ్ క్వార్టర్స్ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని చెబుతున్న నేపథ్యంలో సీబీఐ అవినాష్ తాజా లేఖపై సానుకూలంగా స్పందించే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, క్షేత్రస్థాయిలో పాలనా పరమైన విధానాలు మరియు లబ్ధిదారుల శైలి మారలేదనే తీవ్ర అసంతృప్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
దేశ రాజకీయాల్లో తెరవెనుక జరుగుతున్న పరిణామాలు ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి.
దిల్లీలో నీట్ పరీక్షల లీకేజీకి సంబంధించి పక్కా ఆధారాలు బయటపడటంతో అక్కడ కేంద్ర ప్రభుత్వంపై యువత తిరగబడింది. కానీ ఏపీలో మెగా డీఎస్సీ పారదర్శకంగా ముగిసి, నియామక పత్రాలు కూడా అభ్యర్థులకు అందజేశారు. ఏపీ విద్యాశాఖ కూడా విపక్షాలు చేసిన ప్రతి ఆరోపణకూ రికార్డులతో సహా పక్కాగా వివరణ ఇచ్చింది.
కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 14 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ అనే పేరు తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉందనీ, ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు బీఆర్ఎస్‌ను టీఆర్ఎస్‌గానే గుర్తిస్తున్నారని పేర్కొంటూ ఆ పేరును ఇతరులకు కేటాయించవద్దని ఈసీఐకి అధికారిక ఫిర్యాదు చేసింది.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తరువాత టీఎంసీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. మమతా బెనర్జీని ధిక్కరిస్తూ ఒక్కరొక్కరుగా కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.
దేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసిన మోడీ.. ఇప్పడు పాలనలో రికార్డు అంటూ సంబరాలు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. మోడీ పాలనా మైలురాయి కేవలం స్వయం ప్రకటిత అంశం మాత్రమేనన్నారు.
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.