Publish Date:May 19, 2023
వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వివేకానందరెడ్డి సీబీఐ విచారణకు మళ్లీ డుమ్మా కొట్టారు. ఈ సారి తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ సీబీఐ విచారణకు హాజరు కాలేదు. విచారణకు హాజరు కవాల్సిన సమయంలో ఆయన హైదరాబాద్ నుంచి పులివెందుల బయలుదేరి వెళ్లారు. అంతకు మందు ఈ రోజు సీబీఐ అవినాష్ ను అరెస్టు చేయడం ఖాయమన్న వార్తల నేపథ్యంలో అటు సీబీఐ కార్యాలయం వద్ద, ఇటు హైదరాబాద్ లోని అవినాష్ ఇంటి వద్ద కూడా హై డ్రామా నడిచింది. సీబీఐ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించగా, అవినాష్ నివాసం వద్దకు ఆయన అనుచరులు భారీ సంఖ్యలో చేరుకున్నారు.
సీబీఐ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో అవినాష్ అరెస్టు ఖాయమనీ అందుకే భద్రత కట్టుదిట్టం చేశారనీ అంతా భావించారు. మరో వైపు అవినాష్ నివాసం వద్ద ఆయన అనుచరులు పెద్ద ఎత్తున మోహరించారు. నివాసంలో అవినాష్ న్యాయనిపుణులతో చర్చించి తల్లి అనారోగ్యం కారణంగా విచారణకు హాజరు కాలేనన్న సమాచారాన్ని తన న్యాయవాది ద్వారా సీబీఐకి పంపించారని సమాచారం. కాగా అవినాష్ హైదరాబాద్ నుంచి పులివెందులకు బయలు దేరుతున్న సమయంలో ఆయన అనుచరులు అక్కడ ఉన్న మీడియా ప్రతినిథులపై దాడికి పాల్పడ్డారు.
కాగా ఈ నెల 16న కూడా సీబీఐ విచారణకు హాజరు కాకుండా తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉందని సమాచారం ఇచ్చారు. దీంతో సీబీఐ శుక్రవారం (మే 19)న విచారణకు రావాల్సిందిగా మరో నోటీసు ఇచ్చింది. వాట్సాప్ ద్వారా నోటీసు ఇవ్వడమే కాకుండా అదే నోటీసును పులివెందులలోని ఆయన నివాసంలో డ్రైవర్ కు అందజేసింది.
దీంతో అవినాష్ ఏదో సాకు చెప్పి విచారణకు రాకుండా తప్పించుకోవడాన్ని సీబీఐ సీరియస్ గా తీసుకుందని అందరూ భావించారు. దాంతో 19న అవినాష్ అరెస్టు ఖాయమన్న భావన సర్వత్రా వ్యక్తం అయ్యింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా తన తల్లి అనారోగ్యం కారణం చెప్పి అవినాష్ సీబీఐ విచారణకు డుమ్మా కొట్టడంతో ఇప్పుడు సీబీఐ ఏం చేస్తుందన్న ఆసక్తి, ఉత్కంఠ సర్వత్రా వ్యక్తం అవుతోంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/avinash-skip-cbi-inquiry-39-155576.html
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.
ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస యాదవ్ కలసి కాంగ్రెస్ 1000 రోజుల విఫల పాలనపై చార్జ్షీట్ విడుదల చేశారు.
మ్మెల్యేగా కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు, అసెంబ్లీకి ఆయన గైర్హాజరుపై రేవంత్ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. అసెంబ్లీకి హాజరుకాకుంటే కేసీఆర్ ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఒక ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపు నిచ్చారు. తనను ఎన్నుకున్న నియోజకవర్గ సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు.
ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే.. మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి సొంత నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.
ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
భారత రాజకీయాల్లో ఇప్పుడు పార్లమెంట్ సీట్ల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ బిల్లుల చుట్టూ తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
వైసిపి సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి.. రాజ్యసభ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చొక్కా పట్టుకుని దాడి చేసి కొట్టారని.. ఇదే విషయాన్ని ఇటీవల విజయసాయి ఓ బహిరంగ లేఖ ద్వారా వెల్లడించిన విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు.
ఇండియా కూటమి తరఫున రాహుల్ గాంధీనే ప్రధానమంత్రి అభ్యర్థి అని కుండబద్దలు కొట్టారు. ఆ విషయాన్నే తమిళనాడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకురాలు తారాహై కత్బర్ట్ మరింత క్లారిటీ ఇస్తూ.. విజయ్ ప్రధాని అవుతారంటూ కొందరు ప్రచారం చేయడం కేవలం టీవీకే శ్రేణుల ఉత్సాహం వల్ల జరుగుతున్న ప్రచారమే తప్ప, అది ఆ పార్టీ అధికారిక వైఖరి కాదన్నారు.