Publish Date:May 25, 2023
ఏదీ ఏమైనా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అదృష్టవంతుడే అంటూ సామాజిక మాధ్యమంలో ఓ రేంజ్ లో ట్రోల్ అవుతోంది. అవినాష్ రెడ్డి జైల్లో ఉంటే తన తండ్రి భాస్కరరెడ్డితో ఉంటాడని... అదే జైలు బయట ఉంటే తన తల్లి శ్రీలక్ష్మీతో ఉంటాడని.. అయినా ఎక్కడ ఉన్నామా? అన్నది ముఖ్యం కాదని.. తల్లిదండ్రులతో ఉన్నామా? లేదా? అన్నదే ముఖ్యమంటూ నెటిజన్లు.. పోకిరి సినిమాలో బాగా బాపులర్ అయిన డైలాగ్.. ఎప్పుడు వచ్చామన్నది కాదన్నయ్యా.. బుల్లెట్ దిగిందా? లేదా? తరహాలో కామెంట్ చేస్తున్నారు.
అవినాష్ అరెస్ట్ చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కర్నూలులోని విశ్వభారతీ ఆసుపత్రి చుట్టూ కాలు కాలిన పిల్లిలా చక్కర్లు కొడుతూ, కర్నూలు జిల్లా ఎస్పీతో భేటీ అయి.. అవినాష్ రెడ్డి లొంగిపోవాలని చెప్పాలంటూ ఆ దర్యాప్తు సంస్థ అధికారులు బాబ్బాబు అంటూ బతిమాలడం చూస్తుంటే.. అవినాష్ రెడ్డి అదృష్టవంతుడు అని పక్కాగా కన్ఫర్మ్ అవుతోందని నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంతేకాదు సీబీఐ దూకుడుకు కళ్లెం వెయ్యగల మోనగాళ్లు ఈ దేశంలో ఎక్కడైనా ఉన్నారంటే.. అది కేవలం ఆంధ్రప్రదేశ్లోని అధికార పార్టీ శ్రేణులే అన్నది సుస్పష్టమని తాజా పరిణామాల నేపథ్యంలో అర్థమవుతోందని వారు అంటున్నారు.
ఇక జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్లో కోడికత్తి దాడి జరిగితే.. తనకు ఆంధ్రప్రదేశ్ పోలీసులపై నమ్మకం లేదంటూ... పక్క రాష్ట్రం తెలంగాణలోని హైదరాబాద్కు ఆగమేఘాల మీద వచ్చేశారని.. అలాంటి వ్యక్తి నేడు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా.. సదరు పోలీసులు ఆయన నమ్మకం కోసం శాయ శక్తులా శక్తివంచన లేకుండా కష్టపడి పని చేసుకొంటూ.. ఫ్యాన్ పార్టీ రెక్కలే కాదు.. వైసీపీకి కళ్లు, చెవులు అన్నీ అయిన.. జగన్ పార్టీ శ్రేణులపై ఈగ కూడా వాలనివ్వకుండా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అలాంటిది ఆంధ్రుల తొలి రాజధాని.. నేడో రేపో న్యాయ రాజధానిగా రూపుదిద్దుకొనున్న కర్నూలు నగరంలో.. అదీ విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తల్లిని జాగ్రత్తగా కాపాడుతోన్న అవినాష్ రెడ్డిపై సీబీఐ నీడ కాదు కదా.. ఈగ సైతం వాలకుండా పార్టీ కేడర్ కంటికి రెప్పలా కాపాడుకుంటుంటే.. ఆ క్యాడర్ కు పోలీసులు రక్షణ కవచంగా నిలిచారని సెటైర్లు వేస్తున్నారు.
మరోవైపు వైయస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ గతంలో అరెస్ట్ చేసి.. చంచల్గూడ జైలుకు తరలించిందని.. ఇదే కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు సీబీఐ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నా.. అవినాష్ రెడ్డి మాత్రం.. ముందస్తు ప్రణాళికలతో సీబీఐకి చిక్కకుండా తిరుగుతున్నారని అంటున్నారు.
అయినా ప్రజల పన్నుల రూపంలో చెల్లించిన సొమ్మును జీతాలుగా తీసుకునే ఈ పోలీసులు.. ఇలా విశ్వభారతీ ఆసుపత్రికీ, అందులో ఉన్న అధికార పార్టీ ఎంపీ ప్లస్ ముఖ్యమంత్రి కజిన్ అవినాష్ రెడ్డికి, ఆయన తల్లితోపాటు ఆసుపత్రి వద్ద ఉన్న పార్టీ కేడర్కు రక్షణగా ఇలా చెమటోడ్చి.. కష్ట పడడం చూస్తుంటే.. అనినాష్ రెడ్డి నిజంగా అదృష్టవంతుడేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/avinash-reddy-lucky-fellow-39-155851.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.