Publish Date:May 22, 2023
సీబీఐ తనను అరెస్టు చేయకుండా ఆదేశించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నారు. వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ న మెన్షన్ చేయనున్నారు. గతంలోనే హైకోర్టు వెకేషన్ బెంచ్ తన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే.
అయితే ఆ పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు తేదీ ఖరారు చేయలేదు. జూన్ రెండో వారంలో విచారణకు అనుమతిస్తామని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అయితే సోమవారం (మే22) సీబీఐ అవినాష్ ను దాదాపుగా చుట్టుముట్టి అరెస్టు చేయడానికి సిద్ధం అయిన నేపథ్యంలో అవినాష్ మరో సారి సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్ మెన్షన్ చేయాలని నిర్ణయించుకున్నారు. హై కోర్టు వెకేషన్ బెంచ్ ముందు తన బెయిలు పిటిషన్ దాఖలు చేసేంత వరకూ తనను అరెస్టు చేయవద్దని సుప్రీంను అవినాష్ అభ్యర్థించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
అరెస్టు అనివార్యం అని తేలిపోయినా, సుప్రీం కోర్టు పదే పదే సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని చెబుతున్నా అవినాష్ ఎందుకు పరుగులు తీస్తున్నారు. మళ్లీ మళ్లీ కోర్టు మెట్లెక్కుతున్నారు? అన్న ప్రశ్నకు ఆయన ఆశలన్నీ ఈ నెల 26న ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన మీదే ఉన్నాయని అంటున్నారు.
జగన్ హస్తన వెళ్లే వరకూ తన అరెస్టును నిలువరించుకోగలిగితే అక్కడ ఆయన ఎలాగోలా చక్రం తిప్పి సీబీఐ అరెస్టు నుంచి తనను కాపాడగలరని అవినాష్ హోప్ ఫుల్ గా ఉన్నారని పరిశీలకులు అంటున్నారు. గతంలో అవినాష్ అరెస్టునకు సీబీఐ రంగం చేసిన సందర్భంలో జగర్ హస్తిన వెళ్లి రాగానే అరెస్టు విషయం వెనక్కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. మరో సారి అటువంటిదే ఏదో ఒకటి జగన్ చేయగలర్న నమ్మకంతోనే ఎలగైనా ఈ నెల 26 వరకూ సీబీఐకి చిక్కకుండా తప్పించుకోవాలని అవినాష్ ప్రయత్నాలు చేస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అయితే ఇంత వరకూ వచ్చిన తరువాత సీబీఐ కూడా అవినాష్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుందనీ, అందుకే ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం స్వయంగా అవినాష్ వ్యవహారాన్ని పరిశీలిస్తూ, పర్యవేక్షిస్తోందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంలో అవినాష్ పిటిషన్ వేస్తే దానిని సీబీఐ కూడా గట్టిగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/avinash-pition-in-supreme-25-155718.html
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.