ఓ వైపు బిగింపు..మరో వైపు సడలింపు.. అవినాష్ విషయంలో సీబీఐ విచిత్రాలు

Publish Date:Jun 8, 2023

Advertisement

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ తొలిసారిగా నిందితుడిగా పేర్కొంది. ఈ కేసులో ఆయన ను ఎ8 గా చేర్చింది. భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్ పై గురువారం (జూన్8) సీబీఐ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో సీబీఐ అవినాష్ ను నిందితుడిగా, ఎ8గా పేర్కొంది. అదే సమయంలో అవినాస్ విషయంలో మరో బ్రహ్మాండమైన ట్విస్ట్ వెలుగులోనికి వచ్చింది.  సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం, బెయిలుపై విడుదల చేయడం అన్నీ జరిగిపోయాయని బయటకు వచ్చింది.  

అయితే ఈ విషయాన్ని అటు అవినాష్ రెడ్డి.. ఇటు సీబీఐ కూడా అత్యంత గోప్యంగా ఉంచారు.  తెలంగాణ హైకోర్టులో అవినాష్ కు ముందస్తు బెయిలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ బెయిలు సందర్భంగానే కోర్టు సీబీఐ  అవినాష్ ను అరెస్టు చేసి విచారించాలనుకుంటే అరెస్టు చేసి వెంటనే ఐదు లక్షల పూచీకత్తుతో విడుదల చేయాలన్న షరతు విధించిన సంగతి విదితమే.   ఆ ప్రకారమే కోర్టు ఆదేశాల మేరకు  విచారణకు హాజరైన అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి వెంటనే ఐదు లక్షల పూచికత్తు తీసుకుని విడుదల  చేసింది. ఇదేంటి కోర్టుకు ఇవ్వాల్సిన పూచీకత్తును అవినాష్ సీబీఐకి ఇవ్వడమేంటి? సీబీఐ వాటిని అంగీకరించి విడుదల చేయడమేమిటి? అన్న అనుమానాలు వస్తే అది అమాయకత్వమే. ఎందుకంటే సీబీఐ అవినాష్ విషయంలో గతంలో ఎన్నడూ ఎవరి విషయంలోనూ చూపనంత ఉదారత చూపుతోంది.

ఒక వైపు కోర్టుల్లో అవినాష్ వివేకా హత్య కేసులో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంటూనే.. అరెస్టు విషయంలో మాత్రం పెద్దగా ఆసక్తి చూపడంలేదు.  అవినాష్ అరెస్టు బెయిలుపై విడుదల వ్యవహారం ఎంత రహస్యంగా ఉంచారంటే.. ఈ కేసులో సీబీఐ కంటే చురుకుగా, చొరవగా తండ్రి హంతకులకు శిక్ష పడాలంటూ.. కోర్టుల చుట్టూ తిరుగుతూ.. కేసు ఇంత వరకూ రావడానికి కారణమైన వివేకా కుమార్తె సునీతకు కూడా తెలియలేదు. అందుకే ఆమె అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వ్యులను సవాల్ చేస్తూ సుప్రీం ను ఆశ్రయించారు. ఆమె పిటిషన్ శుక్రవారం (జూన్ 9) సర్వోన్నత న్యాయస్థానం ఎదుటకు వచ్చే అవకాశం ఉంది.  ఇప్పుడు అవినాష్ ను సీబీఐ అల్ రెడీ అరెస్టు చేసి బెయిపుపై విడుదల చేసిన నేపథ్యంలో సుప్రీం కోర్టులో ముందస్తు బెయిలుపై కాకుండా బెయిలును రద్దు చేయాలన్న అంశంపై విచారణ జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

మరో వైపు అవినాష్ ను ఉపయోగం లేని అరెస్టు చేసి బెయిలిచ్చి విడుదల చేసిన సీబీఐ, ఇదే వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కరరెడ్డి దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ ను సీబీఐ కోర్టులో గట్టిగా వ్యతిరేకించింది.  ఆ సందర్భంగా కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో అవినాష్ రెడ్డిని ఎ8గా పేర్కొంది. మరో సారి ఏపీ సీఎం జగన్ పేరునూ ప్రస్తావించింది. తొలి సారిగా అవినాష్ రెడ్డిని నిందితుడిగా చేర్చింది.  

హత్యకు కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో తండ్రీ కొడుకులు భాస్కరరెడ్డి, అవినాష్ రెడ్డీ చాలా కీలకంగా వ్యవహరించారని, కేసు వద్దని.. వివేకా మృతదేహానికి పోస్టుమార్టం అవసరంల ేదనీ సీఐ శంకరయ్యకు అవినాష్ గట్టిగా చెప్పారని సీబీఐ ఆ అఫిడవిట్ లో పేర్కొంది. సీబీఐకి ఏం చెప్పొదని దస్తగిరిని బెదరించడంలోనూ, ప్రలోభపెట్టడంలోనూ అవినాష్ పాత్రే కీలకమని స్పష్టం చేసింది.  వివేకా హత్య కేసులో భారీ కుట్రపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్న సీబీఐ భాస్కర్ రెడ్డికి బెయిలు ఇవ్వొద్దంటూ సీబీఐ కోర్టులో గట్టిగా వాదించింది.  భాస్కరరెడ్డి బెయిలు పిటిషన్ పై సీబీఐ కోర్టు శుక్రవారం (జూన్ 9) తీర్పు వెలువరించనుంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా?  ప్రభుత్వాన్ని రద్దు చేసే ఆలోచనలో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ వున్నారా?  అందుకే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారా? అయితే ముంద‌స్తుకు ప్ర‌ధాని గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తారా?  సోషల్ మీడియాలో బాగానే ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై చ‌ర్చ అయితే జ‌రుగుతోంది. 
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్రంలోని బీజేపీ పెద్దలతో ఉన్న అనుబంధం ప్రత్యేక మైనది. ఏపీ ముఖ్యమంత్రిగా గత నాలుగేళ్ల పైచిలుకు పాలనలో జగన్ రెడ్డి అరాచకాలకు, అడ్డగోలు అప్పులకు కేంద్రం పెద్దలు వెన్నుదన్నుగా నిలిచారన్న భావన ఏపీలో గట్టిగా వ్యక్తం అవుతోంది.
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో నేడు 20 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. ఈ జాబితాలో బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఉన్నారు. ప్రవీణ్ కుమార్ సిర్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. పలు కసరత్తుల అనంతరం మిగతా స్థానాలకు కూడా విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించనున్నారు. తెలంగాణలో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం తెలిసిందే. 
ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై తీవ్రాతి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్డీయే కూటమిలో చేరేందుకు ఆయన తహతహలాడారనీ, తన కుమారుడు కల్వకుంట్ల తారకరామారావును తెలంగాణ ముఖ్యమంత్రిని చేద్దామనుకుంటున్నాననీ ఆశీర్వదించాలనీ తనను కోరారనీ మోడీ బహిరంగ సభలో వెల్లడించారు.
ఖలిస్థాన్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ పాత్ర ఉందంటూ బహిరంగ వివాదానికి ఆజ్యం పోసిన కెనడా .. తదనంతర పరిణామాల్లో భారత్ తీసుకుంటున్న చర్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. భారత్ లో పనిచేస్తున్న 41 మంది దౌత్య సిబ్బందిని అక్టోబర్ 10లోపు ఉపసంహరించుకోవాలని కెనడాను భారత్ కోరడం తెలిసిందే. ఈ చర్యలను ఊహించని కెనడా, ఇప్పుడు ప్రైవేటు చర్చలను కోరుకుంటున్నట్టు ప్రకటించింది. నిజానికి హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో భారత్ తో ప్రైవేటుగానే చర్చించాల్సిన కెనడా, దీన్ని బహిర్గతం చేసి వివాదానికి కారణమైనట్టు నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. 
మహిళా బిల్లుకు లోకసభలో మద్దత్తు ఇవ్వని మజ్లిస్ పార్టీ పట్ల  ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లకుండా పార్టీ నష్ట నివారణ చర్యలు తీసుకుంటుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే మజ్లిస్ పార్టీ మహిళలకు రిజర్వేషన్ అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుందని పరిశీలకులు అంటున్నారు. 
పెరిగిన యూకే స్టూడెంట్, విజిటింగ్ వీసాల రుసుము నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆరు నెలలలోపు విజిటింగ్ వీసా రుసుము గతంలో 100 పౌండ్లు ఉంటే ఇప్పుడు అది 115 పౌండ్లకు పెరిగింది. విద్యార్థి వీసా రుసుము గతంలో 363 పౌండ్లు ఉండగా దానిని 490 పౌండ్లకు పెంచుతూ బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. బుధవారం (అక్టోబర్ 4) శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 18 కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
వారం రోజులలోగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తం ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం వారం రోజులలోగా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.
కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమనుకున్న మైనంపల్లి హన్మంతరావు, రోహిత్‌ను మెదక్ నుంచి పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సేవా కార్యక్రమాలు, ఇతర పనులతో మెదక్ లో రోహిత్ ప్రజల్లో ఉంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో రాజకీయాలు రంగులు మారుతున్నాయి. అలాంటి వేళ.. రాజకీయ సమీకరణాలు వాయువేగంతో మారిపోతున్నాయి. ఇప్పటి వరకు ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని అందుకొంటామంటూ వస్తున్న కేసీఆర్ అండ్ కో ధీమా సన్నగిల్లిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రిమోట్ కంట్రోల్ హస్తినలో ఉంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆయనకు అధిష్ఠానం. నీట ముంచినా, పాల ముంచినా భారం మొత్తం వారి మీద వేసి వారి అండదండలతోనే జగన్ రాష్ట్రంలో తన అరాచక పాలన సాగిస్తున్నారు. ఇదీ జగన్ గత నాలుగేళ్ల పై చిలుకు పాలనపై పరిశీలకుల విశ్లేషణ. ఇప్పుడు చంద్రబాబు అరెస్టుతో జగన్ పాపాలలో బీజేపీకి భాగం ఉందన్న విషయం సర్వులకూ తెలిసిపోయింది.
బీజేపీకి జనసేనానిని కటీఫ్ చెప్పేశారా? ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తనకు బీజేపీతో మైత్రి పెద్ద ప్రతిబంధకంగా మారుతోందని భావిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.