పరీక్షకి భయపడితే బట్టతల వచ్చేసింది!

Publish Date:Aug 4, 2016

Advertisement

 

మన రోజువారీ జీవితాల మీద ఒత్తిడి చూపే ప్రభావం అంతా ఇంతా కాదని అందరికీ తెలిసిందే! ఒత్తిడి మన ఆలోచనా విధానమే కావచ్చు. కానీ అది మన ఆరోగ్యం మీద చూపే ప్రభావం దారుణంగా ఉంటుంది. అజీర్ణం దగ్గర్నుంచీ గుండెపోటు వరకూ ఒత్తిడి ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో రోజూ చదువుతూనే ఉన్నాము. కానీ ఈ వారం అంతర్జాతీయ పత్రికలలో వచ్చిన ఓ వార్త ఒత్తిడి గురించి మరింత భయాన్ని రాజేసింది. అదేమిటంటే...

 

కేటీ అన్నా మూర్‌ అనే 20 ఏళ్ల యువతి ఇంగ్లండులోని బోర్నెమోత్‌ విశ్వవిద్యాలయంలో చదువుతోంది. కేటీకి, పట్టులా ఒత్తుగా ఉండే తన పొడవాటి జుట్టంటే మహా ఇష్టంగా ఉండేది. అలాంటిది ఒక రోజున తలస్నానం చేస్తుండగా, గుప్పిళ్ల నిండా జుట్టు చేతికంది రావడం చూసి నిర్ఘాంతపోయింది కేటీ. అలా అడపాదడపా ఊడటం మొదలుపెట్టిన జుత్తు, రోజులు గడిచేకొద్దీ విపరీతంగా రాలిపోయింది. ఒక రెండు వారాలు గడిచేసరికి దాదాపు 70 శాతం జుట్టు రాలిపోయింది.

 

కేటీ తన అరకొర జుట్టుతో తరగతులకు వెళ్లడానికి కూడా సిగ్గుపడిపోయింది. ఇక తన గదిని ఖాళీ చేసి తండ్రి దగ్గరకు వెళ్లిపోయింది. కేటీ సమస్యను విన్న వైద్యులు ఎన్ని పరీక్షలు చేసినా ఉపయోగం లేకపోయింది. చివరికి తేలిందేమంటే... మరో రెండు నెలలలో విశ్వవిద్యాలయంలో జరగబోతున్న పరీక్షల విషయంలో ఒత్తిడికి లోనవ్వడం వల్ల కేటీ జుత్తు అలా రాలిపోయిందట. పైగా మిగిలిన కాస్త జుత్తు కూడా ఊడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించి పంపారు వైద్యులు.ఇంతకీ కేటీకి వచ్చిన రుగ్మత పేరు- ‘అలోపేసియా అరేటా’! శరీరం తన సొంత కణాలనే శత్రువులుగా భావించి, వాటి మీద దాడి చేయడంలో (autoimmune disease) ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. సాధారణంగా జన్యువుల కారణంగా వచ్చే ఈ ‘అలోపేసియా అరేటా’ కొన్ని సందర్భాలలో తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా ఏర్పడవచ్చని చెప్పుకొచ్చారు. అందుకు కేటీ ఉదంతమే ఒక ఉదాహరణ.

 

సాధారణంగా ఈ వ్యాధికి గురైనవారిలో ఓ నెల నుంచి సంవత్సరం లోపల మళ్లీ జుట్టు వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే అలా జుట్టు మళ్లీ పెరగడానికి స్టెరాయిడ్లను వాడాల్సి రావచ్చు. పైగా ఒకసారి ఈ రుగ్మత వచ్చి మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నవారిలో మళ్లీ మళ్లీ వ్యాధి తిరగబెట్టే ప్రమాదమూ లేకపోలేదు. అందుకే కేటీ ఇక మరో గత్యంతరం లేక ఓ విగ్గుని కొనుక్కోవాలని అనుకుంటోంది. ఆ విగ్గు కొనుక్కోవడం కోసం తనకు సాయం చేయండంటూ ఆన్‌లైన్‌లో (https://www.gofundme.com/katieswig) అభ్యర్థిస్తోంది.

 

అదండీ విషయం! ఒత్తడి ఎంత పని చేస్తుందో మనకి మరోసారి తెలిసివచ్చింది కదా! అందుకే మన జీవితాలలోకి ఒత్తిడి ప్రవేశించకుండా జాగ్రత్తపడదాం. బతుకు అనే ఈ సముద్రాన్ని అలవోకగా దాటేందుకు ప్రయత్నిద్దాం.

 

- నిర్జర.

By
en-us Political News

  
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.