ఆటో డ్రైవర్ టు రూ. 900 కోట్ల ఎంపైర్: పెప్సీ, కోకాకోలానే వణికించిన సత్య శంకర్!

Publish Date:Jun 13, 2026

Advertisement

జీవితంలో విజయం సాధించడానికి పెద్ద పెద్ద చదువులు, కోట్లలో పెట్టుబడులు అవసరం లేదని కర్ణాటకకు చెందిన సత్య శంకర్ నిరూపించారు. కేవలం 12వ తరగతి వరకే చదువుకుని, ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేయాల్సి వచ్చిన ఒక సాదాసీదా 18 ఏళ్ల కుర్రాడు ఈరోజు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న బిజినెస్ టైకూన్‌గా మారారు. తండ్రి ఒక చిన్న గ్రామంలో పూజారిగా పనిచేసేవారు. కుటుంబ పేదరికం నుండి ఎలాగైనా బయటపడాలనే పట్టుదలతో సత్య శంకర్ ఒక ప్రభుత్వ పథకం ద్వారా లోన్ తీసుకుని ఆటోరిక్షా కొనడమే కాకుండా, డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకుని స్వయంగా ఆటో నడపడం ప్రారంభించారు.

ఆటో నడుపుతూ కష్టపడి లోన్ పూర్తిగా తీర్చేసిన తర్వాత, కొన్నాళ్లకు ఆ ఆటోను అమ్మేసి ఒక అంబాసిడర్ కారు కొని ట్యాక్సీ డ్రైవర్‌గా మారారు. ఆ ట్యాక్సీ డ్రైవింగ్ రోజుల్లోనే ఆయన జీవితాన్ని మలుపు తిప్పే ఒక అద్భుతమైన వ్యాపార ఆలోచన దొరికింది. ఆయన ట్యాక్సీలో ప్రయాణించే విదేశీ పర్యాటకులు ఎక్కడికి వెళ్లినా మొదట కొనేది ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బాటిల్ మాత్రమేనని ఆయన గమనించారు. మార్కెట్‌లో స్వచ్ఛమైన తాగునీటికి ఎంతటి భారీ డిమాండ్ ఉందో అర్థం చేసుకున్న సత్య శంకర్ మైండ్‌లో వాటర్ బాటిల్ బిజినెస్ ఐడియా బలంగా నాటుకుంది.

1988లో కారు అమ్మేసి పుత్తూరులో ఒక చిన్న ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ షాప్ పెట్టారు. ఆ తర్వాత టైర్ల బిజినెస్, ఆపై 1994లో 'ప్రవీణ్ క్యాపిటల్' పేరుతో ఒక ఫైనాన్స్ కంపెనీని కూడా ప్రారంభించారు. పాత ఆటోలు, కార్లకు బ్యాంకులు ఎవరూ లోన్లు ఇవ్వని ఆ రోజుల్లో, తాను ఒకప్పుడు డ్రైవర్‌గా పడిన కష్టాలను గుర్తుచేసుకుంటూ తోటి డ్రైవర్లకు లోన్లు ఇవ్వడం ప్రారంభించి మంచి విజయం సాధించారు. అయితే మనసులో ఎక్కడో దాగున్న నీటి బిజినెస్ ఐడియాను ఆయన మర్చిపోలేదు. చివరికి 2000 సంవత్సరంలో పుత్తూరుకు దగ్గరలోని నరిమొగరు అనే గ్రామంలో ఒక ఫ్యాక్టరీ పెట్టి, కన్నడంలో చుక్క అని అర్థం వచ్చేలా 'బిందు' అనే బ్రాండ్‌తో వాటర్ బాటిళ్ల బిజినెస్ అధికారికంగా ప్రారంభించారు.

ఆ తర్వాత ఒకసారి ఉత్తర భారతదేశ పర్యటనలో ఉన్నప్పుడు, ఒక చిన్న దుకాణంలో సోడాలో జీలకర్ర పొడి, ఉప్పు కలిపి అమ్మడం సత్య శంకర్ చూశారు. దీన్ని మన స్టైల్‌లో మరింత బెటర్‌గా ఎందుకు ఇవ్వకూడదు అనుకుని పుత్తూరు తిరిగొచ్చిన వెంటనే 'బిందు ఫిజ్ జీరా మసాలా'ను తయారు చేశారు. మొదట్లో ఈ డ్రింక్‌ను మార్కెట్ అస్సలు పట్టించుకోలేదు. మార్కెట్‌కు 200 బాక్సులు పంపితే ఏకంగా 100 బాక్సులు వెనక్కి వచ్చేసేవి. మార్కెట్‌లో పెప్సీ, కోకాకోలా లాంటి అంతర్జాతీయ దిగ్గజాలు రాజ్యమేలుతున్న సమయమది. కానీ శంకర్ వెనకడుగు వేయకుండా, హైవేల పక్కన ఉన్న గోడలపై స్వయంగా పెయింటింగ్‌లు వేయిస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. మెల్లగా జనాలు ఆ లోకల్ టేస్ట్‌ను ఇష్టపడటం మొదలైంది. ముఖ్యంగా స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత 'బిందు జీరా సోడా' తాగడం ఒక పెద్ద ట్రెండ్‌గా మారిపోయింది.

ప్రస్తుత తాజా అంచనాల ప్రకారం సత్య శంకర్ నేతృత్వంలోని 'ఎస్‌జీ కార్పొరేట్స్' వార్షిక టర్నోవర్ ఏకంగా రూ. 900 కోట్లకు చేరింది. ఇందులో కేవలం 'హౌస్ ఆఫ్ బిందు' డ్రింక్స్ మరియు స్నాక్స్ విభాగం నుండే రూ. 570 కోట్లు వస్తుండగా, ఫైనాన్స్ బిజినెస్ నుండి రూ. 330 కోట్లు సమకూరుతోంది. ప్రస్తుతం జీరా మసాలా నుండి మ్యాంగో జ్యూస్ వరకు 55 రకాల విభిన్న ప్రొడక్ట్స్ వీరికి ఉన్నాయి. కర్ణాటక, తెలంగాణలలో సొంతంగా మేనుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు ఉండగా, త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారు. ఒకప్పుడు ఆటో నడిపిన బెల్లారే గ్రామానికి చెందిన ఈ కుర్రాడు.. నేడు అత్యంత విలాసవంతమైన లగ్జరీ రోల్స్ రాయిస్ కారును కొనే స్థాయికి ఎదిగారు. పెద్ద పెద్ద డిగ్రీలు లేకపోయినా, కేవలం కష్టపడే తత్వం, లోకల్ టేస్ట్‌ను నమ్ముకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని సత్య శంకర్ నిరూపించారు.

By
en-us Political News

  
సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో  దోషిగా  తీహార్ జైళ్లో  శిక్ష అనుభవిస్తున్న సజ్జన్ కుమార్ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయనను జైలు అధికారులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు.  
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ గ్రంథాలయాల సవరణ బిల్లుఅలాగే  ఏపీ ఉన్నత విద్య నియంత్రణ,  పర్యవేక్షణ కమిషన్ సవరణ బిల్లుకు కూడా శాసనమండలి  ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. అలాగే..  విద్యారంగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో పాటు నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు ఉద్దేశించిన ఏపీ ప్రైవేటు విశ్వవిద్యాలయాల స్థాపన, క్రమబద్ధీకరణ సవరణ బిల్లు సైతం సభ ఆమోదం పొందింది.
 దక్షిణాదిలోని ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన చంద్రబాబు నొక్కి చెప్పారు.  అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను సమర్థవంతంగా అనుసంధానిస్తూ కుప్పం మీదుగా ప్రత్యేక బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు  ప్రతిపాదించారు.
హర్మూజ్ జలసంధిలోని దక్షిణ మార్గంలో, ఒమన్ తీరానికి సమీపంలో అమెరికా నియంత్రణలోని ఈ ప్రత్యేక కారిడార్‌..  సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఇరాక్, ఖతార్ వంటి  ఇంధన ఉత్పత్తి దేశాల నుంచి చమురు నింపుకున్న ట్యాంకర్లతో పాటు, ఖాళీగా తిరిగొచ్చే నౌకలకు కూడా పూర్తి భద్రత కల్పిస్తూ రవాణాను సమన్వయం చేస్తున్నది.
ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని చింతలపూడి,  రేచర్ల బొగ్గు బ్లాకులను ఎంపిక చేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఈ వేలం ప్రక్రియ ద్వారా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ ఈ రెండు  బొగ్గు బ్లాకులను దక్కించుకుంది.
దాదాపు వెయ్యి కోట్ల రూపాయల  విదేశీ చెల్లింపుల  వ్యవహారంలో పన్ను ఎగవేత, యు అక్రమ నిధుల మళ్లింపు ఆరోపణలపై ఐటీ అధికారులు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఏకకాలంలో  13 ప్రాంతాలలో సోదాలు చేపట్టారు.  ఈ సోదాల్లో డిజిటల్ ఆధారాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లో తన వాటాను 9.99 శాతానికి పెంచుకోవడానికి ఎల్‌ఐసికి ఆర్బీఐ అనుమతి లభించింది. ఈ వార్తతో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు ధర 1% పెరిగింది. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిర్గియోస్ డోపింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. కొకైన్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ITIA అతడిపై తాత్కాలిక సస్పెన్షన్ వేటు వేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఎఫ్‌ఐహెచ్ పురుషుల హాకీ వరల్డ్ కప్ పూల్ డి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ 5 3 తేడాతో సంచలన విజయం సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్, అభిషేక్ చెరో రెండు గోల్స్‌తో చెలరేగి జట్టుకు ఘన విజయాన్ని అందించిన పూర్తి వివరాలు చూడండి.
బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్‌లో పీవీ సింధు, ఆయుష్ శెట్టి ప్రిక్వార్టర్స్‌లోకి దూసుకెళ్లారు. సాత్విక్ చిరాగ్ జోడీకి వాకోవర్ లభించగా, లక్ష్యసేన్ తీవ్ర పోరాటంలో ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ఫలితాలు, కీలక గణాంకాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి!
అంతర్జాతీయ చెస్ రంగాన్ని ఏలుతున్న భారత్! ప్రతిష్టాత్మక సింక్‌ఫీల్డ్ కప్‌లో ఫ్రాన్స్ గ్రాండ్‌మాస్టర్‌ను ఓడించి అగ్రస్థానానికి చేరుకున్న ఆర్. ప్రజ్ఞానంద. మరోవైపు ఆసియాన్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత అండర్ 11 బాలికల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. పూర్తి వివరాలు చదవండి.
నాసా ప్రతిష్టాత్మక స్విఫ్ట్ గామా-రే టెలిస్కోప్ రెస్క్యూ మిషన్ విఫలమైంది. $30 మిలియన్ల వ్యయంతో చేపట్టిన రోబోటిక్ క్రాఫ్ట్ నియంత్ పిలవకపోవడంతో మిషన్‌ను నాసా రద్దు చేసింది. త్వరలోనే భూ వాతావరణంలో మండిపోనున్న స్విఫ్ట్ టెలిస్కోప్ పూర్తి వివరాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.