దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న అగ్రీగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం నడుంబిగించింది. పదేళ్లుగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని, తాము దాచుకున్న ప్రతి పైసా తిరిగి వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న అగ్రీగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అగ్రిగోల్డ్ వ్యవహారంలో న్యాయపరమైన చిక్కులన్నిటినీ వేగంగా పరిష్కరించి.. ఆరు నెలల వ్యవధిలోనే సొమ్ములు బాధితులకు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో అగ్రీగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను ఆరు నెలలలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేలం ద్వారా వచ్చే నిధులతో బాధితులకు నేరుగా డబ్బులు చెల్లించేలా ఒక స్పష్టమైన, పారదర్శరమైన కార్యాచరణను తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రెడీ చేసింది. సచివాలయంలో హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉపసంఘం తొలి సమావేశం ఈ మేరకు నిర్ణయించింది.
ఈ మంత్రివర్గ ఉపసంఘం భేటీలో మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ నేరుగా పాల్గొనగా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వర్చువల్గా హాజరయ్యారు. ఈ సమస్య పరిష్కారానికి, కేసుల విచారణ వేగవంతం కావడానికి ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటుతో పాటు, ప్రతి 15 రోజులకోసారి ఈ మంత్రుల కమిటీ సమావేశమై పురోగతిని సమీక్షించాలని ఈ భేటీ నిర్ణయించింది.
ప్రభుత్వ లేక్కల మేరకు.. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా సుమారు 11.57 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు. వీరందరికీ కలిపి మొత్తం 3 వేల 944 కోట్లు చెల్లించడమే లక్ష్యంగా ప్రస్తుత ప్రభుత్వం ఈ రోడ్మ్యాప్ను రూపొందించింది. అగ్రిగోల్డ్కు చెందిన వేలాది కోట్ల విలువైన ఆస్తుల పరిరక్షణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 23 వేల 599 ఎకరాల భూములను అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ భూములన్నింటినీ పూర్తిగా జియో ట్యాగింగ్ చేయడం ద్వారా రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరచనున్నారు. తద్వారా ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఆస్తులను కాపాడనున్నారు. మరోవైపు సీఐడీ దర్యాప్తులో సుమారు 2 వేల కోట్ల రూపాయల విలువైన బాండ్లు ఏజెంట్ల వద్దనే ఉండిపోయినట్లు గుర్తించారు. ఈ నకిలీ లేదా హోల్డ్ లో ఉన్న బాండ్లను నెలరోజుల్లో పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టనున్నారు.
AP Government roadmap, AgriGold victims repayment, Vangalapudi Anitha, Nadendla Manohar, Telugunews
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/auction-of-agrigold-assets-36-225344.html
జూలై 9 గురువారం నాడు దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ సహా ప్రముఖ నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ పసిడి తాజా రేట్లను ఇక్కడ తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త EPS Scheme 2026 తో ఉద్యోగుల పెన్షన్ విధానంలో భారీ మార్పులు జరిగాయి. కేవలం 20 రోజుల్లోనే క్లెయిమ్ సెటిల్మెంట్, ఆలస్యమైతే 12% పెనాల్టీ వడ్డీతో పాటు పాత స్కీమ్ EPS 1995 కు మరియు కొత్త విధానానికి గల ముఖ్యమైన తేడాలను ఈ స్టోరీలో పూర్తిగా తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకం Customs Duty మినహాయింపులను భారీగా విస్తరించడంతో డిక్సన్ టెక్, సిర్మా ఎస్జీఎస్, అంబర్ ఎంటర్ప్రైజెస్ షేర్లు 6 శాతం వరకు పెరిగాయి. 2029 వరకు వర్తించే ఈ కొత్త రూల్స్ ఎలక్ట్రానిక్స్ రంగాన్ని ఎలా మార్చబోతున్నాయో ఇక్కడ చూడండి.
భారత ఆర్థిక రంగంలో చారిత్రక మైలురాయి తొలిసారిగా ఎఫ్ఐఐ FII ఆస్తులను అధిగమించి రూ. 76.41 లక్షల కోట్లకు చేరిన దేశీయ మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు. పూర్తి వివరాలు మరియు ఆసక్తికర గణాంకాలు ఇక్కడ చూడండి.
ఐసీఐసీఐ బ్యాంక్ షాపింగ్ ఫెస్టివల్ ఆఫర్లు ఈరోజు అర్ధరాత్రితో ముగియనున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఈ-కామర్స్, ఫ్యాషన్ వస్తువులపై ₹7,500 వరకు డిస్కౌంట్ పొందే పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
న్యూజిలాండ్లో ఉన్నత చదువుల కోసం ఇమ్మిగ్రేషన్ శాఖ సరికొత్త పాత్వే స్టూడెంట్ వీసా (PSV) నిబంధనలను తెచ్చింది. ఒకే వీసాతో ఐదేళ్లలో 3 కోర్సులు చదివే ఈ కొత్త రూల్స్, అర్హతల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
టాటా గ్రూప్ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) నేడు తమ క్యూ1 ఫలితాలను విడుదల చేయనుంది. ఉద్యోగుల వేతనాల పెంపు ప్రభావం మరియు రాబోయే డివిడెండ్, మార్కెట్ నిపుణుల అంచనాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
నిన్నటి భారీ పతనం తర్వాత భారత స్టాక్ మార్కెట్లు అదిరిపోయే రీతిలో కోలుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాల్లో పయనిస్తూ ఇన్వెస్టర్ల సంపదను పెంచాయి. మార్కెట్ జోరుకు గల 5 ముఖ్య కారణాలు మరియు రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.
ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్తో తలపడనున్న మోరాకోకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హామ్స్ట్రింగ్ గాయం కారణంగా స్టార్ ప్లేయర్ ఇస్మాయిల్ సైబారీ మ్యాచ్కు దూరమయ్యాడు. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
ఈ పత్రాలను నమ్మిన మెటాలాయిడ్ సంస్థ షేర్హోల్డర్స్ అగ్రిమెంట్, ప్రాజెక్ట్ గవర్నెన్స్ ఒప్పందాలు సహా పలు ప్రక్రియలను పూర్తి చేసింది. అయితే అనంతరం నిర్వహించిన డ్యూ డిలిజెన్స్లో సమర్పించిన బ్యాంకు పత్రాలు, గ్యారంటీలు, ఖాతా వివరాలు నకిలీవని తేలింది. దీంతో తాము మోసపోయినట్లు గుర్తించిన సంస్థ ప్రతినిధులు నేరుగా సంబంధిత బ్యాంకును సంప్రదించగా, పత్రాల్లో పేర్కొన్న వివరాలు తమ రికార్డుల్లో లేవని స్పష్టం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిఫా వరల్డ్కప్ 2026 క్వార్టర్ ఫైనల్స్ షెడ్యూల్ విడుదల. అర్జెంటీనా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లాండ్ జట్ల మ్యాచ్ల తేదీలు, సమయాలు మరియు పూర్తి వివరాలు తెలుగులో చూడండి.
భారత టెన్నిస్ దిగ్గజం, 18 గ్రాండ్స్లామ్ టైటిళ్ల విజేత లియాండర్ పేస్ ఆసియా టెన్నిస్ సమాఖ్య (ATF) ప్లేయర్ అంబాసిడర్గా నియమితులయ్యారు. వింబుల్డన్ వేదికగా జరిగిన ఈ చారిత్రాత్మక నిర్ణయం మరియు పేస్ సాధించిన రికార్డుల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
లోకేష్ షూఆల్స్, సోలమ్, అపాక్ట్, బూ యంగ్, హ్వాసుంగ్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు, శాంసంగ్ , ఎల్జీ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూల వాతావరణం, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, మౌలిక వసతులను వారికి సమగ్రంగా వివరించి వారు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సుకత, ఆసక్తి చూపేలా చేయడంలో సఫలీకృతులయ్యారు.