Publish Date:Jul 15, 2022
పెళ్లిళ్లలో పెద్ద బావగారిలా హడావుడి చేసినంత మాత్రాన అన్నీ అయిపోవు, అత్తరూ రాయరు. కేంద్రంలో అధికారంలో వున్నంత మాత్రాన బిజెపి అన్ని రాష్ట్రాల్లోనూ దబాయించి అధికారం చేజిక్కించుకోవచ్చన్న ధోరణిలో మరీ దూకుడుగా వ్యవహరిస్తోంది. కానీ తెలంగాణాలో ఇటీవలి సర్వే మాత్రం ఆ దూకుడుతో కమలం బోర్లా పడే అవకాశాలే చాలా వున్నాయని తేల్చింది. ఇప్పుటికిప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణాలో బిజెపి మూడో స్థానానికే పరిమితమౌతుందని ఆత్మసాక్షి సర్వే కుండబద్దలు కొట్టేసింది.
ఈ సర్వే తెలంగాణలో గులాబీ పార్టీకి ఈ సారి 39.5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. అంటే 56 నుంచి 59 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటుందని పేర్కొంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సీట్లు పెరిగే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. 31.5 శాతం ఓట్లు వస్తాయనీ, 37 నుంచి 39 స్థానాలలో ఆ పార్టీ విజయం సాధించే అవకాశాలున్నాయనీ అంచనా వేసింది. ఇక బీజేపీకి కూడా 21 శాతం ఓట్లు పడే అవకాశం ఉందనీ, సీట్ల పరంగా 14 నుంచి 16 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందనీ ఆత్మసాక్షి సర్వే తేల్చేసింది. రాష్ట్రంలో మొత్తం మీద టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని సర్వే తేల్చేసింది.
ఇక ఎంఐఎం కు 2.75 శాతం ఇతరులకు 3.25 శాతం ఓట్లు పడనున్నాయి. సర్వే కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1.88 లక్షల మంది అభిప్రాయాలను సేకరించింది ఆత్మసాక్షి. సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ధరణి, వడ్ల కొనుగోలు, ఎంప్లాయిమెంట్, శాంతి, అడ్మినిస్ట్రేషన్, పరిపాలన తీరు వంటి 40 అంశాలపై ప్రశ్నలు రూపొందించినట్లు ఆత్మసాక్షి గ్రూప్ సంస్థ సీఈవో మూర్తి తెలిపారు. తాము ఇంతవరకు 18 రాష్ట్రాల్లో ఇలా సర్వేలు చేశామని చెప్పారు. అయితే అందులో 16 రాష్ట్రాలలో తమ సర్వే కచ్చితమైన ఫలితాలను వెల్లడించిందని వివరించారు. . కేవలం రెండు రాష్ట్రా ల్లో మాత్రమే తమ అంచనాలు తప్పాయని పేర్కొన్నారు. ఈ సర్వే మొత్తం జూన్ 30వ తేదీ నాటికి పూర్తయింది.
టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన దళిత బంధు పథకమే ఆ పార్టీకి కొంత ఓటు బ్యాంకు ను దూరం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనీ, ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం వల్ల ఇంతకుముందుతో పోలిస్తే ఇప్పుడు 1.5 శాతం మంది దళితులు గులాబీ పార్టీకి దూరంగా జరిగారనీ సర్వే పేర్కొంది. వడ్లు కొనుగోలు జాప్యం, ఇంధన ధరల పెరుగుదలకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే కారణమని తెలంగాణ ప్రజలు అభిప్రాయపడుతున్నట్టు సర్వే లో తేలిందని ఆత్మసాక్షి పేర్కొంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/atma-sakshi-survey-says-bjp-will-confine-to-third-place-in-telangana-25-139822.html
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
అందె శ్రీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందనీ, ఇందుకోసం చట్టపరమైన మద్దతు అవసరమని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో 1994పబ్లిక్ సర్వీస్ కమిషన్ చట్టంలోని నిబంధనలు సవరించాల్సి ఉందని తెలిపారు. అందె శ్రీ కుమారుడికి ఉద్యోగ అవకాశం కల్పించడం కోసం చేసిన సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టామన్నారు.
దేశంలో మోడీ పాలన అంతమవ్వాలంటే.. పొరుగు దేశాలైన శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్లలో జరిగిన ఉద్యమాల వంటివి ఇక్కడ కూడా రావాలని ఆయన అన్నారు.
ఏపీలో వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ప్రజలు తమకు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం వైసీపీ అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తే.. తెలంగాణలో ప్రతిపక్ష హోదాలో ఉన్న బీఆర్ఎస్ అసెంబ్లీలో కాంగ్రెస్ సభ్యులను దీటుగా ఎదుర్కోవడంలో వైఫల్యం కారణంగా బాయ్ కాట్ చేస్తున్నదన్న చర్చ జరుగుతోంంది.
ఇంత కాలం కల్వకుంట్ల కవిత తన విమర్శలను హరీష్ రావు, సంతోష్, జగదీశ్వరరెడ్డి వంటి నాయకులకే పరిమితం చేసిన కవిత ఇప్పుడు బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, సవాళ్లు సంధిస్తున్నారు.
తాజా చిట్ చాట్ లో ఆమె తన తండ్రి కేసీఆర్ నే నేరుగా నిలదీశారు. కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఇక ఖతమేనన్నారు. అయినా ఎటువంటి తప్పూ చేయకపోతే కేసీఆర్ సభకు ఎందుకు రావడం లేదని నిలదీశారు.
గత కొంత కాలంగా తన స్వంత కుమారుడు, కుమార్తెల మధ్య పంచాయతీని పరిష్కరించే విషయంలో విఫలమైన ఆయన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య జలపంచాయతీలు, కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారని ఎద్దేవా చేశారు. రానున్న రోజులలో బీఆర్ఎస్ కనుమరుగైపోవడం ఖాయమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.
స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డిపై రెండు రౌండ్లు కాల్పులు జరపగా, ప్రతిగా గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు.
Publish Date:Dec 31, 2025
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
Publish Date:Dec 31, 2025
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.