కేంద్రానికి చావుదెబ్బ...

Publish Date:Jul 14, 2016

Advertisement

బీజేపీ సారథ్యంలోని కేంద్రప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బతగిలింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించి చేతులు కాల్చుకున్న మోడీ సర్కార్‌కు..సుప్రీంకోర్టు మరోసారి వాతలు పెట్టింది. రాజకీయ సంక్షోభంలో చిక్కుకున్న ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కార్‌ను పునరుద్దరించాలని అత్యున్నత న్యాయస్థానం చారిత్రక తీర్పునిచ్చింది. ఆ ప్రభుత్వ పతనానికి కారణమైన గవర్నర్ నిర్ణయాలన్నీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేవిగా ఉన్నాయని పేర్కొంటూ వాటన్నింటిని రద్దు చేసింది. అసెంబ్లీలో 2015 డిసెంబర్ 15 నాటి స్థితిని కొనసాగించాలని ఆదేశించింది. దీంతో ఈ ఏడాది జనవరిలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడంతో పదవీచ్యుతుడైన నబమ్‌టుకీ తిరిగి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు.

 

అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ 47 మంది ఎమ్మెల్యేల మద్థతుతో అధికారంలోకి రాగా, నబమ్ టుకీ 2011 నవంబర్ 1న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు..ఆయన సోదరుడు రెబియా స్పీకర్ అయ్యారు. 2014 డిసెంబర్‌లో టుకీ ప్రభుత్వం ఆర్థిక అవతవకలకు పాల్పడుతోందంటూ ఆరోగ్య శాఖ మంత్రి కలిఖోపుల్‌ ఆరోపణలు చేశారు. దీంతో సీఎం ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించారు. దీంతో పుల్ తిరుగుబాటుకు దిగారు..పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు పుల్‌ను 2015లో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. గవర్నర్‌గా జ్యోతి ప్రసాద్ రాజ్‌కోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. 2016 జనవరి 14న జరగాల్సిన ఆరో విడత అసెంబ్లీ సమావేశాలను డిసెంబర్ 16, 2015నే నిర్వహించాలని గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.

 

అదే సమయంలో స్పీకర్ రెబియా 21 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో 14 మందిని అనర్హులుగా ప్రకటించారు. స్పీకర్ ఆదేశాలను 2015 డిసెంబర్ 16న డిప్యూటీ స్పీకర్ రద్దు చేశారు. 16 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోవన్న స్పీకర్ నిర్ణయం చట్ట వ్యతిరేకమన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టుకీ సర్కార్ అసెంబ్లీకి తాళం వేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యేలతో పాటు బీజేపీ, స్వతంత్ర ఎమ్మెల్యేలు 33 మంది వేరే భవనంలో భేటీ అయ్యి అసెంబ్లీ నిర్వహించారు. స్పీకర్‌గా రెబియాను తొలగిస్తూ తీర్మానాన్ని ఆమోదించి, కొత్త స్పీకర్‌ను ఎన్నుకున్నారు. తిరిగి 2015 డిసెంబర్ 17 ఓ హోటల్‌లో సమావేశమై పుల్‌ను సీఎంగా ఎన్నుకున్నారు. రాజకీయ సంక్షోభం ముదిరిపాకాన పడటంతో కేంద్రం రంగంలోకి దిగి ఈ ఏడాది జనవరి 26న రాష్ట్రపతి పాలన విధించింది. జనవరి 28న రాష్ట్రపతి పాలనను వ్యతిరేకిస్తూ సీఎం టుకీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఫిబ్రవరి 19న రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను ఎత్తివేశారు. అదే నెల 20న కలిఖోపుల్ సీఎంగా ప్రమాణం చేశారు.

 

టుకీ పిటిషన్‌పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజాగా తీర్పును వెలువరించింది. జస్టిస్ దీపక్‌మిశ్రా, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ పి.సి.ఘోష్, జస్టిస్ ఎన్.వి.రమణలతో కూడిన ధర్మాసనం 331 పేజీల తీర్పునిచ్చింది. ప్రజాప్రతినిధుల అధికారాన్ని కాదనే అధికారం గవర్నర్‌కు ఉండదు. మంత్రిమండలికి సభ విశ్వాసం ఉన్నంతకాలం..ముఖ్యమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సాయం, సలహాలకు గవర్నర్ బద్ధుడై ఉండాల్సిందే..అధికారంలో ఉన్న ప్రభుత్వం శాసనసభలో మెజారిటీని కోల్పోయినప్పుడు మాత్రమే మంత్రిమండలి సాయం, సలహా లేకుండా గవర్నర్ రాజ్యాంగంలోని 174వ అధికరణ కింద తనకు గల అధికారాన్ని వినియోగించవచ్చు. రాజకీయపార్టీలోని అసమ్మతి, విభేదం, అనైక్యత, అసంతృప్తి, అభిప్రాయబేధాలకు గవర్నర్ దూరంగా ఉండాలి. ఒక రాజకీయ పార్టీలోని కార్యకలాపాలు..ఆ పార్టీ శ్రేణుల మధ్య అలజడి, ఆందోళనల విషయం గవర్నర్‌కు సంబంధం లేని అంశం.

 

రాష్ట్ర శాసన వ్యవస్థకు తాను స్వతంత్ర న్యాయాధికారిగా వ్యవహరించరాదు. స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకునే అధికారం గవర్నర్‌కు లేదు. స్పీకర్ లేదా డిప్యూటీ స్పీకర్‌ను తొలగించడంలో గవర్నర్‌కు ఎలాంటి పాత్రా ఉండకూడదని జస్టిస్ ఖేహార్ పేర్కొన్నారు. గవర్నర్‌కు..మంత్రిమండలికి మధ్య సమాచార సంబంధాలు పూర్తిగా విఫలమైనపుడు రాష్ట్రపతి జోక్యం చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఇక స్పీకర్ అత్యున్నత స్థాయి రాజ్యాంగహోదాను అనుభవిస్తారు. రాజ్యాంగం స్పీకర్‌పై అపార విశ్వాసం ఉంచుతుంది. ఈ ఒక్క కారణానికే, స్పీకర్ ఉన్నతమైన స్వతంత్ర భావన. రాజ్యాంగంలోని 179(సి) అధికరణ ఉద్దేశ్యం అదేనని గుర్తు చేశారు. సుప్రీం తీర్పుతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంతోషంలో మునిగి తేలుతుండగా..బీజేపీకి చావుదెబ్బ తగిలింది. ఈ ఏడాది మేలో ఉత్తరాఖండ్‌లో కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను ఎత్తేసిన సుప్రీం..బలపరీక్ష జరపాలని ఆదేశించడంతో రావత్ సర్కార్ తిరిగి అధికారంలోకి వచ్చింది. 

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.