కర్ర ఝుళిపిద్దామనుకున్నారు.. కాళ్లా వేళ్లా పడుతున్నారు.. సాక్షిని టార్గెట్ చేసిన జాక్

Publish Date:Jan 24, 2022

Advertisement

ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డిది అసలైన గాంభీర్యమా? మేకపోతు గాంభీర్యమా.. అనేది కొద్ది గంటల్లోనే తేలిపోయింది. ఎవరో ఒకరు పిల్లి మెడలో గంట కట్టాల్సిందేనని, అలా గంట కట్టకపోతే ఎలుకల్ని కంట్రోల్ చేయడం అయ్యే పని కాదంటూ వీర లెవెల్లో బిల్డప్ లు ఇచ్చిన జగన్ సర్కారు.. ఆ జీవో జారీ చేసిన కొద్ది కాలానికే జ్ఞానోదయం పొందిందా.. లేక తత్వం బోధపడి నాలుక మడతేసిందా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటో నెంబర్ జీవో జారీ అయిన వెంటనే ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎస్మా ప్రయోగం తప్పదన్న అభిప్రాయాలు వినిపించాయి. ఉద్యోగులు గనక విధులకు డుమ్మా కొడితే ప్రభుత్వ వ్యవహారాలు, ప్రజా సమస్యల పరిష్కారాలకు విఘాతం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవో చేయబోతున్నారన్న అభిప్రాయాలకూ ప్రభుత్వ పెద్దలు ఆస్కారం కలిగించారు. కానీ కొద్ది గంటల్లోపే.. పిల్లి మెడలో గంట కట్టి తీరతామన్న పెద్దలు కాస్తా స్వయంగా పిల్లులుగా మారిపోయిన సీన్ కళ్లకు కడుతోందిప్పుడు. 

పీఆర్సీసీని డిక్లేర్ చేస్తూ జీవో జారీ చేసిన వెంటనే ఏపీ ఉద్యోగ సంఘాల జాక్ నేతలు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. తాడోపేడో తేల్చుకుంటామన్న ఆ ఒక్క మాట తప్ప.. వారి ప్రకటనల్లో ఆంతర్యం మాత్రం క్లియర్ కట్ గా అదేనని ప్రజలందరికీ అర్థమైపోయింది. సర్కారీ పెద్దలు కూడా ఆ విషయాన్ని గ్రహించలేనంత దద్దమ్మలేం కాదు కదా. అనుకున్నదొకటి.. అవబోతున్నదొకటీ అన్న కనువిప్పు కలగడానికి వారికి పెద్దగా టైమేం పట్టలేదు. మరో వారం రోజుల్లో సమ్మెకు దిగుతామని నాలుగు జాక్ ల నేతలు డిక్లరేషన్ ఇచ్చిన వెంటనే కొంపలంటుకుపోబోతున్న దృశ్యం పాలకుల కళ్లకు కట్టింది. అందుకే వారు సమ్మె నోటీసు ఇచ్చే సమయానికంటే ముందే చర్చలకు రావాలని ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శశిభూషణ్ విజ్ఞప్తి చేశారు. అయితే సోమవారం 3 గం.కు సమ్మె నోటీసు ఇస్తామని, ఈలోగా పీఆర్సీ జీవోలను వాపసు తీసుకోవాలని, అలా తీసుకోని పక్షంలో చర్చలకు వచ్చే ప్రసక్తే లేదని, నేరుగా మధ్యాహ్నం 3 గం.కు సమ్మె నోటీసు ఇచ్చి తీరుతామని ఉద్యోగ సంఘాల జాక్ నేతలు అల్టిమేటం జారీ చేశారు. దీంతో ప్రభుత్వం గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. ఇదేంట్రా.. వార్నింగ్ ఇవ్వాల్సింది యజమాని కదా.. ఆఫ్టరాల్ పబ్లిక్ సర్వెంటుగాళ్లు అల్టిమేటం ఇవ్వడమేంటి? అనే ఆలోచనలో పడిపోయారు ప్రభుత్వ బాసులు. 

అంతేకాదు.. తామెన్నో ఆకులు చదువుకున్నామనుకున్న ప్రభుత్వ పెద్దల కళ్లు తెరిపించేలా అంతకంటే రెండాకులు ఎక్కువే చదివామని రుజువు చేసుకున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. నాలుగు సంఘాల జాక్ లు కలిసి ఒక్కో దానికి ముగ్గురు చొప్పున 12 మందితో పీఆర్సీ సాధన కమిటీని ఇప్పటికే డిక్లేర్ చేశారు. తాజాగా.. ఆ సంఖ్యను 20 మందికి పెంచుకొని సముద్రాన్ని దాటే హనుమంతుడి ఆకారాన్ని తలపింపజేశారు. ఎవరినైనా, ఎంతటివాారినైనా మేనేజ్ చేయడం ఈ సర్కారుకు గన్నుతో పెట్టినంత కాకపోయినా.. కనీసం బన్నుతో పెట్టినంత ఈజీనే అనేది ఆంద్రా ప్రజలందరికీ తెలుసు. అందుకే మరో అపూర్వమైన ఎత్తుగడ వేశారు. ఒక్కో జాక్ లో ప్రతినిధుల సంఖ్యను 5 కు పెంచుకొని ప్రభుత్వంతో చర్చించేవారి సంఖ్యను 20కి పెంచుకున్నారు. ఒకవేళ చర్చలకు వెళ్లినా ప్రభుత్వానికి చెమటలు పట్టించే స్కెచ్ ను పక్కాగా వేసుకున్నారు. ఇప్పటికే కొత్త పీఆర్సీ కి బదులు పాత పీఆర్సీ మాత్రమే తాము తీసుకుంటామని, అవసరమైతే సాలరీ ఒక నెల లేటైనా ఓర్చుకుంటామని, అంతేకానీ కొత్త పీఆర్సీని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించబోమని కరాఖండిగా తేల్చేశారు. ఇదే విషయం మీద ఉద్యోగ సంఘాలు కోర్టుకు వెళ్లినా ప్రభుత్వానికి (నైతిక) ఓటమి తప్పదు. ప్రగతికాముక ప్రభుత్వ హయాంలో తాజా పీఆర్సీలో ఏ ప్రగతీ కనిపించడం లేదని, అందుకే తమకు పాత పీఆర్సీనే ముద్దు అని ఉద్యోగ సంఘాల నేతలు న్యాయదేవత ముందు విన్నవించుకుంటే అక్కడ వీగిపోయేది ప్రభుత్వ వాదనే. ఆ లెక్కలేవో తేలేదాకా, తేల్చేదాకా పాత పీఆర్సీనే ఇంప్లిమెంట్ చేయమని, విచారణ జరిగేదాకా కొత్త పీఆర్సీ అమలుకు స్టే విధించమని కోర్టు ఆర్డరేస్తే ఆ నష్టం ఎవరికో తెలుసుకోలేనంత అమాయకులా ఈ ప్రభుత్వ పెద్దలు?

అందుకే మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని, ఉద్యోగ సంఘాలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని ఉంటారని శశిభూషణ్ కబురంపారు. అయితే పీఆర్సీపై అశుతోష్ మిశ్రా ఏం నివేదిక ఇచ్చారో తమకు వెల్లడించాలని, కొత్త పీఆర్సీ అమలును నిలిపివేశాక దేనిమీదైనా, ఎంతసేపైనా తాము చర్చించేందుకు సిద్ధమని, అసలు ప్రభుత్వం విధించిన కమిటీపై తమకు అధికారిక సమాచారం లేదని, ఆ కమిటీ పరిధులేంటో కూడా  తెలియదని, ఇలాంటి పరిస్థితుల్లో తాము ఎవరితో చర్చించాలో కూడా స్పష్టత లేదంటూ ప్రభుత్వ డొల్లతనాన్ని జాక్ నేతలు విజయవంతంగా తిప్పికొట్టారు. తమతో పాటు ఒప్పంద, పొరుగు సేవల సిబ్బందికి కూడా లబ్ధి జరిగేవరకు పోరాడతామంటూ ప్రభుత్వేతర ఉద్యోగుల మద్దతు కూడగడుతుండడం విశేషం. దీంతో ఎంకి  పెళ్లి సుబ్బి చావుకొచ్చిన చందంగా జగన్ బాబుకు జ్ఞానోదయం కలిగిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

అంతేకాదు.. ఉద్యోగుల పట్ల, వారి సంక్షేమం పట్ల ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి ఉందో ఈ ఘటన ద్వారా ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపారు జాక్ నేతలు. అందుకే అన్ని రకాల సమాచారాలతో ఉద్యమానికి సంసిద్ధులవుతున్న ఉద్యోగ సంఘాలు చాపకింద నీరులా జగన్ కుయుక్తులను ఎండగడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞాపనలు పంపిస్తున్నారు. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం తమకు అనుకూలంగా ఉందంటూ భ్రమించారో.. ఆ ప్రభుత్వానికి ఆయువుపట్టులా ఉన్న సాక్షి పత్రిక మూలాలను కదిలించే పనికి పూనుకున్నారు. మాయల మరాఠీ ప్రాణం చిలుకలో దాగున్నట్టు... జగన్ సర్కారు కొమ్ములు విరవాలంటే సాక్షిని దెబ్బ తీయాల్సిందేనన్న నిర్ణయానికి వచ్చారు. అందుకే తెలుగు దినపత్రికల్లో రెండో స్థానంలో ఉన్న సాక్షి సబ్ స్క్రిప్షన్ ను నిలిపివేసేందుకు కంకణం కట్టుకున్నారు. ప్రజలను, ఉద్యోగులను ఆ దిశగా ఎంకరేజ్ చేస్తున్నారు. దాదాపు 11 లక్షల సర్క్యులేషన్ లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఉద్యోగులంతా  సబ్ స్క్రిప్షన్ రద్దు చేసుకుంటే ఒకే ఒక్క రోజు జగన్ సర్కారుకు తత్వం బోధపడుతుందని భావిస్తున్నారు. అంతేకాదు.. జాక్ నేతలు ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తున్న సమయంలో ఆ అంశాన్ని అన్ని చానళ్లు కూడా ప్రత్యక్ష ప్రసారం చేశాయి... ఒక్క సాక్షి తప్ప. దీన్ని దృష్టిలో పెట్టుకున్న జాక్ నేతలు ఇకపై ఉద్యోగులెవరూ సాక్షి చానల్ చూడరాదని నిర్ణయించుకోవడం విశేషం. ఉన్న పళంగా నాలుగైదు లక్షల మంది సాక్షి చానల్ చూడటం మానేస్తే టీఆర్పీ రేటింగ్ గణనీయంగా పడిపోవడం ఖాయం. ఈ విధంగా కూడా సాక్షికి వచ్చే రెవెన్యూ మూలాలను కదిలించే వ్యూహం పన్నారు. జాక్ నేతల పిలుపందుకుంటే కనీసం 4-5 లక్షల మంది సాక్షి పత్రిక సర్క్యులేషన్ 24 గంటల్లో పడిపోతుందని, చానల్ రేటింగ్ కూడా పడిపోతుందని, దీంతో కళ్లు నెత్తికెక్కిన సర్కారు కాస్తా ఉద్యోగుల కాళ్ల బేరానికి రాక తప్పదని అంచనా వేశారు. ఆఖరుకు వారి అంచనాయే నిజమైంది. సెల్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియాను ఆశ్రయించిన జాక్ నేతల ప్రచారంతో సర్కారు పెద్దలకు ఇంటెలిజెన్స్ రిపోర్టు వెళ్లిందని, 24 గంటల్లో సాక్షి పేపరు సర్క్యులేషన్ గనక దాదాపు 50 శాతం తగ్గిపోతే అనేక కంపెనీల్లో వాటాలు తారుమారవుతాయని, జగన్ కు ఆయువుపట్టులా మారిన బడా కార్పొరేట్ బినామీ కంపెనీలకు సాక్షి అండ లేకుండా పోతే ప్రభుత్వ పెద్దల ఆర్థికమూలాలు అతలాకుతలం అవుతాయని పెద్దలు గ్రహించినట్టున్నారు. 

అందుకే ఆ ఉపద్రవాన్ని నిరోధించాలంటే ఉద్యోగులను మచ్చిక చేసుకోక తప్పదని, వారిచ్చిన అల్టిమేటం కంటే ముందే 12 గంటలకు చర్చల కోసం కేటాయించారన్న వ్యాఖ్యానాలు ఉద్యోగ సంఘాల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి జోరుగా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఉద్యోగులందరినీ ఎలుకల్లా భావించి.. వారిని దారికి తెచ్చుకునేందుకు పిల్లి మెడలో గంట కట్టాలని భావించిన జగన్ సర్కారు... ఆఖరుకు తానే ఓ మాయదారి పిల్లిగా మారిపోయి ఉద్యోగులు అనే ఎలుకల ముందు పిల్లిమొగ్గలు వేస్తుండడమే అసలు ట్విస్టు. రానున్న రోజుల్లో మారబోయే పరిణామాలను జగన్ సర్కారు అప్పుడే గ్రహించిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. 

By
en-us Political News

  
తనను పార్టీ నుంచి బయటకు గెంటేసిన బీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తానని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో అవినీతి జరిగిందని ఇప్పటికే బాహాటంగా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన కల్వకుంట్ల కవిత ఈ సారి కేటీఆర్ రాజకీయాలను ఎండగట్టారు. తన సోదరుడు కేటీఆర్ కంటే పార్టీ కోసం తానే ఎక్కువగా కష్టపడ్డాన విస్పష్టంగా తేల్చేశారు.
శివాజీ చేసిన వివాదాస్పద కామెంట్లపై నాగబాబు కౌంటర్ ఒకింత ఘాటుగా ఉంది. అందులో సందేహం లేదు. అయితే మామూలుగా అయితే నాగబాబు కౌంటర్ వివాదాస్పదం అయ్యే అవకాశం లేదు. కానీ శివాజీ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒకింత సానుకూలత వ్యక్తం చేయడంతో నాగబాబును వివాదంలోకి లాగారు. సోషల్ మీడియా వేదికగా నాగబాబుపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు.
ఇక కుటుంబ వారసత్వం రేహాన్ వాద్రాకు అప్పగించడానికి రాహుల్ రెడీ అయిపోయారనడానికి సూచనగా.. రేహాన్ వాద్రా పేరు చివర గాంధీని కూడా ఇటీవలే అధికారికంగా చెర్చారు. ఔను రేహాన్ ఇంటి పేరును వాద్రా గాంధీగా ప్రికాంక వాద్రా అధికారికంగా మార్పించారు.
ఆలయ ప్రాంగణంలో గానీ, మీడియా ముందు గానీ రాజకీయ వ్యాఖ్యలు చేసే వారిపై, వాటిని ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న హెచ్చరికలు సైతం జారీ చేసింది. తిరుమలగిరిపై కేవలం “గోవింద నామస్మరణ” మాత్రమే ఉండాలన్నది టీటీడీ భావన.
అసెంబ్లీ, మండలిలో పార్టీ గళాన్ని బలంగా వినిపించేందుకు సీనియర్ నేతలకు బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలుగా బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకాల ద్వారా అటు అసెంబ్లీలో, ఇటు మండలిలో అధికార పక్షాన్ని దీటుగా ఎదుర్కోవాలని దిశానిర్దేశం చేసినట్లయింది. అయితే అలా నియమించిన ఉప నేతలలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు పేరు లేదు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేతలను నియామస్తూ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు
ఈ నేపథ్యంలోనే పంచాయతీ ఎన్నికల్లో లభించిన విజయానికి కొనసాగింపు సాధ్యమైనంత త్వరగా మునిసిపోల్స్ నిర్వహించేయాలని రేవంత్ సర్కార్ యోచిస్తోంది.
ఇటీవ‌ల జ‌గ‌న్ పుట్టిన రోజు సందర్భంగా పొటేళ్ల‌ను బ‌లిచ్చి ఆయ‌న‌ ఫోటోల‌కు ఆ ర‌క్తాన్ని త‌ర్ప‌ణం చేశారు వైసీపీ అభిమానులు. అంతేనా హింసాత్మ‌క కామెంట్లను ఫ్లెక్సీల‌పై పోస్ట్ చేసి.. వీరంగం ఆడారు.
అధికారం అండ చూసుకుని మంచి, చెడు, ఉచ్ఛం, నీచం అన్న తేడా లేకుండా దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు, కబ్జాలతో చెలరేగిపోయారు. అటువంటి నేతలంతా వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత నాటి తప్పిదాలకు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.
అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.
తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన మార్పు కానవచ్చింది. సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.
ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు.
సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.